-
ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్పాడు. హైదర్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు. కౌంటీల్లో డెర్బీషైర్ క్రికెట్ క్లబ్కు హైదర్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో భాగంగా డర్హామ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదర్ ఊహించని రీతిలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? డెర్బీషైర్ ఇన్నింగ్స్ 77 ఓవర్ వేసిన స్కాట్ బోర్త్విక్ బౌలింగ్లో రెండో బంతిని హైదర్ అలీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ప్యాడ్కు తాకి వెనుక్కి వెళ్లింది. దీంతో వికెట్ కీపర్తో పాటు బౌలర్ కూడా ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తల ఊపాడు. అయితే హైదర్ అలీ మాత్రం కనీసం బంతి ఎక్కడ ఉందో చూసుకోకుండా రన్ కోసం ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రాబిన్సన్ వెంటనే స్టంప్స్ను పడగొట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్అంపైర్ థర్ఢ్ అంపైర్కు రీఫర్ చేశారు. పలు కోణాల్లో రీప్లేను పరిశీలించిన థర్ఢ్ అంపైర్ స్టంపౌట్గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో నెటిజన్లు పలు విధాలగా స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే.. కొంచెం కూడా తెలివుండదు అని కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హైదర్ అలీ 38 పరుగులు చేశాడు.! చదవండి: Dravid- Kohli: విండీస్తో ప్రత్యేక మ్యాచ్.. కోహ్లిపై ద్రవిడ్ ప్రశంసల జల్లు! ఆ మూడు గుణాల వల్లే.. Not a dismissal Haider Ali will want to see again any time soon 😬 #CountyCricket2023pic.twitter.com/gFgvMXx8Wj — Wisden (@WisdenCricket) July 19, 2023 -
Pak Vs Eng: ఇదేంట్రా బాబు.. ఇలా కొట్టేశావు! వీడియో వైరల్
Pakistan vs England, 6th T20I - Viral Video: ఇంగ్లండ్తో పాకిస్తాన్ ఆరో టీ20 సందర్భంగా అంపైర్ అలీమ్ దర్కు గాయమైంది. కాసేపు నొప్పితో విలవిల్లాడిన అతడు.. తర్వాత అంపైరింగ్ కొనసాగించాడు. కాగా ఏడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆరో టీ20లో తొలుత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హైదర్ అలీ.. ఆరో ఓవర్లో రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్లో పుల్షాట్ బాదాడు. ఆ సమయంలో లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న అలీమ్ దర్ తొడ వెనుక భాగంలో బంతి గట్టిగా తగిలింది. అయితే, అదృష్టవశాత్తూ అతడికి పెద్దగా గాయమేమీ కాలేదు. కొన్ని క్షణాల పాటు నొప్పితో బాధపడిన అలీమ్ వెంటనే సర్దుకుని మళ్లీ తన డ్యూటీలోకి దిగాడు. ఇక బౌలర్ రిచర్డ్ అలీమ్ దగ్గరకు వెళ్లి పరామర్శించగా.. పర్లేదు అంతా బాగానే ఉంది అన్నట్లుగా అతడు సమాధానమిచ్చాడు. ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు అన్నట్లుగా ఆ అంపైర్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏదేమైనా అతడికి ప్రమాదం తప్పింది. ఫైనల్గా పాక్ మ్యాచ్ ఓడింది’’ అని మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఆట తీరుతో చెలరేగడంతో ఇంగ్లండ్.. పాక్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని సూనాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 3-3తో సమం చేసింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్రూమ్కు వెళ్లిన హైదర్ అలీ.. కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయినప్పటికీ ఈ యువ బ్యాటర్ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: Irani Cup 2022: కుప్పకూలిన సౌరాష్ట్ర టాపార్డర్.. 0,4,0,1,2... 98 పరుగులకే ఆలౌట్ Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV — Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022 -
PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్పై కరోనా పంజా..
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్లో పాల్గొనబోయే నలుగురు క్రికెటర్లు సహా ఆ దేశ దిగ్గజ బౌలర్, కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్ వసీం అక్రమ్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన లీగ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. కోవిడ్ బారిన పడిన ఆటగాళ్లలో పెషావర్ జల్మీకి చెందిన వాహబ్ రియాజ్, హైదర్ అలీ ఉన్నారు. అంతకుముందు ఇదే ఫ్రాంచైజీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్లకు కూడా కరోనా వచ్చింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితం వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పీసీబీ గతంలో ప్రకటించింది. చదవండి: 145 కిమీ పైగా స్పీడ్తో బౌల్ చేసే ఆ బౌలర్ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్ -
Pak Vs WI: విండీస్ 137 పరుగులకే ఆలౌట్.. పాకిస్తాన్ ఘన విజయం
T20 Series- Pakistan Won In 1st T20 Against West Indies: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 78; 10 ఫోర్లు), హైదర్ అలీ (39 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా...చివర్లో నవాజ్ (10 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం విండీస్ 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. షై హోప్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వసీమ్ (4/40), షాదాబ్ ఖాన్ (3/17) ప్రత్యర్థిని పడగొట్టారు. హైదర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. స్కోర్లు: పాకిస్తాన్- 200/6 (20) వెస్టిండీస్- 137 (19) Player of the match @iamhaideraly reviews his 68-run innings.#PAKvWI #HumTouKhelainGey pic.twitter.com/WSw3OxZsXN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 It's a WRAP from the National Stadium Karachi! Pakistan win by 63 runs and go 1-0 in three-match #PAKvWI T20I series.#HumTouKhelainGey pic.twitter.com/QqGvlhgauZ — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 But falls to @76Shadabkhan shortly after pic.twitter.com/UnejzC7gKw — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్గా ఉన్న ఫఖర్ జమాన్ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement