-
రామ్గోపాల్వర్మను అరెస్టు చేయాలి
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్గోపాల్వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీవీ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద అశ్లీల వెబ్ సిరీస్ ‘జీఎస్టీ’పై నమోదైన కేసులో దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) విచారణ వాయిదా పడింది. ఇప్పటికే ఓసారి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న ఆయన శుక్రవారం రెండోసారి హాజరుకావాల్సి ఉంది. తొలి రోజు విచారణలో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్, ల్యాప్టాప్లను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన విషయం తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు. ఈలోపు జీఎస్టీకి వర్మకు ఉన్న సంబంధాలను ఆరా తీసేందుకు ఈ వెబ్ సిరీస్కు పనిచేసిన మరికొందరిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో తగిన ఆధారాలు లభిస్తే వర్మను అరెస్టు చేయాలా? లేక న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నిస్తే మరిన్ని కీలకాంశాలు రాబట్టడంతో పాటుగా తదుపరి చర్యలు తీసుకోవానికి ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
వర్మపై మరో కేసు.. వారంలోగా అరెస్ట్ చేయకపోతే!
సాక్షి, ద్వారకానగర్ (విశాఖపట్నం) : వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాలు కొనసాగించిన దీక్షపై పోలీసులు ఎట్టకేకలకు స్పందించారు. దర్శకుడు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మహిళా సంఘాలు తమ నిరాహార దీక్షను ముగించారు. అయితే వారం రోజుల్లోగా రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు తెలిపారు. కాగా, వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల దీక్షతో ఎట్టకేలకు పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడంతో పాటు టీవీ చర్చలలో మాట్లాడుతూ మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వర్మను అరెస్టు చేయాల్సిందే!
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ రెండోరోజు గురువారం కూడా మహిళా సంఘాలు తమ దీక్ష కొనసాగించాయి. వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ డిమాండ్ చేస్తున్నాయి. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడం.. ఈ సినిమాపై టీవీ చర్చల సందర్భంగా మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసులలో ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదుకావడం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాంగోపాల్వర్మను తీవ్రంగా శిక్షించాలని, లైంగిక స్వేచ్ఛ మహిళలకు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అతనిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మణి, లక్ష్మి, విమల, మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వర్మ వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళాలపై దాడులు, చిన్నారులపై హత్యలు, యువతులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలు శ్రీదేవి వర్మ, షబీరా బేగం, శశికళ, పీవోడబ్ల్యూ నేతలు, పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కాగా, వర్మపై ఐద్వా మహిళా సంఘం నాయకురాలు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీజోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఆ చానెల్పై క్రిమినల్ కేసులు వేస్తా: వర్మ
సాక్షి, ముంబై: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ న్యూస్ చానెల్పై కన్నెర్ర జేశారు. టీవీ9 చానెల్పై క్రిమినల్ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్లో తెలిపారు. కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్ జోకర్స్గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సదరు చానెల్పై వర్మ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల వివాదాస్పద ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వెబ్సినిమా విషయంలో వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అడల్ట్ చిత్రంపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ సామాజిక కర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్ పోలీసులు మూడు గంటలపాటు విచారించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement