-
కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్ప్రీత్సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్లో ఉన్నట్టు వివరించారు. భారత్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై తమ నిర్ణయం ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్ప్రీత్ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన హర్ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
మళ్లీ మెరిసిన హర్ప్రీత్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం నెగ్గగా... జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో హర్ప్రీత్ 0–8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9–0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో హర్ప్రీత్కిది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. అతను 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గగా... ఈసారి రజతం దక్కించుకున్నాడు. -
మన రెజ్లర్లు విఫలం
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ల పోరాటం ముగిసింది. రెండో రోజు బరిలోకి దిగిన జ్ఞానేందర్ (59 కేజీలు), రవీందర్ (66 కేజీలు), హర్ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయారు. జ్ఞానేందర్ తొలి రౌండ్లో 4–1తో లిబిన్ డింగ్ (చైనా)పై గెలిచి, ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–9తో మిరామ్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ హర్ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్లు ఆడి 537 పరుగులు చేసిన హర్ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్ప్రీత్ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు. ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్ప్రీత్ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement