-
ఆయనొచ్చారు.. విద్యార్థులపై లాఠీలు విరిగాయి
ముంబయి: పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద పోలీసుల లాఠీలు విద్యార్థులపై సవారీ చేశాయి. ఈ సంస్థ చైర్మన్ గా ఎంపికైన వివాదాస్పద నటుడు గజేంద్ర చౌహాన్ ను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన విద్యార్థులను అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీ ఝులిపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ఎంపికైన తర్వాత తొలిసారి గురువారం బాధ్యతలు స్వీకరించేందుకు ఇన్ స్టిట్యూట్ కు వచ్చారు. అయితే, ఇందులోని కొందరు విద్యార్థులు ఆయన నియామకాన్ని అస్సలు అంగీకరించడం లేదు. గత 139 రోజులుగా కొంతమంది విద్యార్థులు నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు. తొలిసారి బాధ్యతలు స్వీకరించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో గజేంద్రకు అధికారులు ఘన స్వాగతం ఏర్పాటుచేశారు. అయితే, అక్కడికి వచ్చిన విద్యార్థులు చౌహాన్ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన పేరుపై ఒక ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేసి గురువారంనాటి సమావేశాన్ని ఉద్దేశిస్తూ భేషరమ్(సిగ్గుసిగ్గు) అంటూ పోస్ట్ చేశారు. మహాభారత్ వంటి టీవీ సీరియల్ తోపాటు పలు బీ, సీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన గజేంద్రకు సరైన అర్హతలు లేకుండానే చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, సీనియర్లను పక్కన పెట్టారని ఇప్పటికే పలువురు సినిమా నటులు ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు విద్యార్థులకు కూడా ఆయన నియామకం ఏ మాత్రం ఇష్టం లేదు. -
ఆ నిరసనలతో ఆడియెన్స్ పెరిగారు!
న్యూఢిల్లీ: టీవీ నటుడు గజేంద్రసింగ్ చౌహాన్ గుర్తుఉన్నారు కదా! పుణెలోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఆయనను ప్రకటించింది మొదలు నిరసనలు, ధర్నాలు హోరెత్తాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరగతులు బహిష్కరించి.. ధర్నాలు చేశారు. ఆయన నియామకంపై దేశవ్యాప్తంగా టీవీల్లో చర్చలు కూడా జరిగాయి. ఈ వివాదం ఆయనను బాగానే వెలుగులోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. ఢిల్లీలో ఆయన శివుడి పాత్ర వేస్తున్న నాటకానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. దసరా సందర్భంగా ఎర్రకోట సమీపంలో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో గజేంద్రసింగ్ చౌహాన్ శివుడుగా నటిస్తున్నారు. ఆయన పార్వతీదేవికి రాముడి ఇతివృత్తాన్ని వివరిస్తారు. ఈ నాటకంలో ఆయన పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. "35 ఏండ్ల కెరీర్లో చాలా డైలాగులను నేను గుర్తుంచుకున్నాను. కానీ తొలిసారి రంగస్థలం మీద నటిస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా నటించడం మినహా ఎలాంటి రీటేక్ లకు అవకాశం ఉండదు' అని గజేంద్ర చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన "మహాభారత్' సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు. -
ఛైర్మన్గా ఆయనే కొనసాగుతారు
న్యూఢిల్లీ: ఎఫ్ టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనిపై ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యథావిధిగా ఆ పదవిలో కొనసాగుతారు. చౌహాన్తో పాటుగా ఒక కో చైర్మన్ ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నఐదుగురు సభ్యులను కమిటీ నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరుచెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థిసంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజకీయాలకు చోటు లేదని.. బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయ నాయకులు తమ మద్దుతును తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాలని విద్యార్ధి సంఘాల నాయకులను కేంద్రం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
ఛైర్మన్గా ఆయనే కొనసాగుతారు...
న్యూఢిల్లీ: ఎఫ్టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనికి సంబంధించి ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యధావిధిగా కొనసాగుతారు. అయితే చౌహాన్తో పాటుగా ఒక కో చైర్మన్ను నియమించేలా కేంద్రం ప్రతిపాదించింది. అలాగే విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అయిదుగురు సభ్యులను కమిటీన నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కాగా గత జూన్లో ఎఫ్టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్లో రాజకీయాలకు చోటు లేదని..బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనచేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయనాయకులు తమ మద్దుతును తెలియజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న చర్చలకు రావాల్సిందిగా విద్యార్ధి సంఘాల నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.. -
గజేంద్ర మోక్షం దిశగా..!
పుణె: వివాదాస్పదంగా మారిన ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నూతన అధ్యక్షుడి నియామకం కొలిక్కి వస్తుందా? ఆ పదవిలో నియమితులైన బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ను కేంద్రం రీకాల్ చేస్తుందా? అనే ప్రశ్నలకు మరో రెండు రోజుల్లో సమాధానాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంపై తమతో చర్చలు జరపాలంటూ విద్యార్థులు రాసిన లేఖలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ స్పందించింది. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్యలకు రావాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో దీక్ష విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. సానుకూల వాతావరణంలో సాగే చర్చల్లో తమ డిమాండ్ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ప్రకటించినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇన్ స్టిట్యూట్ పరిపాలనలో రాజకీయాలు తగవని, బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని గడిచిన 107 రోజులుగా దీక్షలు చేస్తున్న ఎఫ్ టీఐఐ విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement