-
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
AP: తమ్ముళ్ల ‘ఉనికి’పాట్లు
సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. గడప గడపకు మన ప్రభుత్వంతో నాయకులు ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధిని వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుండటం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ కోవలోనే శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా విజయదుందుభి మోగించిన వైఎస్సార్సీపీ.. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలుగుదేశం పారీ్టలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ ‘ఉనికి’ చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ‘తమ్ముళ్ల’ను గందరగోళానికి గురిచేస్తుండటం గమనార్హం. సాక్షి, నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డిపై 39వేలకు పైగా మెజారీతో గెలుపొందారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ నమోదు దిశగా పార్టీ దూసుకుపోతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కరువైంది. ఓటమి తప్పదని తెలిసినా ఇద్దరు నేతలు సీటు తనకంటే తనకని సిగపట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా గ్రూపులుగా ఏర్పడి దూషణలకు తెరతీయడం పార్టీ పరువు బజారున పడుతోంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో బేరం పెట్టారనే చర్చ జరుగుతోంది. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటారో వాళ్ల వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గీయులే చెప్పుకుంటున్నారు. ఇకపోతే 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయనపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామం 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బుడ్డా వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రజా క్షేత్రంలో తిరుగులేదని చాటుకుంది. లోకేశ్ మద్దతు తనకే ఉందని, జిల్లా టీడీపీ నాయకులు కూడా అభ్యర్థిగా తన పేరునే అధిష్టానికి సూచించారని చెప్పుకుంటున్న బుడ్డా పార్టీ ఫిరాయింపు మచ్చను ఇప్పటికీ తుడిచేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో గెలుపును అందిస్తే.. తమ మనోభావాలను టీడీపీకి తాకట్టు పెట్టారని ప్రజలు ఇప్పటికీ ఆయనపై భగ్గుమంటున్నారు. డబ్బు మూటలతో ఏరాసు.. ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ హయాంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ప్రజలు ఆయనను ఆదరించకపోవడంతో ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ తరపున పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో తప్పితే ఎప్పుడూ కనిపించని, ప్రజలతో సత్సంబంధాలు లేని ఈయన డబ్బును నమ్ముకుని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. టిక్కెట్ తనకు ఇస్తే ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదనే విషయాన్ని ఆయన ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తన ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన జనవరిలో తనను ఇన్చార్జ్గా ప్రకటిస్తారని తన వర్గంతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే ఏరాసు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలు మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వార్ నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఎక్కడా కనిపించని ఏరాసు ఎన్నికల సమయంలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో టీడీపీ టిక్కెట్ తనకేనని ఆయన ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బుడ్డా వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఎన్నికల సమయంలో ఆయన షో చేస్తున్నారని ఘాటు గా స్పందిస్తోంది. టిక్కెట్ ఎవరికనే విషయంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేకపోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటి ఆ పార్టీ వర్గీయులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీలో చేరిపోతుండగా.. నేతలను కూడా ఓటమి భయం వెంటాడుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ కూడా టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
మామ, అల్లుళ్ల డబుల్ ధమాకా
తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ఊపిరి సిద్దిపేట. ఉద్యమాల పురిటి గడ్డగా, విలక్షణమైన తీర్పునకు వేదికగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. నాడు తెలంగాణ ప్రజాసమితితో తొలిదశ ఉద్యమానికి అనంతుల మదన్ మోహన్ నాయకత్వం వహించారు. నేడు మలిదశ ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ ఇది. మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరీశ్రావు ప్రస్తుతం అదే పరంపర కొనసాగిస్తున్నారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడి 71 ఏళ్లు అయినప్పటికీ ఐదు దశాబ్దాలుగా ముగ్గురిని మాత్రమే ప్రజలు ఆదరించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్ సాధించగా, సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్రావు మాత్రం డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, టీపీఎస్, స్వతంత్ర అభ్యర్థులను ఆదరించారు. ప్రస్తుతం ఏడోసారి విజయం కోసం హరీశ్రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ ముగ్గురే.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇరవై సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1952లో ఎడ్ల గురవారెడ్డి(పీడీఫ్), 1957 లో రాజేశ్వర్రావు(కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు(స్వతంత్ర), 1967లో వీబీ రాజు(కాంగ్రెస్)ను నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఆదరించి గెలిపించారు. తర్వాత 1970లో పోటీ చేసిన మదన్ మోహన్ను నాలుగు సార్లు, తర్వాత పోటీ చేసిన కేసీఆర్, హరీశ్రావును ఆరు సార్లు వరుసగా గెలిపించారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్, కేసీఆర్, హరీశ్రావు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఉద్యమానికి వేదిక.. సిద్దిపేట తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి వేదిక లాంటిది. 1969 తొలి విడత ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో వీబీ రాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 1970లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(పీడీఎఫ్) నుంచి అనంతుల మదన్ మోహన్ పోటీచేసి విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలైన మదన్ మోహన్ రాజకీయ ప్రస్థానం 1985 వరకు కొనసాగింది. కాంగ్రెస్లో టీపీఎస్ విలీనం కావడంతో పీవీ రాజేశ్వర్రావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మదన్ మోహన్ పలుశాఖల మంత్రిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మదన్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అదే పంథాలో సీఎం కేసీఆర్ 2001లో మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. 2001 నుంచి గులాబీ గుబాళింపు ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నేడు గులాబీ పార్టీకి కంచుకోట అయ్యింది. తెలంగాణ మలి విడత ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరిట గులాబీ జెండా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రెండు దశాబ్దాల కాలం పైగా సిద్దిపేట గులాబీ పార్టీకి అడ్డాగా మారింది.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement