-
తరుచు కాళ్ల నొప్పులు వస్తున్నాయా..?
కొందరు తరుచు కాళ్ల నొప్పితో బాధపడుతుంటారు. అదొక దీర్ఘకాలిక వ్యాధిలా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందువల్ల వస్తుందో తెలయదు గానీ సడెన్గా వచ్చి నానా ఇబ్బందులు పెడుతుంటుంది. ఇలా ఎందుకు జరగుతుంది? ఏమైనా అనారోగ్యాలకు సంకేతమా? ప్రధాన కారణాలేంటి తదితరాల గురించే ఈ కథనం కాళ్ల నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. అది నొప్పి తీవ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా కాలి నొప్పి రావొచ్చు. అందుకు గల ప్రధాన కారణాలేంటో చూద్దాం కండరాల ఒత్తిడి లేదా అతిగా కష్టపడినా.. కాలినొప్పిలో అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి కండరాల ఒత్తిడి లేదా అతిగా నడవటం. తీవ్రమైన శారీరక శ్రమ, వ్యాయామం చేసే సమయంలో సరికాని విధానంల లేదా మీ కండరాలను వాటి పరిమితికి మించి నెట్టడం వల్ల జరగొచ్చు. గాయాలు లేదా ప్రమాదాలు కాలికి ఏదైన గాయం లేదా ప్రమాదంలో కాళ్లకు తీవ్రంగా గాయం అయినా ఈ నొప్పులు రావడం జరుగుతుంది. ఆ టైంలో బెణకడం జరిగి అది సెట్ అవ్వక కూడా తరుచుగా ఇలా కాలి నొప్పి రూపంలో ఇబ్బంది పెట్టొచ్చు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(ప్యాడ్) కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఫలకం ఏర్పడినప్పుడూ ప్యాడ్ సంభవిస్తుంది. ఈ పరిస్థితి కండరాలకు రక్తప్రసరణను తగ్గిస్తుంది. ముఖ్యంగా కార్యకలాపాల సమయాల్లో నొప్పికి దారితీస్తుంది. ప్యాడ్ ఉన్న వ్యక్తుల కాళ్లల్లో తిమ్మిరి, లేదా బలహీనత సంభవించొచ్చు నరాల కుదింపు తుంటి లేదా తొడ వెనుక భాగపు నరములు కుదింపు లేదా చిట్లడం వల్ల నొప్పి రావొచ్చు. హెర్నియేటెడ్ డిస్కలు లేదా స్పైనల్ స్టెనోసిస్ వంటి పరిస్థితులు నరాల మీద ఒత్తిడికి దారితీయొచ్చు. ఫలితంగా నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి కాళ్లలో ఏర్పడి నొప్పిలా అనిపిస్తుంది. పరిధీయ నరాల వ్యాధి పరిధీయ నరాల వ్యాధి అనేది తరచుగా మధుమేహం, ఆల్కహాల్ సేవించడం లేదా కొన్ని మందుల కారణంగా పరిధీయ నరాలకు నష్టం జరగడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. కీళ్ల సమస్య కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులు లేదా ఆర్థరైటిస్ వంటివి కూడా కాళ్లనొప్పులకు దారితీస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటివి కాళ్ల కీళ్లల్లో మంట, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఎర్రగా వాపు వచ్చి నొప్పి వస్తుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్(డీవీటీ)తో సంబంధం ఉన్న కాలు నొప్పి సాధారణంగా నిరంతరం తిమ్మిరి లాంటి అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేగాక ప్రభావిత ప్రాంతంలో వెచ్చగా ఎరుపుతో కూడిన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి తొడ వరకు విస్తరించొచ్చు. కదిలిన లేదా నిలబడేందుకు చూసిన మరింత తీవ్రంగా నొప్పి వస్తుంది. ఇది తీవ్రంగాక మునుపే వైద్యుడిని తక్షణమే సంప్రదించాలి. లేదంటే రక్తం గడ్డకట్టుకుపోయిన ప్రాంతం చలనం కోల్పోయి తీసివేయడం లేదా ప్రాణాంతకంగానో మారొచ్చు. ముఖ్యంగా పైన చెప్పిన ఏవిధమైన అనుభూతి కలిగిన సమీపంలోని వైద్యుడిని సంప్రదించి, సూచనలు పాటించడం ఉత్తమం. సాధారణ నొప్పిగా నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా నడవలేని స్థితిని కొని తెచ్చుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!) -
మోదీ వెనకచూపు!
న్యూయార్క్: ‘‘ప్రధాని మోదీ భారతీయ కారును రియర్వ్యూ అద్దంలో చూస్తూ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి గానీ, ఆర్ఎస్ఎస్కి గానీ భవిష్యత్తులోకి చూడగలిగే సామర్థ్యం లేదని విమర్శించారు. ఆయన ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్–అమెరికా విభాగం ఆధ్వర్యంలో న్యూయార్క్లోని జవిట్స్ సెంటర్లో భారతీయ అమెరికన్లనుద్దేశించి మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు అసమర్థులు. ఏదడిగినా గతం తవ్వుతారు. ఒడిశా రైలు ప్రమాదం లాంటివి ఎందుకు జరుగుతున్నాయని అడిగితే ‘50 ఏళ్లనాడు కాంగ్రెస్ అలా చేసినందుకే...’ అంటారు. పీరియాడిక్ టేబుల్ను పాఠ్య పుస్తకాల్లోంచి ఎందుకు తీసేశారంటే 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతారు’’ అని చెణుకులు విసిరారు. ‘‘రియర్ మిర్రర్లో చూస్తూ కారు నడిపితే వరుస ప్రమాదాలు ఖాయం. మోదీ అలవాటు అదే. భారతీయ కారును సైడ్ మిర్రర్లో మాత్రమే చూసుకుంటూ నడుపుతున్నారు. అది ముందుకు పోకుండా ప్రమాదాలెందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. -
డొక్కు డొక్కు
కాలం చెల్లిన బస్సులు.. రోడ్లపై చక్కర్లు ఆర్టీసీ నిర్వాకంతో తరచూ ప్రమాదాలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో 618 బస్సుల్లో 160 కాలం డొక్కువే.. నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు ప్రయాణికుల బెంబేలు డొక్కు బస్సులతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. కాలం చెల్లిన బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతుండడంతో అవి ఎప్పుడు?.. ఎక్కడ?.. ప్రమాదానికి గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలాచోట్ల డొక్కు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ‘సురక్షితంగా గమ్యానికి చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి’... అనే మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆచరణలో మాత్రం ఆర్టీసీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. డొక్కు బస్సులను యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీరు మారకపోతే ఆర్టీసీకి ప్రయాణికులు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. మెదక్: కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. నెలన్నర రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయి. ఇందులో రెండు బస్సులు కాలం చెల్లినవి కావడం గమనార్హం. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, దుబ్బాక డిపోలకు గాను మొత్తం 618 బస్సులు ఉన్నాయి. ఇందులో 176 అద్దెబస్సులుండగా, సంస్థకు చెందినవి 442 బస్సులున్నాయి. ఆర్టీసీకి చెందిన 442 బస్సుల్లో 160 బస్సులు కాలం చెల్లినవి కాగా మిగతా 282 బస్సులు మాత్రమే కండిషన్లో ఉన్నాయి. నిబంధనలు ఇలా... నిబంధనల ప్రకారం 7.50 లక్షల కిలోమీటర్లు తిరిగిన డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను, 6.50 లక్షల కిలో మీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను ఆర్డీనరీ బస్సులుగా మారుస్తారు. 12లక్షల కిలో మీటర్లు తిరిగిన ప్రతి బస్సు కాలం చెల్లినట్టుగా గుర్తిస్తారు. జిల్లాలో ఇప్పటికే 160 ఆర్డీనరీ బస్సులు కాలం చెల్లినవి ఉండగా వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. తరచూ ప్రమాదాలు... డొక్కు బస్సులను తిప్పడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. రోడ్డుపై వెళ్లాల్సిన బస్సులు అదుపుతప్పి పక్కకు తిరుగుతున్నాయి. నెలరోజుల్లో జిల్లాలో నాలుగు బస్సు ప్రమాదాలు జరిగాయి. అందులో 50మంది వరకు గాయపడగా, ఒకరు మృతి చెందారు. కేవలం కాలం చెల్లిన బస్సులను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. – గత మే 20వ తేదీన సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు (నం.ఏపీ28జెడ్409) సంగారెడ్డి నుంచి మెదక్కు సుమారు 45మంది ప్రయాణికులతో బయల్దేరింది. మెదక్ పట్టణానికి 13కిలో మీటర్ల దూరంలో ఉండగా కొల్చారం మండలం పొతన్శెట్టిపల్లి గ్రామ శివారులో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మెదక్ మండలం పేరూర్కు చెందిన భూలక్ష్మి కాలు బస్సులోనే తెగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మరో ఐదుగురు రమావత్ కిషన్, సాలి, విఠల్, అజ్మిర, పద్మజా తలలు పగిలి తీవ్ర గాయాలు కాగా, 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. – ఇదే నెలలో చేగుంట మండలం 44వ జాతీయ రహదారిపై వల్లూరు శివారులోగల నర్సరీ సమీపంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. – కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గేటు సమీపంలో మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిపై మెదక్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు మెదక్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు కిందికి వెళ్లి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. – అదే నెలలో నర్సాపూర్–తూప్రాన్ ప్రధాన రహదారిపై గజ్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మంతాపూర్ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. – రామాయంపేట శివారులో సైతం జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లాకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనగా 20మంది గాయపడ్డారు. ఇలా కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో ఐదు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోగా, రెండింటిలో కాలం చెల్లినవి కావడంతోనే జరిగినట్లు ప్రమాద స్థలంలో డ్రైవర్లు తెలిపారు. గ్యారేజీలో ఉండాల్సిన బస్సులు రోడ్లపై తిరుగుతోండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులతో నడిపిస్తున్నాం... జిల్లాలో 160 పల్లె వెలుగు బస్సులు కాలం చెల్లినవి ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ నడిపిస్తున్నాం. ప్రభుత్వం 1,200 బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. అందులో వందకుపైగా బస్సులు జిల్లాకు రానున్నాయి. అవి వస్తే జిల్లాలో బస్సుల కొరత ఉండదు. నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం వారి అభివృద్ధి నిధుల నుంచి ఆర్టీసీ డిపోల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు వస్తే డిపోలు మరింత అభివృద్ధి చెందుతాయి. – రఘునందన్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, సంగారెడ్డి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement