-
కళాశాలల్లో ‘నిషా పెన్’ !
సాక్షి, అమరావతి బ్యూరో : ఈ–సిగరెట్.. దీనిపై కేంద్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీ నుంచి నిషేధం విధించింది. అయినప్పటికీ రాజధాని నగరం విజయవాడలో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని ఓ కళాశాలలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేయగా ఈ–సిగరెట్ల బాగోతం వెలుగుచూసింది. విద్యార్థులు గంజాయితోపాటు వీటిని కూడా వినియోగిస్తున్నట్లు బహిర్గతమైంది. ప్రస్తుతం వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, నిల్వ, పంపిణీ, ప్రచారం అన్నిటిపైనా నిషేధం అమలులో ఉంది. కానీ నగరంలో చాపకింద నీరులా ఈ–సిగరెట్ విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎంతో ప్రమాదం.. ధూమపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్గా మారింది. ఊపిరితిత్తుల వ్యాధులతో మృతి చెందుతున్న వారిలో పొగ బాధితులే అధికం. పొగ ఊపిరితిత్తులకు చేరుకోగానే, గుండె ఎక్కువ శ్రమించాలి. సాధారణం కంటే ఇది 10–25 నిమిషాలు అదనంగా కొట్టుకోవాలి. రక్తపోటులో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి. ప్రతి దమ్ముకు రక్తపోటు 10–15 శాతం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఆస్పత్రులకు వస్తున్న నోటి క్యాన్సర్ రోగుల్లో 40 శాతం పొగాకు బాధితులే. ఇంట్లో పొగ తాగే వారి కారణంగా మిగతా సభ్యులూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్తమా, దగ్గు, ఇతర ఊపిరితిత్తుల ఇబ్బందులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇక 1 నుంచి 10 సిగరెట్లు తాగేవారిలో క్యాన్సర్ ప్రమాదం 20 శాతం ఉండగా 11–20 శాతం వరకు పీల్చేవారిలో 31 శాతం.. 21 ఆపైన 57 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే.. సాధారణ సిగరెట్లలో నికోటిన్, అసిటోన్, అమెనియా, ఆర్సెనిక్, బెంజిన్, బ్యూటేన్, కాడ్మియం, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనేడ్, మిథనాల్, నాఫ్తలీన్, నికెల్, ప్రొపైన్, స్టిరియారిక్ ఆమ్లం తదితర రసాయనాలు నేరుగా మనిషి దేహంపై ప్రభావం చూపుతాయి. ఇక ఈ–సిగరెట్ను ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్(ఈఎన్డీఎస్) అని వ్యవహరిస్తారు. దీనిలో నికోటిన్ మాత్రమే కాక ప్రొపైలిన్ గ్లెకాల్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకమని వైద్యులు చెబుతున్నారు. ద్రవ రూపంలో ఉన్న నికోటిన్ ఎలక్ట్రానిక్ పరికరంలో ఉంటుంది. అందులో బ్యాటరీ అమర్చి ఉంటుంది. నోట్లో పెట్టుకొని పీల్చినప్పుడు బ్యాటరీ నికోటిన్ను మండిస్తుంది. దీర్ఘంగా పీల్చే అవకాశం ఉంటుంది. దీంతో ధారాళంగా పొగ ఊపిరితిత్తులకు చేరి శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి అలవాటు పడితే బయటకు రావడం కష్టమే. తొలుత ఒక దమ్ము.. రానురాను రోజుకు 10–20 దమ్ముల వరకు వెళుతుంది. దీనిని మానేసేందుకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనలతో నికోటిక్ ఛూయింగ్గమ్తో పాటు నికోటిక్ ప్యాచ్ వాడితే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. నిషా పెన్ ఇదే ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం.. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్, స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నారు. ఇటీవల కాలంలో కిలోల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. విచారణలో ఇది విద్యార్థుల కోసం రవాణా చేసినట్లుగా తేలింది. తాజాగా ఈ–సిగరెట్ విక్రయాలు, వినియోగం కూడా సాగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలి : మోదీ
న్యూఢిల్లీ : దేశ ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇ సిగరెట్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ప్రస్తావించారు. అలాగే దేశ ప్రజలకు నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి దేశ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే తను అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్తో మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. లతాజీ 90వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని.. ఆమెను మనం దీదీ అని సంబోధించాల్సి ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఆరోగ్యం మీద ఇవి చెడు ప్రభావాన్ని చూపుతాయి. పొగాకు వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు బారిన పడిన చాలా మంది క్యాన్సర్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదల మీద ఇది చెడు ప్రభావన్ని చూపెడుతుంద’ని అన్నారు. అలాగే వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడిన మోదీ.. మహాత్ముని 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రజలంతా నిషేధించాలి. 130 కోట్ల మంది భారతీయులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకాన్ని నిషేధిస్తూ ప్రతిజ్ఞ తీసుకోవడం దేశానికే కాకుండా, ప్రపంచానికే గర్వకారణం. దేశ ప్రజలంతా ఇందుకు సహకరిస్తారనే నమ్మకం తనకుంద’ని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దాం.. పండుగ సందర్భంగా కుటుంబాల్లో ఎంతో సందండి నెలకొంటుంది.. ఇలాంటి సందర్భంలో పండుగ జరుపుకోలేని వారికి సాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీపావళి రోజున లక్ష్మి దేవి ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఆనందాన్ని, సంపదను తీసుకురావాలని ఆకాంక్షించారు. మన ఇళ్లలోని కూతుళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన కూతుళ్లు సాధించిన ఘనత ప్రపంచానికి తెలిసేలా.. వారి విజయాలను సోషల్ మీడియాలో #BHARATKILAXMI హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయాలని కోరారు. గతంలో ‘సెల్ఫీ విత్ డాటర్’ ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దామని మోదీ పేర్కొన్నారు. -
సంపద పెంచుకోవడానికే కదా నిషేధం!
న్యూఢిల్లీ: ఇ- సిగరెట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇ-సిగరెట్లతో పాటు మొత్తంగా పొగాకు ఉత్పత్తులన్నింటిపై నిషేధం విధించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అత్యధిక ఆదాయం ఇచ్చే పొగాకు సిగరెట్లపై కూడా నిషేధం విధించడానికి కేంద్రానికి మనసు ఎలా ఒప్పుతుందిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇ-సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. అమెరికాలో ఇ-సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ఇ-సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఎవరి దగ్గరైనా ఇ-సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.(చదవండి : 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు..ఎందుకు హానికరం) ఇక ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు...‘ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇ-సిగరెట్లను నిషేధించలేదు. ఖజానాను నింపుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సిగరెట్లపై నిషేధం విధిస్తే ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఆదాయం కోల్పోతారు కదా. అందుకే వాటిని నిషేధించే ధైర్యం చేయలేరు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల సిగరెట్లపై నిషేధం విధించాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా..‘ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పొగాకు ఉత్పత్తుల వినియోగదారుల జాబితాలో భారత్ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. పొగాకు ఉత్పత్తుల కారణంగా ఏడాదికి 9 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్లో వీటి గురించి ప్రస్తావన లేదు. చాలా ఆనందం. ఇ- సిగరెట్లపై నిషేధంతోనే సరిపెట్టండి. బాగుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. సిగరెట్ తాగే అలవాటు మానుకోవడానికి ఇ- సిగరెట్లు ఆశ్రయించే వారు ఇప్పుడు సాధారణ సిగరెట్ కాలుస్తారు. కాబట్టి వాటిని అమ్మే వారి ఆదాయం బాగానే పెరుగుతోంది అంటూ వివిధ రకాల మీమ్స్తో విమర్శలు గుప్పిస్తున్నారు. Banning #ecigarettes by the Government is not because of Health, It is because of Wealth. They'll not ban regular cigarettes, because of heavy revenue from it. If they really cares about the Health and Disease , then they have to ban the entire cigarette of all types. pic.twitter.com/EtXOpAOTfg — Md Furquan Ahmad (@FurquanAMU) September 18, 2019 The short journey of #ecigarettes Dealers, retailers and smokers pic.twitter.com/jsdwtLZ6Kz — gajender (@gajender00) September 18, 2019 -
ఇ–సిగరెట్లపై నిషేధం
న్యూఢిల్లీ : ఇ–సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇ–సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇ–సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది. ఎవరి దగ్గరైనా ఇ–సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేయడం నేరమే. వీరికి రూ.50 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వరకు విధిస్తారు. ఇ–సిగరెట్లను నిల్వ చేసినవారు ఆర్డినెన్స్ అమలయ్యే నాటికి వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో జమ చేయాలి. జూల్ ల్యాబ్స్, ఫిలిప్ మారిస్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు తమ ఇ–సిగరెట్ వ్యాపారాలను భారత్కు విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం తీసుకురానున్నారు. అమెరికాలో ఇ–సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించామని నిర్మల చెప్పారు. ఇ–సిగరెట్లను చూపుతున్న మంత్రి నిర్మల ఇ–సిగరెట్లు ఎందుకు హానికరం ? ఇ–సిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అనే పదార్థం వేడెక్కి ఆవిరిగా మారి పొగ పీల్చడానికి అనువుగా మారుతుంది. సంప్రదాయంగా పొగాకు తాగడం, సిగరెట్లు కాల్చడం కంటే ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరమనే వివిధ నివేదికలు వెల్లడించాయి. పొగతాగడం కంటే ఇ–సిగరెట్స్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, ఇ–సిగరెట్లను నిషేధించాల్సిన సమయం వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ‘ప్రస్తుతం అమెరికా కంటే భారత్లోనే ఇ–సిగరెట్లను పీల్చడం ఒక ఫ్యాషన్గా మారింది. అయితే నగరాలకే ఈ ట్రెండ్ పరిమితం కావడంతో వ్యాధులు, మృతులు వంటివేవీ వెలుగులోకి రాలేదు’ అని పల్మనాలజిస్ట్ అర్జున్ ఖన్నా అన్నారు. 460 బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్లు భారత్లో 460 ఇ–సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్లో లభిస్తున్నాయి. అయితే ఇవేవీ భారత్లో తయారవడం లేదు. 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ–సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది. భారత్లో ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇ–సిగరెట్లపై నిషేధం విధించారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్లాండ్ సహా 31 దేశాలు ఇ–సిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది రెగ్యులర్గా ఇ–సిగరెట్లను వాడుతున్నారు. 2011–16 సంవత్సరాల మధ్య వీటి వాడకంలో 900 శాతం వృద్ధి నెలకొంది. పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో భారత్లో ప్రతీ ఏడాది 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత పొగ తాగే వారు అత్యధికంగా భారత్లోనే ఉన్నారు. మొత్తంగా 10.6 కోట్ల మంది పొగాకు బానిసలుగా మారారు. -
కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ర్టానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను వెల్లడించారు. దేశంలోని యువతపై ఈ-సిగరెట్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నాం. వాటిపై ప్రకటనలు, విక్రయం కూడా ఇక నేరమే. దీనికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది’ అంటూ కేబినెట్ నిర్ణయాలను నిర్మలా వివరించారు. పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ-సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement