-
నేడే గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బంది.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
APPSC Group-2: ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా పకడ్భందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు దరఖాస్తు చేయగా 4,63,517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒకరిని పట్టుకున్నారు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో నకిలీ హాల్ టికెట్లతో పరీక్ష రాసేందుకు యత్నించారనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్, జూలైలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17న గ్రూప్-1 పరీక్షను పకడ్భందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 పరీక్షకు సెంటర్లకు కొరత వచ్చే అవకాశం లేదన్నారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వదంతులు ఎవరూ నమ్మొద్దన్నారు. పరీక్షలు వాయిదా పడతాయనే వదంతులు నమ్మకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావాలన్నారు. -
ఏపీలో యధావిధిగా గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
-
Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్పోన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీతో భేటీ -
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్ పరీక్ష వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. అభ్యర్థుల స్గోగన్స్తో TSPSC పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. Group 2 aspirants protested at TSPSC office, demanding to postpone the exam. INC leader Addanki Dayakar, TJS President Kodandaram extended support to unemployed#Telangana #Students #Unemployed #Group2 pic.twitter.com/NZi1vTiYha — Aapanna Hastham (@AapannaHastham) August 10, 2023 పై పరీక్షల అన్ని కూడా వేరు వేరు సిలబస్ ఉండడం వల్ల ప్రిపేర్ కావడం కష్టం అంటున్నారు అభ్యర్థులు. గ్రూప్-2 సిలబస్లో కొత్త అంశాలను చేర్చటం వల్లవాటి బుక్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ల లీకేజీలతో మానసికంగా కుంగిపోయామని, 7 సంవత్సారాలు ఆపారు.. మూడు నెలలు ఆపలేరా అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ చెబుతోంది. అయితే వాయిదా వేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement