-
కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిదినాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం జూన్ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. -
మలిసంధ్యలో ‘వెలుగు’రేఖ
సాక్షి, అమరావతి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షల లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో మూడో దశ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వడివడిగా జరుగుతోంది. 361 వైద్య బృందాలు నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు సగటున 2,500 మందికి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 900 కేటరాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 33.90 శాతం అంటే 19,28,511 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో చిన్న సమస్యలు ఉన్న 8,51,772 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 9,22,373 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 7,90,704 మందికి ఉచితంగా పంపిణీ పూర్తయింది. 1,54,366 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య బృందాలు గుర్తించాయి. వీరిలో 1,44,476 మందికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. సెప్టెంబర్లోగా వృద్ధులందరికీ పరీక్షలు పూర్తి కంటి వెలుగు వైద్య పరీక్షలు, సర్జరీల్లో వేగం మరింతగా పెంచుతాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాష్ట్ర అంధత్వ నివారణ జేడీ, కంటివెలుగు సంస్థ రూపాయి ఖర్చు లేకుండా వయసు పైబడటంతో కంటి చూపు మందగించింది. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కింద మా పీహెచ్సీలో గత ఏడాది ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. తర్వాత కళ్లద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు. నాలాంటి ఎంతో మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా చీకట్లు తొలగిస్తున్నారు. – గోపిశెట్టి బ్రహ్మయ్య, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
అవ్వాతాతలకు వచ్చేనెలలో కళ్లద్దాలు
సాక్షి, వైఎస్సార్, కడప : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మళ్లీ వేగం అందుకుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు ..రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,450 (1 నుంచి 10వ తరగతి) పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు.మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మూడో దశకింద 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి (ఐఓఎల్) ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన 1,588 మందికి కంటి లోపాలు లేవని గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పధకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను చేస్తారు. (ఇంటివద్దకే కళ్లద్దాలు) వచ్చే నెలలో కళ్లదాలు అందజేస్తాం 'అక్టోబర్ 1న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అవ్వాతాతలకు కళ్లద్దాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ పధకం ద్వారా వేలాది మందికి కంటి వెలుగు రావడమే ప్రభుత్వ సంకల్పం.' అని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రామిరెడ్డి తెలిపారు -
ఇంటివద్దకే కళ్లద్దాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ► రాష్ట్రంలో మొదటి, రెండో దశ కంటి వెలుగులో భాగంగా 60,393 స్కూళ్లలో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ► వీరిలో 4.38 లక్షల మంది చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు. ► మరో 55 వేల మందికి విజన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ► మూడో దశ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన 3,06,961 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించగా 95,075 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ► వీరికి వచ్చే నెల మొదటి వారంలో కళ్లద్దాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కళ్లద్దాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ► మూడో దశలో మరింత మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ► కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాక కోవిడ్ పరిస్థితులు రావడం, కళ్లద్దాలు తయారుచేసే సంస్థలు కొంతకాలం మూతపడటం వల్ల వాటి పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. ► కాగా, మొదటి దశలో రూ.11.18 కోట్లు, రెండో దశలో రూ.12.65 కోట్లు, మూడో దశలో రూ. 6.60 కోట్లు వ్యయం అయ్యింది. -
కంటి పరీక్ష ఇక ఇంట్లోనే...
వయసుతోపాటు చూపు మందగించడం అందరికీ అనుభవమైన విషయమే. కళ్లజోళ్లతో ఆ చిక్కును కాస్తా దాటేస్తామనుకోండి. కాకపోతే తరచూ కళ్లు చెక్ చేయించుకోవడం, తగిన ప్రిస్క్రిప్షన్తో కళ్లజోళ్లు ఆర్డర్ చేయడం, వచ్చేదాకా పాతవాటితో సర్దుకుపోవడం కొంచెం చీకాకైన పనే. థ్యాంక్స్టు స్మార్ట్ఫోన్... ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఓ బుల్లి పరికరం దాంతోపాటు పనిచేసే అప్లికేషన్తో ఎంచక్కా ఇంట్లోనే కళ్లు పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది ఓ కంపెనీ. ఐక్యూ విజన్ చెక్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరం, ఆప్ అత్యాధునిక మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయి. కళ్లు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు పరికరాన్ని స్మార్ట్ఫోన్ కు బిగించుకోవడం.. కళ్లజోళ్లు తీసేసి ఒక్కో కంటికి దగ్గరగా పెట్టుకుని పరీక్ష చేసుకోవచ్చు. కళ్ల ముందు కనిపించే రెండు గీతలను ఒకదానిపై ఒకటి చేర్చేలా ఐక్యూ యంత్రంపై ఉన్న బటన్లను నొక్కుతూండటం ఒక్కటే మనం చేసే పని. కంటిలోని ప్రతి కోణం నుంచి వివరాలు సేకరించి మన దష్టి మాంద్యం తీవ్రత ఎంతన్నది అంకెల్లో చెప్పేస్తుంది ఈ యంత్రం. ఆన్లైన్లో డిజైన్ ఎంచుకుని, ప్రిస్క్రిప్షన్ను జోడిస్తే ఒకట్రెండు రోజుల్లో కొత్త కళ్లజోడు రెడీ!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement