-
భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..
హరిద్వార్: పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు. -
టెలీమెడిసిన్తో ఉత్తమ వైద్యం
సదస్సులో వైద్య నిపుణుల ఆశాభావం సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్య సేవల్లో టెలీమెడిసిన్ కీలకంగా మారబోతోందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేసే అవకాశం ఉందన్నారు. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషి యన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఈఏ పీఐఓ) 7వ వార్షిక సదస్సు శనివారం పార్క్హ యత్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశంతో పాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి సుమారు 70 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈఏపీఐఓ అధ్యక్షుడు డాక్టర్ శంఖు సురేందర్రావు, ఎలక్టివ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేశ్ మెహతా, ఎలక్టివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ్ సిబల్, కోశాధికారి డాక్టర్ సుధీర్ బారీక్, ప్రధాన కార్యదర్శి నందకు మార్ జయరామ్, డాక్టర్ అమితవ్ బెనర్జీ, డాక్టర్ నీరజ్ భల్లా, డాక్టర్ సురేంద్ర కె.వర్మ, డాక్టర్ అరుణ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, హైపర్టెన్షన్, కేన్సర్ వంటి జబ్బులు పెరుగుతున్నాయన్నారు. టెలీమెడిసిన్ ప్రవేశంతో ఈ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే టెలీమెడిసిన్ అందుబాటులోకి వస్తుం దన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్కేర్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది 2017 అవార్డును ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ నవాబ్ షఫీ ఉల్ముల్క్కు అందజేశారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఈ టెలీ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్ ద్వారకానాథ్రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement