-
ఎక్స్ట్రా వినోదం ఉంటుంది – నితిన్
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయ్..’ అనే మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల, ప్రియ హేమెస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ను ఈ సినిమాలో చేశాను. సినిమా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్కు పదింతల వినోదం మా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాకు సప్రోర్ట్ చేసిన నితిన్గారికి థ్యాంక్స్. ఇంట్రవెల్ సన్నివేశంలో ఓ మంచి ట్విస్ట్ ఉంది’’ అన్నారు వక్కంతం వంశీ. ‘‘టైటిల్కి తగ్గట్టు ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
అపురూపంగా చూసుకోవాలి
కొత్తగా పెళ్లయిన జంట భోజనానికి కూర్చుంది. ‘‘మీ అమ్మగారిని కూడా పిలవండి’’ అని చెప్పింది భార్య. ‘‘మా అమ్మ సంగతి వదిలేయి.’’ అని విసుక్కున్నాడు భర్త. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ అమ్మగారు తినకుండా మనం తినడం భావ్యం కాదని చెప్పింది. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ పెళ్లైన రోజే విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరికి తోచిన సంబంధం వాళ్లు చూసుకుని వేరే పెళ్లి చే సుకున్నారు. ఇలా ముప్ఫై ఏళ్లు గడిచిపోయాయి. ఆ మహిళకు మగ సంతానం కలిగింది. పిల్లలు ప్రయోజకులయ్యారు. పిల్లల్ని ధార్మికంగా తీర్చిదిద్దడంతో పిల్లలు కూడా తల్లిని రాణిలా చూసుకోసాగారు. కాళ్లకు మట్టి కూడా అంటనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకోసాగారు. దగ్గరుండి హజ్ యాత్ర చేయించారు. హజ్ యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తి చింపిరి జుట్టుతో రోడ్డుపక్కన దుర్భరస్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన ఆ మహిళ ఆ అభాగ్యుడిని లేపి ఏదైనా తినిపించి మంచినీళ్లు తాగించాలని తన పిల్లలను కోరింది. పిల్లలు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెడుతుండగా ఆ వ్యక్తిపై ఆమె దృష్టి పడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందా మహిళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన మొదటి భర్త అని గుర్తుచేసుకొంది. ఈ దుస్థితికి కారణమేమిటని అడిగింది. దానికా వ్యక్తి ‘‘మా పిల్లలు నా ఆస్తినంతా కాజేసి నన్ను బయటకు గెంటేశారు’’ అని తన దీనస్థితిని చెప్పుకొచ్చాడు. అప్పుడామె కలగజేసుకొని ‘‘నీ ఈ దుస్థితిని మన పెళ్లయిన మొదటి రాత్రే అంచనా వేశాను. నువ్వు మీ అమ్మానాన్నల హక్కులు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశావు. వాళ్లను చులకనగా చూశావు. రేపటి రోజు నాకూ ఇదే గతి పడుతుందనే ఆ రోజు నీ నుంచి విడిపోయాను’’ అని చెప్పింది. మన వృద్ధాప్యం ఎలా గడపాలని కోరుకుంటున్నామో మన తల్లిదండ్రులకూ అలాంటి వృద్ధాప్యాన్ని అందించాలి. ముసలితనంలో వాళ్లను ఆదరించాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బతికుండగానే ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్ ప్రవక్త (స) హెచ్చరించారు. – ముహమ్మద్ హమ్మాద్ -
భక్తుల కొంగుబంగారం.. మట్టపల్లి క్షేత్రం
–పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా.. –అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన స్వామి మట్టపల్లి (మఠంపల్లి): నల్లగొండ, గుంటూరు జిల్లాలకు వారధిగా ఉన్న పవిత్ర కృష్ణానది తీరాన వెలసిన పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖంగా బాసిల్లుతూ తెలంగాణ–ఆంధ్ర ప్రాంత భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతోంది మట్టపల్లి మహాక్షేత్రం. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా స్వయంభువుగా అవతరించించారు శ్రీలక్ష్మీనసింహస్వామి క్షేత్రం. ఆలయచరిత్ర ... పూర్వం 1100 ఏళ్ల క్రితం మట్టపల్లి కీకారణ్యంలో భరద్వాజ మహర్షి తపస్సు చేస్తాడు. కొంత కాలానికి కృష్ణానది ఆవలి తీరాన వెలసిన తంగెడ గ్రామాన్ని పాలించే అనుముల (దొండపాటి) మాచిరెడ్డి ప్రభువుకు స్వామివారు కలలో కనిపించి ‘నాకు ఇప్పటి వరకు దేవతలు, సప్తరుషులు పూజలు, యజ్ఞాలు చేశారు.. ఇకనుంచి మానవుల పూజలు అందుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. అందువల్ల కృష్ణానది ఆవలి వైపున కీకారణ్యంలో గృహగర్భంలో నా స్వయంవ్యక్త మూర్తి ఆవిర్భవించి ఉన్నాడు.. నీవు వెళ్లి గుహను తెరిపించాలి’ అని ఆజ్ఞాపిస్తాడు. దీంతో మరునాడు మాచిరెడ్డి ప్రభువు సకల పరివారంతో కృష్ణానది దాటి వచ్చి మట్టపల్లి అటవీప్రాంతంలో వెతికి వేసారి అలసిపోయి నది ఒడ్డున నిద్రకు ఉపక్రమించాడు. దీంతో మళ్లీ స్వప్నంలోకి వచ్చిన స్వామి వారు ఓÄæూ మాచిరెడ్డి ప్రభువు నీవు నిద్రిçస్తున్న ఆరె చెట్టుపైన గరుడ పక్షి ఉంటుంది. ఆ పక్షి మిమ్ములను చూడగానే పశ్చిమం నుంచి తూర్పుదిశకు ఎగిరిపోతుంది. అక్కడి నుంచి 10 గజాల దూరంలో గుహను తవ్విస్తే∙నా స్వయంమూర్తి కనిస్తాడు అని తెలిపాడు. దిగ్గున లేచిన ప్రభువు ఆ రకంగా ౖసైన్యంతో గుహను తవ్వించగా కీకారణ్యంలోని భయంకరమైన గుహలో వెలుగులు విరజిమ్ముతూ కొండ గట్టుకు శ్రీలక్ష్మీనసింహస్వామి యోగాసనంలో పక్కన ప్రహ్లాదుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. స్వయం వ్యక్త ముందు దక్షిణావశంఖం నవసాలగ్రాములు కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రభువు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇక అప్పటి నుంచి నేటికీ స్వామి వారికి ఆరె ఆకులతో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు .. శ్రీమట్టపల్లి లక్ష్మీనసింహస్వామికి ప్రతి దినం ఉదయం 7.30గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మూడు సార్లు మహానివేదన, ఆరగింపు, భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుంది. అంతకు ముందే ప్రతిరోజు సుప్రభాతసేవతో పాటు కృష్ణానది నుంచి తెచ్చే బిందె తీర్థంతో యథావిధిగా పూజలు కొనసాగిస్తారు. ఆర్జితసేవలు, ప్రసాదాలు, నిత్యాన్నదానం కొనసాగుతూ ఉంటాయి. ఉత్సవాలు .. ప్రతి ఏడాది మే నెలలో వచ్చే నసింహ జయంతికి శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనసింహస్వామికి తిరుకల్యాణం జరుపుతారు. ఈ కల్యాణానికి మన జిల్లా లింగగిరి, గుంటూరు జిల్లా ముత్యాలమ్మపాడు నుంచి అనాదిగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. అంతేగాక ప్రతిఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చే తొలి ఏకాదశికి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇతర దేవాలయాలు... మట్టపల్లిలో శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంతో పాటు పార్వతీ రామలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి, గోదాదేవి ఆలయాలున్నాయి. శ్రీరామతీర్థ సేవాశ్రమం దీనిని 1971లో పిడుగురాళ్లకు చెందిన కేశవ తీర్థస్వామి ప్రారంభించారు. ఈ ఆశ్రమంలో ప్రతి నిత్యం నరసింహోపాసన జరుగుతుంది. అదేవిధంగా హుజూర్నగర్ నుంచి మట్టపల్లి వరకు 25 కిలోమీటర్ల పొడవునా త్రివేణినగర్లో లక్ష్మీతిరుపతమ్మ, మఠంపల్లిలో కనకదుర్గ, పెదవీడులో సోమలింగేశ్వరాలయాలు ప్రధాన రహదారిపై పూజలందుకుంటున్నాయి. అన్నదాన సత్రాలు ... రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రం తర్వాత అంత ప్రాముఖ్యతతో ఇక్కడ వివిధ కులాల అన్నదాన సత్రాలు నిర్మించారు. నిత్యాన్నదాన సత్రాలతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్నదానాలు చేసే మరిన్ని సత్రాలు కూడా నిర్మించారు. ఇతర కట్టడములు ... జిల్లాలోనే మొట్టమొదటి సారిగా 1990లో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమంటపాన్ని మట్టపల్లిలో నిర్మించారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం కూడా 6 గదుల సత్రం నిర్మించింది. ఇంకా జడ్పీ అతిథిగహం, దేవస్థాన గహాలు కూడా ఉన్నాయి. చెన్నై ముక్కూరు స్వామి పీఠం .. ఆశ్రమం .. మట్టపల్లి మహాక్షేత్రంలో చెన్నైకి చెందిన ముక్కూరు లక్ష్మీనరసింహచారియార్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయానికి పై భాగాన గోశాల ప్రక్కన నిర్మించారు. ఈపీఠాన్ని మూడేళ్ల క్రితం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మట్టపల్లి వచ్చి ప్రారంభించారు. చెన్నైకి చెందిన తమిళనాడు భక్తులు అనునిత్యం మట్టపల్లి స్వామిని దర్శించుకొని ముక్కూరు స్వామి పీఠాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఎంతో మంది పీఠాధిపతులు ఇప్పటికీ మట్టపల్లి వచ్చి శ్రీలక్ష్మీనసింహ స్వామిని దర్శించుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement