-
పదిలో బాలికలదే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచారు. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట సాయి మనస్వి రాష్ట్రస్థాయిలో 600 మార్కులకు 599 సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 11,941 మందికి 10,036 మంది, బాలురు 11,222 మందికి 8,513 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 13,851 మంది ప్రథమ శ్రేణిలో, 3,116 మంది ద్వితీయ శ్రేణిలో, 1,582 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే జిల్లా మాత్రం రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. గతేడాది 64.35 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం. 71 పాఠశాలల్లో నూరుశాతం జిల్లాలోని 71 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణులు కాగా వీటిలో ప్రభుత్వ రంగ పాఠశాలలు పది ఉన్నాయి. నాగిరెడ్డిగూడెం ఏపీఆర్సీహెచ్ స్కూల్, ముసునూరు ఏపీ ఆర్ఈహెచ్ స్కూల్, అప్పలరాజుగూడెం ఏపీ ఆర్ఎస్ బాలుర స్కూల్, వేలేరుపాడు కేజీబీవీ, లంకపల్లి జీటీడబ్ల్యూహెచ్ స్కూల్, వీరమ్మకుంట జెడ్పీ హైస్కూల్ స్కూల్, కుక్కునూరు కేజీబీవీ, కేతవరం జెడ్పీ హైస్కూల్ స్కూల్, వేదాంతపురం జెడ్పీ హైస్కూల్, చింతలపూడి ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల ఉన్నాయి. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ : పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు వచ్చేనెల 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఈనెల 23 నుంచి 30 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 23 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. కాగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు లు చేసుకోవాలనుకునే విద్యార్థులు హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజును ఆన్లైన్లో చెల్లించాలన్నారు. బీసీ గురుకులాల్లో విఘ్నేష్ నరసాపురం రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో నరసాపురం మహాత్మా జ్యోతిబా పూలే మత్స్యకార బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బి.విఘ్నేష్ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ గోటేటి వేణుగోపాలకృష్ణ తెలి పారు. జిల్లాలో 8 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తమ పాఠశాలలో 36 మందికి 34 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు ద్వితీయ, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారన్నారు. 10 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారన్నారు. సర్కారీ బడి.. ఫలితాల్లో సవ్వడి జిల్లాలోని ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆకట్టుకున్నారు. ● శనివారపుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మురాల మహేష్బాబు 588 మార్కులు, ● గూటాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గర్రే సాయి తన్మయి 587, ● కై కరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని శానం నందిని ప్రియ 587, ● చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జె.యశ్వంత్ 586, ● పూళ్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పులి లక్ష్మీ గాయత్రి 585, ● అప్పలరాజుగూడెం ఏపీఆర్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థి తిరిమిల్లి జగన్నాథం 584, ● నాగిరెడ్డిగూడెం ఏపీఆర్జీహెచ్ స్కూల్ విద్యార్థినులు ఎం.అనురాధ లక్ష్మీ ఐశ్వర్య 584, కస్సే హనీ 584, ● నూజివీడు ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి బెజవాడ ప్రేమ చంద్రిక 584, ● వడలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పామిరెడ్డి దీక్షిత 583, ● నూజివీడు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి బత్తుల భువనేశ్వరి 583, ● షేక్ షబానా మెహరాజ్ 583, ● గణపవరం సీహెచ్ఎస్జెడ్పీ పీజీ హైస్కూల్ విద్యార్థి నాభిగారి మేఘన 583 మార్కులు సాధించారు. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో జిల్లా విద్యార్థిని టెన్త్ ఫలితాల్లో సత్తాచాటినప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 80.08 శాతం ఉత్తీర్ణత మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు -
హోమ్ ఓటింగ్కు చివరి అవకాశం
ఏలూరు(మెట్రో): పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. 85 ఏళ్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ మేరకు అర్హుల ఇంటి వద్దకే వెళ్లి బీఎల్ఓలు ఫారం–12(డి) అందిస్తున్నారన్నారు. దరఖాస్తును పూరించి ఈనెల 23లోపు సెక్టోరల్ అధికారులకు అందించాలన్నారు. వీటిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి వచ్చేనెల 2 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పిస్తారన్నారు. -
నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఏలూరు(మెట్రో): బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల విభాగాల నోడల్ అధికారులు, వ్యయ పరిశీలకులతో ఆమె సమీక్షించారు. పోస్టల్ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్లపై దృష్టి సారించాలన్నారు. మద్యం రవాణా సమయంలో సక్రమమైన సమయంలో చేరాల్సిన చోటుకు చేరిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలపై నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థుల అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ వె.ప్రసన్నవ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.13.54 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం సీజ్ చేశామన్నారు. సీ–విజిల్కు సంబంధించి 329 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల అజ్జర్వర్లను నియమించి తొలిదశ శిక్షణ పూ ర్తిచేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్ర శాంతి మాట్లాడుతూ జిల్లాలో అంతర రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల వద్ద 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ బృందాలు, మొబైల్ చెక్పోస్టులను నిర్వహి స్తు న్నామని చెప్పారు. డీఆర్వో డి.పుష్పమణి, అ దనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, జెడ్పీ సీ ఈఓ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రాట్నాలమ్మ తిరునాళ్ల
పెదవేగి : రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీరాట్నాలమ్మ అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరిగే తిరునాళ్లకు రాట్నాలమ్మ దేవస్థానం ముస్తాబైంది. భక్తుల పాలిట కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిన రాట్నాలమ్మ ఆవిర్భావం తూర్పుచాళుక్యుల కాలంలోనే జరిగింది. రాజవంశం రత్నాలు సమర్పించి కోరిన కోరిక మేరకు ఈ వేంగిపుర ప్రాంతంలో అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో కలశాలతో పులివాహనంపై ఈ ప్రాంతంలో రత్నలమ్మగా వెలసింది. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్టువు, కాలభైరవుడు, కుమారస్వామి, చతుర్భుజ దుర్గాదేవి, షడ్భుజదుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి సప్తమాత్రుకలు వైదేహి సూర్య ఉషాదేవి తదితర పరివార దేవతలతో అమ్మవారు ఇక్కడ కొలువై ఉంది. నాటి రత్నలమ్మ నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధి చెందింది. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి.. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లు వైభవంగా నిర్వహిస్తారు. తిరునాళ్లు విజయవంతానికి ఆలయ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. -
గిరిజన సూపర్ బజార్ ప్రారంభం
బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జీసీసీ డీఎం జి.పార్వతీశం చెప్పారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో గిరిజన సూపర్ బజార్ కాఫీ హౌస్ను పార్వతీశం సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న తేనెకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా జీసీసీ సూపర్ బజార్లో ముఖ్యంగా జీసీసీ ద్వారా విక్రయిస్తున్న మరొక ఉత్పత్తి అరకు కాఫీకి కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పేరుందని అన్నారు. అరకు కాఫీని పశ్చిమ మన్యం ప్రాంతంలో కూడా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే బుట్టాయగూడెంలో ప్రత్యేకంగా అరకు కాఫీ షాప్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక్కడ కాఫీ తయారు చేసి విక్రయించడమే కాకుండా కాఫీపొడి ప్యాకెట్లను కూడా విక్రయిస్తామని చెప్పారు. అలాగే కుంకుడుకాయ ప్యాకెట్లు, షాంపూలు, బొబ్బర్లు, అలోవెరా సబ్బులు, త్రిఫల, తదితర వస్తువులను విక్రయిస్తున్నామని అన్నారు. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సీహెచ్ రాజయోగి, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై చింతమనేని జులుం
ఏలూరు టౌన్: అధికారులపై దౌర్జన్యం, దాడులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ వద్దకు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయారు. శ్రీఓవరాక్షన్ చేయవద్దని చెప్పు... చేస్తే ఏం చేయాలో నాకు తెలుసు.. మీకు రెండు నిమిషాలే సమయం ఉంది.. నా స్ట్రెంగ్త్ ఎంతో తెలుసా.. ఏమీ లేకుండా బిల్డప్లు ఇవ్వొద్దు మీరంతాశ్రీ అంటూ విరుచుకుపడ్డారు. మేము 60 లక్షల మంది ఉన్నాం.. పోలీసులు మీరు ఎంతమందో తెలుసుగా.. అంటూ హూంకరించారు. మేము ప్రజా సేవకులం.. మీరు డబ్బులకు పనిచేస్తారు.. అంటూ చులకనగా మాట్లాడుతూ పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసు కానిస్టేబుళ్లు చింతమనేని మాటలకు ఏం చెప్పాలో తెలియక నిశ్చేష్టులయ్యారు. చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద హడావిడి మరోసారి నోరుపారేసుకున్న చింతమనేని -
వైఎస్సార్ సీపీలోకి 50 కుటుంబాల చేరిక
పెదవేగి : వైఎస్సార్ సీపీలోకి వరుస చేరికలతో నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దెందులూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు పాలడుగు భానుప్రకాష్ ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వీరందరికి పార్టీ కండువాలు కప్పిన వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, నాయకులు అశోక్గౌడ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడిన జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేక పెత్తందార్లు అమానుషదాడులు చేస్తున్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, జగనన్న సునామీని ఆపడం వాళ్ల తరం కాదని, జగనన్నకు అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు నెరుసు నాగసత్యం, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, పార్టీ పెదవేగి మండల అధ్యక్షులు జానంపేట బాబు, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం గంగరాజు, సర్పంచ్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిక పెదవేగి: తెలుగుదేశం పార్టీ వికృత చేష్టలకు విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి క్యూ కడుతున్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామానికి చెందిన సైదం గోపి తెలుగుదేశం పార్టీని వీడి దెందులూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గోపికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కోరుకొల్లు జనసేన నేతలు
కలిదిండి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కోరుకొల్లు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ చన్నంశెట్టి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు చన్నంశెట్టి భాస్కర్, పూసల పుల్లయ్య, పూసల బాలులు ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, ఉపసర్పంచ్ చన్నంశెట్టి నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షులు అంకెం నరసయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డీఎన్నార్ సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లా ఎస్సీ నాయకులు దాసి యేసుబాబు, కాన్వెంట్ కృష్ణ, చన్నంశెట్టి వెంకటరాజు, వలవల చిన్న పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్ యాదవ్ నియామకం చింతలపూడి : వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్కు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవి లభించింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గోపాల్ యాదవ్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, గుంటుపల్లి పంచాయితీ కంఠమనేనివారిగూడెం గ్రామానికి చెందిన గోపాల్ యాదవ్ సింగపూర్, మలేషియాలలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎంతో మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన టీడీపీ నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డారు. అనంతరం టీడీపీ నుండి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగదని, బీసీలకు వైఎస్సార్ సీపీ మాత్రమే న్యాయం చేయగలదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. పార్టీలో చేరిన నాటి నుంచి జిల్లాలోని బీసీలను సమాయత్త పరిచి వైఎస్సార్ సీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. బీసీలకు వైఎస్సార్ సీపీలో సముచిత స్ధానం ఉందని, బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే సీఎం వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ యాదవ్తో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే వేసి గెలిపించాలని విస్త్రృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రూ.272 పలికిన వర్జీనియా కేజీ ధర జంగారెడ్డిగూడెం : వర్జీనియా పొగాకు ధర కేజీ ఒక్కింటికి రూ.272కు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 6న వేలం ప్రారంభం కాగా, ప్రారంభ ధర కేజీకి రూ.240 లభించింది. అయితే ఇది క్రమంగా ఈ నెల 20వ తేదీ నాటికి రూ.266కు చేరుకుంది. కాగా, సోమవారం ఈ సీజన్లో అత్యధికంగా రూ.272 ధర పలికింది. అయితే ఇది ఇంకా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన కంపెనీలు వేలంలో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో చిన్న చిన్న కంపెనీలు, సప్లయిర్స్ వేలంలో పాల్గొంటున్నారు. గత ఏడాది వేలంలో కేజీ ధర అత్యధికంగా రూ.288 లభించింది. ఈ ఏడాది ఈ గరిష్ట ధర దాటి లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉంటే జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో సోమవారం కేజీ ధర రూ.272 లభించింది. కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో రూ.271, దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.268 చొప్పున విక్రయాలు జరిగాయి. తనిఖీల్లో రూ.2 లక్షల నగదు స్వాధీనం కామవరపుకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఎటువంటి ఆధారాలు లేని రూ.1.59 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మోహిద్దీన్ చెప్పారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఆటోలో వెళుతున్న వ్యక్తి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదున సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేస్తామన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది కె.రామకృష్ణ, సూర్యనాయక్, ఎ.సుధీర్, ఎం.నాగార్జున పాల్గొన్నారు. గణపవరంలో.. గణపవరం: గణపవరంలో సోమవారం ఎఫ్ఎస్టీ తనిఖీ బృందం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎన్నికల నిబంధనలకు మించి సొమ్ము కలిగి ఉన్న వ్యక్తి నుంచి రూ.1.06,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకువెళితే స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. -
భోగాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెదవేగి: పాతకక్షల నేపథ్యంలో మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పెదవేగి ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తెలిసిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన పామర్తి రంగారావు (44), అదే గ్రామానికి చెందిన మందపాక వరప్రసాద్ మధ్య పాతకక్షలు ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం రంగారావు గ్రామంలోని ఓ దుకాణం వద్దకు రాగా, అక్కడ వరప్రసాద్, రంగారావు మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. ఇది పెద్దదై వరప్రసాద్ కోపంతో తనకు అందుబాటులో ఉన్న కత్తితో దాడి చేసి రంగరావు పక్కటెముకల వద్ద పొడిచాడు. అనంతరం మెడపై కత్తితో నరకడంతో రంగారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ వెంటనే ఘటనా స్థలానికి హత్యకు గల కారణాలపై స్థానికుల నుంచి వివరాలు ఆరా తీశారు. క్లూస్టీమ్ను రప్పించి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాతకక్షలే కారణం.. కత్తితో దాడి ఘటనా స్థలంలోనే మృతి -
అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్)/కామవరపుకోట: అత్యాచారయత్నం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఏలూరు ఐదో అదనపు జిల్లా జడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన నిందితుడు నిజవరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య 2015 డిసెంబర్ 17న సాయంత్రం 4 గంటల సమయంలో ఆ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపుకోవటానికి వెళ్ళిన ఓ మహిళపై వెనుక వైపు దాడి చేసి, పట్టుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాధితురాలి తండ్రి, మరికొందరు స్థానికులు రావడంతో నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. దీనిపై బాధితులు గ్రామంలోని పెద్దలకు మొరపెట్టుకున్నారు. నిందితుడు పెద్దల వద్దకు రాకపోవడంతో బాధితురాలు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై జీజే విష్ణువర్దన్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసి నిందితుడు నిజవరపు సత్యనారాయణను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఏపీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి జి.రాజేశ్వరి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. తడికలపూడి ఎస్సై ఎం.జైబాబు, కోర్టు కానిస్టేబుల్ కొండలరావు ప్రాసిక్యూషన్కు సహకరించారు. ‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు ఏలూరు (ఆర్ఆర్పేట) : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేయడం అభినందనీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, అత్యధిక మంది విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడం వంటి ఫలితాలు విద్యాశాఖ పనితీరును సూచిస్తోందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వీరందరికీ దిశానిర్దేశనం చేసిన జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా విజయ కేతనం పుస్తకాలు అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆ పుస్తకాన్ని రూపొందించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి అంగుటూరి సర్వేశ్వర రావులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వినతి ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు. సోమవారం ఈ మేరకు ఈ–మెయిల్ ద్వారా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండా ఓటు హక్కు వినియోగించుటకు అవకాశం కల్పించాలని కోరారు. -
వ్యయ పరిమితిపై అవగాహన తప్పనిసరి
ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు గరిష్ట పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హులవుతారని, ఎన్నికల వ్యయంపై అవగాహన తప్పనిసరి అని నియోజకవర్గ ఎన్నికల పరిశీల కులు మేశ్రం గౌరవ్ మధుకర్ (ఐఆర్ఎస్) తెలిపారు. శుక్రవారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అభ్యర్థుల వ్యయ నమోదు ప్రక్రియను ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఖర్చుల నమోదు ప్రక్రియను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ వి.మురార్జీ ఆయనకు వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్.వెంకటకృష్ణ ఉన్నారు. 13న వేతనంతో కూడిన సెలవు ఏలూరు (టూటౌన్): వచ్చే నెల 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నందున జిల్లాలోని దుకాణాలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్టు కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఏదైన ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే సదరు యజమాని జరిమానాతో పాటు శిక్షార్హులుగా తెలిపారు. అజయ్రాజుకు సత్కారం ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హెచ్.అజయ్రాజును ఆర్జేడీ, జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకరరావు అభినందించారు. శుక్రవారం నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 75 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 6వ, రెండో సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచిందన్నారు. అజయ్రాజుకు అడ్వకేట్ కూన కృష్ణారావు (ఏలూరు) రూ.2 వేల నగదు పారితోషికం అందించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. ఏకాదశి ఉత్సవం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఏకాదశి ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. క్షేత్ర పురవీధుల్లో తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. పూజాదికాలను జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. అడుగడుగునా భక్తులు శ్రీవారికి నీరాజనాలను సమర్పించారు. హోం ఓటింగ్పై అవగాహన ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పలు రూపాల్లో ఏర్పాట్లు చేసిందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి రాకాడ మణి అన్నారు. శుక్రవారం స్థానిక సీనియర్ సిటిజన్ భవనంలో సీనియర్ సిటిజన్లకు హోమ్ ఓటింగ్పై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీనిలో భాగంగా ఫారం–12డీ, ఫారం–13సీ పై అవగాహన కల్పించారు. -
నామినేషన్ పత్రాలతో శ్రీవారిని దర్శించిన మంత్రి కారుమూరి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. భార్య లక్ష్మీ కిరణ్, కుమారుడు, ఏలూరు వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్ధి కారుమూరి సునీల్తో కలసి ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా స్వామి, అమ్మవార్ల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. తరువాత నామినేషన్ వేసేందుకు ఇక్కడి నుంచి తరలివెళ్లారు. రేషన్ బియ్యం పట్టివేత ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లై స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గుండుబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. ఎన్టీర్ జిల్లా గంపలగూడెం మండలం నుంచి వ్యాన్లో 3.50 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా, రమణక్కపేట వద్ద ఏలూరు డీఎస్ఓ, ఏఎస్ఓ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి స్థానిక రేషన్ డీలర్కు అప్పగించామన్నారు. యజమానులు కొడాలి వంశీకృష్ణ, మాదిరాజు కృష్ణశివదీప్, పెద్దిరెడ్డి రామచంద్రరావు, చారిలపై ముసునూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, బాధ్యులపై క్రిమినల్ కేసులు విధించడంతోపాటు, కఠిన చర్యలు తీసుకుంటామని డీటీ హెచ్చరించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.13.32 కోట్ల స్వాధీనం
ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈఎస్ఎంఎస్ కింద చేబట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా మొత్తంగా రూ.13.32 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఇందులో రూ.187.20 లక్షలు నగదు కాగా, రూ. 10.17 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.121.73 లక్షల విలువైన మద్యం స్వాధీన పరుచుకున్నామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ /ఎన్కోర్ ద్వారా అందిన అభ్యర్థనల్లో ఇప్పటివరకు 1,701 అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా 1,725 అభ్యర్థనలు రాగా 1,701 అనుమతులు జారీ చేశామని, మరో 24 పరిశీలనలో ఉన్నాయన్నారు. సీ–విజిల్ ద్వారా 362 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. అలాగే మీడియాలో ఎన్నికల ఉల్లంఘనలకు వచ్చిన 98 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా 597 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో 593 పరిష్కరించామని, మరో 4 పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున్న ప్రజలు నగదు గాని ఇతర విలువైన వస్తువులు గాను ప్రయాణ సమయంలో తీసుకువెళ్లే సమయంలో సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 15 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ప్రకటనలకు అనుమతి తప్పనిసరి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు రాష్ట్ర/జిల్లాస్థాయిలో ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. గతంలో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్టు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని, ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేసిందన్నారు. వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, జిల్లాస్థాయిలో ఎంసీఎంసీ కమిటీలను అప్రమత్తం చేశామని, ప్రకటనలను ఈ కమిటీలు ముందస్తుగా పరిశీలిస్తాయన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
చంద్రబాబును నమ్మితే సంక్షేమం దూరం
నూజివీడు: చంద్రబాబును నమ్మితే ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఉండదని, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. మండలంలోని బోర్వంచ, పాతరావిచర్ల, కొత్త రావిచర్లలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు బెంజికారు కొనిపెడతా, కేజీ బంగారం ఇస్తా అంటూ మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారని, ప్రజలెవరూ ఆయన మాటలు నమ్మడం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు రెండూ సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఉంటూ నూజివీడుకు టీడీపీ అభ్యర్థిగా వచ్చిన వలసపక్షి పార్థసారథిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొలుసుకు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ఎంపీపీ ఆరేపల్లి శిరీష, సర్పంచ్లు కుంటం ఉదయరాజు, బసవరాజు అన్నపూర్ణ, ఎంపీటీసీ తాడేపల్లి సునీత నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు -
ఆళ్ల నాని నామినేషన్తో పార్టీలో జోష్
ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో రోజురోజుకూ వైఎస్సార్సీపీ సమరోత్సాహంతో దూసుకుపోతోంది. ప్రతి రోజూ టీడీపీ, జనసేన నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని నామినేషన్ వేయడంతో నాయకుల్లో జోష్ కనిపిస్తుండగా, టీడీపీ డీలా పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలోని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఏలూరులో టీడీపీ నేతల మోసపూరిత హామీలతో ఆ పార్టీలో చేరిన వారు సైతం వెనక్కి వస్తూ వైఎస్సార్సీపీలో చేరుతుండటం విశేషం. పార్టీలో చేరికలు ఏలూరు వన్టౌన్ 1వ డివిజన్కు చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో 1వ డివిజన్ కార్పొరేటర్ ఆరేపల్లి రాధిక, వైఎస్సార్ సీపీ నాయకులు ఆరేపల్లి సత్తిబాబు ఆధ్వర్యంలో 200 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. పామర్తి సాయి, తాత నటరాజ, పామర్తి సుధీర్, తాత రంగబాబు, ఆరేపల్లి ప్రకాష్, కర్రి ప్రకాష్, వీరంకి సత్యనారాయణ, బాలు తదితరులు ఉన్నారు. అలాగే నగరంలోని కొత్తపల్లి గంగాధరరావును టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి, బలవంతంగా టీడీపీ నాయకులు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేర్చారు. కానీ రాష్ట్రంలోనూ, ఏలూరు నియోజకవర్గంలోనూ ప్రజల్లో వైఎస్సార్సీపీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి గంగాధరరావు తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ళనాని విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలాడి దుర్గారావు, ఇడా చైర్మన్, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, క్లస్టర్–3 పార్టీ అధ్యక్షులు మంచెం మైబాబు, జేసీఎస్ జిల్లా కన్వీనర్ వైఎన్వీ శివరావు ఉన్నారు. టీడీపీని వీడి.. వైఎస్సార్ సీపీలోకి నగరానికి చెందిన అయినపర్తి శ్యామ్, బొద్దాని మౌనిక, గొట్టాపు నర్సింహ తదితరులు టీడీపీను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో వీరిందరికీ ఎమ్మెల్యే ఆళ్ళనాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను ఐదేళ్ళ పాటు దోచుకున్న జన్మభూమి కమిటీలు కావాలా, లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలాడి దుర్గారావు, ఏలూరు డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్బాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్గురునాథ్ ఉన్నారు. -
ఆటోను ఢీకొన్న బైక్
వ్యక్తి మృతి, స్కూలు విద్యార్థులకు గాయాలు చింతలపూడి: ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పాత చింతలపూడిలో శుక్రవారం ఉదయం విద్యార్థులు స్కూలుకు ఆటోలో వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కృష్ణా జిల్లా గంపల గూడెం గ్రామానికి చెందిన బైముతక శ్రీను (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ఉన్న గోపాల్రెడ్డి అనే బాలుడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించివేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ సుధాకర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఎస్సై కుటుంబరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు పరామర్శించారు. భార్యపై హత్యాయత్నం.. భర్తపై కేసు నమోదు భీమడోలు: ఇంటికి నిప్పంటించి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్జావారిగూడెంలో దవులూరి వెంకటలక్ష్మీ, దవులూరి నాగరాజులకు వివాహమై ఒక పాప, బాబు సంతానం. కొంతకాలంగా తాగుడుకు బానిసైన నాగరాజు భార్య వెంకటలక్ష్మిని అనుమానిస్తూ వేధిస్తున్నాడు. దీనిపై వెంకటలక్ష్మి పెద్దల్లో పంచాయితీ పెట్టగా సర్దిచెప్పి ఆమెను భర్త నాగరాజు వద్దకు పంపించారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 15న రాత్రి మద్యం తాగి వచ్చి భార్య వెంకటలక్ష్మిని నాగరాజు తీవ్రంగా కొట్టి ఆమెను గదిలో బంధించి ఇంటికి నిప్పంటించాడు. దీనితో తలుపు పగులకొట్టి వెంకటలక్ష్మి ప్రాణాలతో బయట పడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పై కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
యలమంచిలి: వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా మరోసారి ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) కోరారు. కాంభొట్లపాలెంలో శుక్రవారం తన కుమారుడు సాయి బాలాజీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. గోపి మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలన్నీ లబ్థి చేకూరాలంటే తప్పనిసరిగా జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఎంపీ ఓటు గూడారి ఉమాబాలకు, ఎమ్మెల్యే ఓటు తనకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని గోపి కోరారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, సర్పంచ్ అనిశెట్టి మల్లిక నవణ్, తుంగా అమూల్య, ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శీలం వీరబాబు, జేసీఎస్ మండల కన్వీనర్ ఓదూరి భాస్కరరావు, జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు వల్లభు సాయి వెంకట నరసింహారావు, పాలకొల్లు ఏఎంసీ డైరెక్టర్ మంద హరికుమార్ పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయీస్ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు తెలిపారు. 8లో uఅభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి ఎమ్మెల్యే కొఠారు దెందులూరు: గత ఐదేళ్లలో సీఎం జగన్ పాల నలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గత చంద్ర బాబు హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాత్రి పెరుగ్గూడెం గ్రామంలో ఆయన ఎన్ని కల ప్రచారం చేశారు. ప్రజలందరి బాగు కో సం సీఎం జగన్ నవరత్నాల పథకాలతో పా టు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం అందిస్తారన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, సర్పంచ్ యలమర్తి రేవతి, కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నల్లూరి వెంకట్రామయ్య (బాబి), పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యలమర్తి సత్తిబాబు, ఎంపీటీసీ యలమర్తి బాపూజీ, పార్టీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని, నాయకులు పాల్గొన్నారు. -
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్ ఫ్యాన్స్ని..
పశ్చిమగోదావరి డెస్క్: అవును నేను ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే.. కానీ ఫ్యాన్ ఫ్యాన్స్ని.. అంటున్నారట ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పలువురు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. తమ సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడుకునే సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూసి వారి సన్నిహితులు.. ఏమైందన్నా నీ మైండ్ ఖరాబైందా అని అంటున్నారంట. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్.. నేను మాత్రం జగన్ ప్రజలకు చేస్తున్న సేవకే ఫ్యాన్స్ అయ్యానంటున్నావ్.. ఇదేందన్నా అని ప్రశ్నిస్తున్నారంట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థిస్తూ జనం దగ్గరికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. పలువురు జనం జగన్ అందించిన పథకాలతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మా రాయని.. తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు జగనన్న బాటలు వేస్తున్నాడని.. పింఛన్లు తమ ఇంటికే వలంటీర్లను పంపించి అందిస్తున్నాడని.. తమ ఎదుటే ఎలాంటి బెరుకూ భయం లేకుండా చెబుతుండటం చూసి అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారట. ఇక చేసేదేమీ లేక తమ ప్రభుత్వం వచ్చినా అవన్నీ అమలు చేస్తామని చె బుతున్నారట. అయితే.. ఇవన్నీ జగనన్నే ఎలాంటి ఇబ్బందీ లేకుండా అమలు చేస్తుంటే.. ఇంక మీకెందుకు ఓటేయడం.. అని ప్రశ్నిస్తు న్నారట. దీంతో ఆయా అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారట. ఎక్కడికి వెళ్లినా.. కొంతమంది ముక్తసరిగా, మొక్కుబడి గా ముఖంలో లేని నవ్వు పులుముకొని కనిపిస్తుండటం గమనించిన నేతలు.. వారి ఓటు కచ్చితంగా తమకు పడదని ఫిక్సయి పోతున్నారంట. ఈ పరిస్థితులపై ఒక్కసారి లోతుగా ఆలోచిస్తున్న నేతలు.. సీఎం జగన్ పేదల జీవితాల్లో ఎంతటి మార్పు తెచ్చాడో కదా అని అనుకుంటున్నారంట. అదే విషయాన్ని తమ అనుయాయుల వద్ద ప్రస్తావిస్తే.. అవునన్నా మాకూ జగన్ ఇచ్చిన పథకాలు అందుతున్నాయ్.. కానీ మనం తొలి నుంచీ ఈ పార్టీనే నమ్ముకుని ఉన్నాం కాబట్టి.. ఇందులోనే తిరుగుతున్నాం.. అంటూ అసలు విషయం చెబుతున్నారంట. దీనిని బట్టి చూస్తే తమ అనుచరుల ఓట్లు తమకు పడినా.. వారి కుటుంబసభ్యుల ఓట్లు మాత్రం తమకు పడతాయనే గ్యారెంటీ లేదని ఆయా అభ్యర్థులు అయోమ యంలో పడుతున్నారంట. ఈ నేపథ్యంలోనే జ గన్ విజన్కు సలామ్ కొడుతూ.. నేను కూడా ఫ్యాన్ ఫ్యాన్సే అంటున్నారంట. కానీ తనకే ఓటు వేసి గెలిపించాలని మాత్రం ఓటర్లను ఇంటింటికీ వెళ్లి బతిమాలుకుంటున్నారంట. అదండీ సంగతి! -
నూజివీడులో బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
నూజివీడు: విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్లో మంచి క్రీడాకారులుగా ఎదగవచ్చని ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.చెంగల్రాయనాయుడు అన్నారు. పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏపీ 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు కూడా దృష్టి సారించే అవకాశం కల్పించాలన్నారు. క్రీడల వల్ల పోటీతత్త్వం, ఐకమత్యం, ఓటమిని తట్టుకునే స్వభావం, పట్టుదల, శారీరక దారుఢ్యం వంటివి పెంపొందింపబడతాయన్నారు. పోటీల్లో భాగంగా ప్రారంభ మ్యాచ్ బాలుర విభాగంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా బాలుర జట్టు కర్నూలు జట్టుపై 27–7 తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ చక్రవర్తి, కోశాధికారి జీ రేవతి, బాస్కెట్బాల్ కోచ్, నిర్వాహకులు వాకా నాగరాజు, స్కూల్ కరస్పాండెంట్ బండి శ్యామ్, డైరెక్టర్ బండి మెలోడి తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల కోలాహలం
ఆటోను ఢీకొన్న బైక్ ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాత చింతలపూడిలో ఘటన జరగ్గా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 8లో uశనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024సాక్షి ప్రతినిధి, ఏలూరు: బలమైన ముహూర్తం కావడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండటంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 25 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో ఎక్కువ మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్లకు తరలివెళ్లారు. ఊపందుకున్న ప్రక్రియ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లు వ్యవహరిస్తుండగా కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ స్థానంతో పాటు ఐదు అసెంబ్లీ నియోజవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ ర్యాలీలుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి సగటున 4 సెట్ల వరకు ఒక్కో అభ్యర్థి నామినేషన్లు వేశారు. భారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుమిత్కుమార్గాంధీకి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా తణుకు నియోజకవర్గం నుంచి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ఆచంట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం నియోజకవర్గం నుంచి ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు నామినేషన్లు సమర్పించారు. ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గోపాలపురం నియోజకవర్గం నుంచి మంత్రి తానేటి వనిత, దెందులూరు నియోజకవర్గం నుంచి కొఠారు అబ్బయ్యచౌదరి నామినేషన్లు దాఖలు చేశారు. కొఠారు అబ్బయ్యచౌదరి పెదవేగి మండలం రాట్నాలమ్మవారి ఆలయం నుంచి దెందులూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన పార్టీల నుంచి.. ఆచంట టీడీపీ అభ్యర్థిగా పితాని సత్యనారాయణ, పాలకొల్లు టీడీపీ అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు, తణుకు టీడీపీ అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉండి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున ఆ యన భార్య నామినేషన్ దాఖలు చేశారు. పాలకొల్లు కాంగ్రెస్ అభ్యర్థిగా కొలకలూరి అర్జునరావు, తాడేపల్లిగూడెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దేవకి పద్మావతి నామినేషన్లు సమర్పించారు. ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య, ఇండిపెండెంట్గా బొకినాల కోటేశ్వరరావు, ఉంగుటూరు జన సేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు, కై కలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బొడ్డు నోబుల్, జైభీమ్రామ్ భారత్ పార్టీ అభ్యర్థిగా జి.సతీష్కుమార్ నామినేషన్లు దాఖలు సమర్పించారు. న్యూస్రీల్ రెండో రోజు ‘పశ్చిమ’లో వెల్లువ భారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల దాఖలు జన సందోహంగా ర్యాలీలు ‘పశ్చిమ’లో 24 మంది.. ఏలూరులో ఏడుగురు నామినేషన్లు -
ఎన్నికలకు పటిష్ట భద్రత
జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు టౌన్: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకులు పి.కీర్తు నారాయణ్, టీషేరింగ్ జోర్డర్ భూతియా, మెస్రం గౌరవ్ మధుకర్ ఎస్పీ ప్రశాంతిని కలిశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు, తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో యుధ దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, భయం లేకుండా వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా, అంతర్రాష్ట సరిహద్దుల్లో పటిష్ట నిఘా పెట్టామన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ జి.స్వరూప రాణి, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, బి.ఆదిప్రసాద్ ఉన్నారు. -
జగన్పాలనకుఆకర్షితులై..
తాడేపల్లిగూడెం అర్బన్: సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండాలని, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణను గెలిస్తామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకులు ఈలి వెంకట మధుసూదనరావు (ఈలి నాని) వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఈలి నానినీ ఆయన గృహంలో ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ గెలుపునకు సంబంధించి పలు విషయాలను చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పాలన నచ్చి వైఎస్సార్ సీపీలో చేరారనన్నారు. జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ తనతో పలుమార్లు ఫోన్ ద్వారా చర్చించారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు కొట్టుతోపాటు పార్టీ పెద్దలతో నిత్యం ప్రచారంలో పాల్గొంటానన్నారు. అలాగే వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల గెలుపునకు సహకరిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, చిరకాల మిత్రులైన ఈలి నాని వైఎస్సార్ సీపీలోకి రావడం సంతోషకరమన్నారు. ఈలి నాని కుటుంబం రాజకీయంగా నియోజకవర్గానికి అమితమైన సేవలందించారన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీని గెలిపించాలని వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారని కొట్టు వెల్లడించారు. కాపులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారన్నారు. అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, మల్లుల విజయ్, పిల్లా నర్సింహరావు, చెన్నా జనార్దన్, కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కరరావు ఉన్నారు. స్థానిక పాతూరు ప్రాంతానికి చెందిన పుప్పాల శివాజి ఈలి నాని సమక్షంలో శుక్రవారం ౖవైఎస్సార్ సీపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శివాజీని పార్టీ కండువాతో సాదరంగా ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానని శివాజి చెప్పారు. వైఎస్ జగన్ పాలన నచ్చే.. తణుకు అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆకర్షితులవ్వడంతోపాటు చంద్రబాబు అండ్కో దుష్టకూటమి కలయికను నిరసిస్తూ టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు 5వ వార్డు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 20 కుటుంబాలు శుక్రవారం రాత్రి మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేస్తున్న దుష్ట రాజకీయాన్ని చూడలేకపోతున్నామని ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలన మరో ఐదేళ్లు కొనసాగించేందుకు మేమంతా సిద్ధమంటూ పార్టీలో చేరుతున్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నానని, పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారందరికీ మంత్రి కారుమూరి కండువాలు వేసి ఆహ్వానించారు. 5వ వార్డు ఇన్చార్జ్ సుద్దుల పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, నాయకులు పంపన సుబ్బారావు, తణుకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరుతున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తారంటూ ఆశలు వైఎస్సార్ సీపీ క్యాడర్తో కలిసి ప్రచారంవైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నమ్మి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. -
ప్రేమ వివాహం.. యువతి బంధువులపై కేసు
ముసునూరు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న మేజర్లు అయిన ఓ జంట పోలీసులను ఆశ్రయించగా, యువతి తరపు బంధువులు వ్యతిరేకిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కల్పించడంతో యువతి మేనత్తలు, తండ్రితోపాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కాట్రేనిపాడుకు చెందిన సొంగా వంశీకృష్ణ, అదే గ్రామానికి చెందిన గుత్తి లావణ్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి యువతి తరపు బంధువులు నిరాకరించారు. దీంతో వీరు గుడిలో పెళ్లి చేసుకుని, రక్షణ కోసం ముందుగా చింతలపూడి పోలీసులను, అనంతరం ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరుపక్షాల పెద్దలకు కబురు చేశారు. గురువారం యువకుని బంధువులు స్టేషన్కు రాగా, యువతి తరపు బంధువులు రాలేదు. దీంతో యువకుని తల్లిదండ్రులకు ఎస్సై కౌన్సెలింగ్ నిర్వహించి, నూతన వధూవరులను జాగ్రత్తగా చూసు కోవాలని హెచ్చరించి వారికి అప్పగించారు. దీనికి ఆగ్రహిస్తూ, యువతి మేనత్తలు గుత్తి నాగమణి, సొంగా నాగమణి, మరి కొందరు బంధువులు గురువారం రాత్రి స్టేషన్కు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ధర్నాకు దిగారు. ఎస్సై వారికి ఎంత నచ్చచెప్పినా వినకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువతిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన యువతి బంధువులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పాముకాటుకు మహిళ మృతి ముదినేపల్లి రూరల్: శ్రీహరిపురంలో పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరే నాగాంజలి (30) భర్తకు దూరంగా ఉంటూ తన ఇద్దరు ఆడపిల్లలతో గ్రామంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించేందుకు బట్టలు తీస్తుండగా వాటిలో ఉన్న పాము అకస్మాత్తుగా చేతిపై కాటువేసింది. చికిత్స కోసం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందింది. తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు చేయగా ఏఎస్సై పద్మజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడు అంబుల మనోజ్ తన కుమార్తె, వైద్యవిద్యార్ధిని వైష్ణవితో నాగాంజలి మృతికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్ధికసాయంగా రూ.10వేలు తల్లి వెంకటేశ్వరమ్మకు అందజేశారు. -
ఎన్నికల కోడ్ వర్తించదా
దెందులూరు: దెందులూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఎన్నికల కోడ్ అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రస్తుతం కోడ్ అమలులో ఉన్నా మూసివేయకుండా అధికారులు అలాగే వదిలివేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఇక్కడి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో నేటికీ టీడీపీ శిలాఫలకాలు, బోర్డులకు ముసుగు వేయకుండా అలాగే వదిలివేశారని, అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాద్ విలేకరులకు చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మూడంచెల పటిష్ట భద్రత
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్కు ఎంపిక
సింగరేణి ఎక్స్టర్నల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ
అమ్మో ఇవేం పరీక్షలు..?
ప్రభుత్వాస్పత్రిలో ఇంటి దొంగలు..!
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్లాంటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
తప్పక చదవండి
- ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement