-
నేటి నుంచి కుర్రాళ్ల పోరు
కేప్టౌన్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు కుర్రాళ్లకు అవకాశం దక్కింది. నేటి నుంచి అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు వారు సిద్ధమయ్యారు. మొత్తం 16 జట్లు తలపడే ఈ టోర్నీలో యువ భారత్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఎలాగో కుర్రాళ్ల సంగ్రామంలో భారత్ అలాంటి జట్టు. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో యువ జట్టు నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా నిలిచింది. ఇప్పుడు గ్రూప్–డిలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్లతో మరో టైటిల్ వేటకు సిద్ధమైంది. నేడు ఆతిథ్య దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’లో తొలి పోరు జరగనుండగా... 19న యువ భారత్ తొలి మ్యాచ్లో శ్రీలంకతో తలపడుతుంది. వచ్చే నెల 9న జరిగే తుదిపోరుతో ఈ మెగా ఈవెంట్ ముగుస్తుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక దశలో ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్ లీగ్లో తలపడతాయి. ఇంకో దశలో తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేట్ లీగ్ పోటీలు జరుగుతాయి. అయితే సూపర్ లీగ్ జట్లు మాత్రమే టైటిల్ వేటలో ఉండగా... మిగతా జట్లు వర్గీకరణ పోటీల్లో తలపడతాయి. భారత అండర్–19 జట్టు: ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ, అథర్వ అంకోలెకర్, యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్, దివ్యాన్‡్ష సక్సేనా, సిద్ధేశ్ వీర్, ఆకాశ్ సింగ్, శుభాంగ్ హెగ్డే, ధ్రువ్ జురెల్, కుశాగ్ర కుమార్, విద్యాధర్ పాటిల్, శాశ్వత్ రావత్, దివ్యాన్‡్ష జోషి. యువ భారత్ మ్యాచ్ల షెడ్యూల్ (వేదిక బ్లూమ్ఫొంటెన్ ) జనవరి 19 భారత్–శ్రీలంక జనవరి 21 భారత్–జపాన్ జనవరి 24 భారత్–న్యూజిలాండ్. -
విజేత యువ భారత్
డర్బన్: ప్రపంచకప్కు ముందు భారత యువ జట్టు తమ సత్తాను ప్రదర్శిస్తూ నాలుగు దేశాల అండర్–19 వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఆరంభంలో గెరాల్డ్ కోయిజే (3/19) విజృంభించడంతో... యశస్వి జైస్వాల్ (0), దివ్యాన్‡్ష సక్సేనా (6), సారథి ప్రియమ్ గార్గ్ (2) వెంట వెంటనే పెవిలియన్కు చేరారు. దీంతో భారత్ 13 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ట్రోఫీతో హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్వర్మ ఈ దశలో జట్టు బాధ్యతను తిలక్ వర్మ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్), ధ్రువ్ జురెల్ (115 బంతుల్లో 101; 8 ఫోర్లు, 2 సిక్స్లు) తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో సిద్ధేశ్ వీర్ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది. ఛేదన ప్రారంభించిన దక్షిణాఫ్రికాను అథర్వ అన్కోలేకర్ (4/31) హడలెత్తించడంతో... ఆ జట్టు 43.1 ఓవర్లలో 190 పరుగులకే చాప చుట్టేసింది. జాక్ లీస్ (52; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్లోనూ రాణించిన తిలక్ వర్మ కీలకమైన ఓపెనర్ ఆండ్రూ లోవ్ (17; 3 ఫోర్లు) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ధ్రువ్ జురెల్ అవార్డు అందుకోగా... టోర్నీ మొత్తం రాణించిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. -
భారత కుర్రాళ్ల క్లీన్స్వీప్
టాంటన్: అన్ని విభాగాల్లో రాణించిన భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్తో జరిగిన ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ను 5–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత కుర్రాళ్ల జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాహుల్ చహల్ నాలుగు, అభిషేక్ శర్మ 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ పృథ్వీ షా (45 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్స్), హర్వీక్ దేశాయ్ (44; 4 ఫోర్లు, ఒక సిక్స్), కమలేశ్ నాగర్కోటి (26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. -
ఇంగ్లండ్ 311/1
నాగ్పూర్: భారత్ అండర్–19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఇంగ్లండ్ అండర్–19 జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు మ్యాక్స్ హోడ్లెన్ (135 బ్యాటింగ్; 17 ఫోర్లు), జార్జి బార్ట్లెట్ (132 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో సోమవారం ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది. -
భారత అండర్-19 జట్టు నుంచి చందన్ సహాని ఔట్
వయస్సు పైబడిన ఏడుగురు క్రికెటర్లపై బీసీసీఐ వేటు ముంబై: ఆసియా కప్ కోసం లోగడ ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు నుంచి హైదరాబాద్ క్రికెటర్ చందన్ సహానిని తప్పించారు. వయస్సు పైబడటంతో ఇతనితో పాటు మొత్తం ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేశారు. దిగ్విజయ్ రంగీ, డారిల్ ఫెర్రారియో, సందీప్ తోమర్, రిషబ్ భగత్, సిమర్జిత్ సింగ్, ఇజాన్ సయ్యద్లను తప్పించి కొత్తగా హిమాన్షు రాణా, సల్మాన్ ఖాన్, హర్విక్ దేశాయ్, యశ్ ఠాకూర్, హెరాంబ్ పరాబ్, వివేకానంద్ తివారి, హేత్ పటేల్లను భారత జూనియర్ జట్టుకు ఎంపిక చేశారు. తప్పించిన ఆ ఏడుగురు క్రికెటర్లు నవంబర్ 1998కు ముందు జన్మించారు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అనర్హులనీ తేల్చి వయస్సు నిబంధనలపై బీసీసీఐకి స్పష్టతనిచ్చింది. ఇందులో ఎవరికైతే వచ్చే అండర్-19 ప్రపంచకప్ (న్యూజిలాండ్) నాటికి 19 ఏళ్లలోపు వయస్సుంటుందో వారే అర్హులని తెలిపింది. దీంతో కొత్తగా అర్హులైన ఏడుగురు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఆసియా కప్ అండర్-19 టోర్నీ ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంకలో జరుగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement