-
Azadi Ka Amrit Mahotsav: హర్ ఘర్ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా
గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు. ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్ షాట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు డ్రోన్ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది. గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్లైన్లో, పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటి పండగ అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి. మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్ సింగ్ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి. నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్లు పెట్టాలి. ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబుల్ కలామ్ ఆజాద్... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్ రూమ్లో కొలువుదీరాలి. కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్’ వాడితే ఆ అనుభూతే వేరు. ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత. ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం. -
ఆ ఊరిలో.. ఇంటికో టీచర్!
బెళగావి: ఉపాధ్యాయ వృత్తి.. అన్ని వృత్తుల కంటే ఎంతో పవిత్రమైనది. ఓ విద్యార్థికి ఉన్నతమైన భావాలు కలిగేలా తీర్చిదిద్దడంలో ఈ వృత్తి పాత్ర అమోఘం. ఆ గొప్ప వృత్తినే తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంది ఓ గ్రామం. ఇంటికో టీచర్తో టీచర్స్ విలేజ్గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ టీచర్స్ విలేజ్ ఎక్కడుందో మనమూ ఓ సారి తెలుసుకుందాం.. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని సావదాతి తాలుకాకు చెందినది ఇంచల్ గ్రామం. ఆ గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మొదటి చాయిస్గా ఉపాధ్యాయ వృత్తినే కోరుకుంటారట. వారి కోరిక మేరకు పిల్లలు కూడా ఉపాధ్యాయ వృత్తినే తమ ఉపాధిగా ఎంచుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం ఆరు వేల జనాభా ఉన్నారు. వీరిలో 600 పైగా మంది టీచర్లే. కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో వీరు టీచర్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేస్తుంటే.. మరికొంతమంది ప్రైవేట్ విద్యాలయాల్లో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ ప్రొగ్రామ్ పూర్తిచేసుకున్న యువత కూడా టీచర్ పోస్టింగ్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుందట. టీచర్ ఫ్యామిలీస్లో అతిపెద్ద కుటుంబం షబ్బీర్ మిరాజనవార్ది. వీరు కర్ణాటక స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్కు చెందిన బైహోన్గల్ తాలుక్ సెక్రటరీ. ఇతని కుటుంబంలో 13 మంది టీచర్లుగా కొనసాగుతున్నారు. ఇంచల్ గ్రామంలో చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారని, రెండో ఆప్షన్గా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సావదాతి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ఎల్ భజన్త్రీ చెప్పారు. అయితే 1970 వరకు ఇంచల్లో ఒక ప్రైమరీ స్కూల్, ఎనిమిది మంది టీచర్లు మాత్రమే ఉండేవారు. స్టడీస్ను కొనసాగించాలంటే విద్యార్థులు బైహోన్గల్ పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలామంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపివేసేవారు. ఈ సమస్యను సీరియస్గా తీసుకున్న శివానంద్ భారతి స్వామిజీ కొంత మంది టీచర్లతో ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటుచేశారు. గ్రామంలోనే ఉన్నత చదువులు అభ్యసించేలా అవకాశం కల్పించారు. అనంతరం 1984లో రూరల్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయింది. ఆ సెంటర్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పించారు. అలా ఇంచల్ గ్రామం అక్షరాస్యత శాతాన్ని అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థుల టీచర్స్ ట్రైనింగ్కు సహకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, పీయూ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీఏఎమ్ఎస్ కాలేజీ, సంస్కృత విద్యాలయం ఉన్నాయి. -
సంక్రాంతి కల్లా ఇంటింటికీ నల్లా నీరు
నర్సాపూర్ రూరల్ : వచ్చే సంక్రాంతి నాటికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అన్నారు. బుధవారం నర్సాపూర్ 19వ వార్డులోకి వచ్చే తుక్కారాం గిరిజన తండాలో రక్షిత మంచినీటి ట్యాంక్ను ప్రారంభించి, గిరిజనుల ఇండ్ల వద్ద నల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్లైన్ పూర్తయితే తాగునీటి సమస్య ఉండదన్నారు. తండా సమీపంలో నూతనంగా నిర్మించిన ట్యాంక్ వద్ద ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఎంపీడీఓ శ్రవణ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బోగశేఖర్, నర్సాపూర్ సర్పంచ్ రమణారావు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement