-
మళ్లీ చదువుల ఒడికి
దీర్ఘకాలం డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి.. దీర్ఘకాలం డ్రాపౌట్స్గా గుర్తించిన విద్యార్థులకు సంబంధించిన కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ పనులకు వెళ్తున్నారా? అనే వివరాలను సేకరించడంతో పాటు తల్లిదండ్రులకు నచ్చచెప్పి చదువుల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ బడిబాట పట్టిస్తున్నారు. ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. సాక్షి, అమరావతి: కారణం ఏదైనప్పటికీ ఓ చిన్నారి చదువులకు దూరమైతే రేపటి తరాలకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. ఆ ఒక్క కుటుంబమే కాకుండా సమాజం మొత్తంపై ఈ ప్రభావం పడుతుంది. పేద కుటుంబాల్లో విద్యా కుసుమాలు వికసించినప్పుడే దుర్భర దారిద్య్రానికి సంపూర్ణంగా తెర పడుతుంది. ఒకవైపు విద్యారంగ సంస్కరణలతో చదువులను చక్కదిద్ది అడుగడుగునా ప్రోత్సహిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు వివిధ కారణాలతో స్కూళ్లకు దూరమైన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అర్ధాంతరంగా బడి మానేసిన చిన్నారులను గుర్తించి తిరిగి పాఠశాల బాట పట్టించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,47,687 మంది విద్యార్థులను తిరిగి బడిలో చేర్చడం ఇందుకు నిదర్శనం. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక తదితర పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ విధానం, ఫౌండేషన్ స్కూళ్ల ద్వారా చదువులను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ పాఠశాల వయసు పిల్లలంతా బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సచివాలయాలు కేంద్రంగా ఆయా పరిధిలోని స్కూళ్లలో చదివే పిల్లల హాజరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా “కన్సిస్టెంట్ రిథమ్స్’ యాప్ను తీసుకొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు పిల్లలు బడికి గైర్హాజరైతే వలంటీర్తో పాటు సంక్షేమ, విద్యా అసిస్టెంట్ సంబంధిత విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుంటున్నారు. బడికి రాకపోవడానికి కారణాలను వాకబు చేస్తున్నారు. ఏదైనా సమస్య కారణంగా బడి మానేసినట్లు గుర్తిస్తే తగిన పరిష్కార మార్గాలను చూపేలా కృషి చేస్తున్నారు. వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. క్రమం తప్పకుండా సమీక్ష రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ విద్యారంగ సంస్కరణల ఫలాలు అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో కొద్దిమంది పిల్లలు మధ్యలో బడి మానేయడానికి కారణాలను సచివాలయాల వారీగా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పిల్లల డ్రాపౌట్లు, పాఠశాలల్లో చేరికలపై సమీక్ష చేపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో స్కూళ్లవారీగా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. స్కూల్ హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు, సంక్షేమ, విద్యా అసిస్టెంట్, గ్రామ ముఖ్యలతో కమిటీలను నియమించారు. ఈ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుతో పాటు వివిధ వసతులపై సమీక్షిస్తుంది. పిల్లలు మధ్యలో బడి మానేయకుండా తగిన చర్యలు చేపడుతుంది. ప్రతి నెలా కమిటీ సమావేశమై తీసుకున్న చర్యలపై పాఠశాల విద్యాశాఖకు నివేదిక అందచేస్తుంది. వారంలో ఒక రోజు బడి బాట ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన వివరాలను కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్ధులు హాజరుతో పాటు ఎన్రోల్మెంట్, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలో సౌకర్యాలను పర్యవేక్షించి వివరాలను యాప్లో పొందుపరుస్తున్నారు. ఏఎన్ఎంలు నెలలో ఒక రోజు స్కూళ్ల వద్దకు వెళ్లి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్ వివరాలను యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు వారంలో ఒక రోజు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పర్యవేక్షించి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. వీటిని పరిశీలించి ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. సందర్శన ఫోటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. పాఠశాలలను ఇలా సూక్ష్మస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. -
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
కాలేజ్ డ్రాప్అవుట్స్..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..!
Zepto Success Story In Telugu: కాలేజ్ డ్రాప్అవుట్స్...! అయితేనేం ఒక చిన్న ఐడియా 19 ఏళ్ల యువకుల జీవితాలనే మార్చేసింది. సుమారు రూ. 4310 కోట్ల విలువ కల్గిన కంపెనీకి అధిపతులుగా అవతారమెత్తి ఔరా..! అనిపిస్తున్నారు ముంబై యువకులు. బలమైన బేసిక్స్తో..కంపెనీ స్థాపన..! ముంబైకు చెందిన 19 ఏళ్ల కుర్రాళ్లు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాం కోర్సు నుంచి తప్పుకున్నారు. భారత్కు వచ్చిన వీరు ఇరువురు జెప్టో (Zepto) అనే గ్రాసరీ స్టార్టప్ను స్థాపించారు. కంప్యూటర్ సైన్స్లో బలమైన బేసిక్స్ ఉండడంతో ఈ స్టార్టప్ నిర్వహణ మరింత సులువైంది. తొలుత ముంబై నగరాల్లో వీరు జెప్టో గ్రాసరీ సేవలను మొదలుపెట్టారు. భారీగా ఆదరణ రావడంతో బెంగళూరు, ఢిల్లీ, మరో నాలుగు నగరాలకు ఈ స్టార్టప్ సేవలను విస్తరించారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్లు..! వై కాంబినేటర్ నిర్వహించిన ఫండింగ్ రౌండ్లో తాజాగా 100 మిలియన్ డాలర్లను జెప్టో సొంతం చేసుకుంది. జెప్టో కంపెనీ స్థాపించిన 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 4310 కోట్ల) కంపెనీగా అవతారమెత్తింది. ఈ కంపెనీ ప్రముఖ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఈ స్టార్టప్కు గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, బ్రేయర్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీకు చెందిన లాచీ గ్రూమ్ వంటి ఇన్వెస్టర్లు మద్దతునిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలకు భారీ పోటీ...! భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల అభిప్రాయం. దీంతో ఆయా దిగ్గజ కంపెనీలు ఆన్లైన్ డెలివరీలపై దృష్టిసారించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీలు బ్లింక్ఇట్, డూంజో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న కంపెనీలకు జెప్టో భారీ పోటీనిస్తోంది. చదవండి: పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..! -
అక్షరానికి దూరమైన బాల్యం కోసం ‘ఆమె’ తాపత్రయం..!
Sabiha Hashmi Story In Telugu: ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మార్గం కూడా ఉంటుంది. సమయం కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ సబిహా హష్మి. స్కూల్ డ్రాప్ అవుట్లుగా మిగులుతున్న బాలికల కోసం ఆమె ఏడు పదుల వయసులో మళ్లీ ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన సబిహా హష్మి నేషనల్ మ్యూజయమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ అండ్ మ్యూజయాలజీలో పీహెచ్డీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్లోని హెరిటేజ్ స్కూల్లో పిల్లలకు స్కెచింగ్, పెయింటింగ్, కళల చరిత్ర బోధించేవారు. పిల్లలకు బోధనేతర విజ్ఞానం కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లేవారు. ఓసారి ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి కుగ్రామాల్లో నివసించే అమ్మాయిలను చూసి బాధపడేవారామె. స్కూలు వయసులోనే చదువు మానేసి పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో, ఇంటి బాధ్యతలు మోస్తున్న ఆడపిల్లలు కనిపించేవారు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. అక్షరానికి దూరమైన బాల్యం ఆమె గుండెను కదిలించేది. అయితే వాళ్ల కోసం తాను చేయగలిగిందేమీ ఆమెకు కనిపించలేదు. అప్పటికామె చేయగలిగింది బాధపడి ఊరుకోవడమే. ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్లకు ఆమె పిల్లల దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె 2010 లో కర్నాటక, రామనగర జిల్లా, జ్యోతిపాళయ గ్రామానికి వచ్చారు. ‘‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా హిమాలయ పర్వత గ్రామాల్లో చూసినటువంటి దృశ్యాలు కనిపించాయి. నేను అక్కడ చూసినప్పుడు అక్కడి అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే తగిన ఆర్థిక వెసులుబాటు లేదు. ఇప్పుడైతే నాకు చేతనైనదేదో చేయగలను... అనిపించింది. గ్రామం శివారులో మా పొలానికి సమీపంలో చిన్న కాటేజ్ కట్టించి బాలికలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చే బాలికల్లో ఓ ఎనిమిది మందికి పుస్తకాలు కొనుక్కోవడం కూడా కష్టమేనని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. వాళ్ల చదువు కొనసాగాలంటే పుస్తకాల వంటి కనీస అవసరాలు తీరాలి. నాకు కొంత స్థిరమైన సంపాదన ఉంటే తప్ప సాధ్యం కాదనిపించింది. దాంతో స్థానికంగా ఓ స్కూల్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అలాగే నాకు ఆర్ట్, క్రాఫ్ట్ కూడా తెలిసి ఉండడంతో పిల్లలకు పాఠాల తర్వాత బొమ్మలు వేయడం, కార్డ్బోర్డుతో బుక్ రాక్, పెన్సిల్ హోల్డర్, రిమోట్ బాక్సులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలు వంటి ఇంటి వాడుకలో అవసరమైన వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. వీటిని నెలకోసారి నేను పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్న స్కూల్లో స్టాల్ పెడతాం. చదవండి: Baldness Cure: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు పరిష్కారం..! ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా ఉత్పత్తులను తీసుకుంటుంది. అలా వచ్చిన డబ్బుతో జ్యోతిపాళయంలో చదువుకు దూరమైన ఆడపిల్లల చదువు కొనసాగుతోంది. నలుగురు విద్యార్థినులు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఈ మధ్యనే ఒకమ్మాయి బీఈడీ పూర్తి చేసింది. ఒకమ్మాయి బీకామ్ 74 శాతంతో పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంటెంట్గా చేస్తోంది. నా దగ్గర చదువుకుంటున్న వాళ్లలో బాలికలతోపాటు పెళ్లయిన యువతులు, బిడ్డ తల్లులు ఉన్నారు. పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లలేకపోయినప్పటికీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటామని వచ్చే వాళ్లు, చదువుకోవడం ద్వారా తమకంటూ ఒక గుర్తింపు కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్ల చేత స్కూల్ డ్రాప్ అవుట్ చేయించి పెళ్లి చేసినన తల్లిదండ్రుల మీద ఆగ్రహం కలుగుతుంటుంది కూడా’’ అంటారు సబిహా హష్మి. అజ్జి లైబ్రరీ! సబిహ తన డెబ్బై రెండేళ్ల వయసులో తన అక్షరసేవను పాఠ్యపుస్తకాల నుంచి కథల పుస్తకాలకు విస్తరింపచేశారు. పిల్లల పుస్తకాలతో ఒక మోస్తరు లైబ్రరీని ఏర్పాటు చేశారామె. ఆ లైబ్రరీ పేరు ‘అజ్జిస్ లెర్నింగ్ సెంటర్’. అజ్జి లైబ్రరీకి జ్యోతిపాళయం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా వారానికోసారి వచ్చి పుస్తకాలు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. ఆమె సర్వీస్ను చూసిన వాళ్లు ప్రశంసలతో సరిపుచ్చకుండా లైబ్రరీ విస్తరణ కోసం విరాళాలిస్తున్నారు. దాంతో ఆమె కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అజ్జి లెర్నింగ్ సెంటర్ను పిల్లల సమగ్ర వికాసానికి దోహదం చేసే వేదికగా మలచాలనేదే తన కోరిక అంటారామె. ఇలాంటి వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు. బడికి దూరమైన అమ్మాయిల జీవితాలు అక్షరాలా బాగుపడతాయి. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement