-
పిల్లల ఫొటోల్ని షేర్ చేయకండి
గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. -
మునుగోడు యాక్షన్ ప్లాన్ రెడీ.. లక్ష మంది కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకముందే వినూత్నంగా ప్రచారంలోకి వెళుతోంది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆ పార్టీ నేతలు.. లక్ష మంది కాళ్లు మొక్కి ఓట్లడగాలని నిర్ణయించారు. ప్రచారం కోసం ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ రూపొందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్వయంగా కాళ్లు మొక్కి ఓట్లు అడిగే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించారు. రాజీవ్ జయంతిలో భాగంగా నియోజకవర్గంలోని 125 గ్రామాలు, పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 176 చోట్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీపీసీసీస్థాయి నేతలతోపాటు పలు జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి ఐదుగురు నేతల చొప్పున పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించగా, వారికి మరో నలుగురు నాయకులు తోడు కానున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరంతా గ్రామాల్లోనే ఉండి స్థానిక కేడర్తో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతిచోటా పేదలకు పండ్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం టీపీసీసీ పేరుతో సోనియా, రాహుల్గాంధీ చిత్రపటాలతోపాటు రాజీవ్గాంధీ బొమ్మ, హస్తం గుర్తుతో కూడిన బ్యాగ్ను కూడా రూపొందించారు. అదేవిధంగా మన మునుగోడు–మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు కూడా రూపొందించారు. ఈ స్టిక్కర్లు, కరపత్రాలను శుక్రవారం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జులు,ముఖ్య నేతలతో రేవంత్రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న మన మునుగోడు–మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతలు పార్టీ జెండాలు ఎగురవేసి రాజీవ్గాంధీకి నివాళులర్పించాలని, ఆయన దేశం కోసం చేసిన త్యాగం, సేవల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని, నాయకులను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలను ఎదుర్కొనాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందులోభాగంగా ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తనతో సహా వెయ్యి మంది నాయకులు వంద మంది చొప్పున మొత్తం లక్ష మందికి పాదాభివందం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. చదవండి: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..? -
మహమ్మారికి ‘మాస్క్’ దెబ్బ
సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా అధికారులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు నగర ప్రధాన కూడళ్లలో లారీపై కళాజాత నిర్వహిస్తూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలంటూ పాటల రూపంలో వినిపిస్తున్నారు. చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? -
వినూత్నం: బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు
పశ్చిమగోదావరి: ఓటర్లను ఆకట్టుకోడానికి పోటీల్లో ఉన్న అభ్యర్థులు వినూత్న పద్ధతులు ఆవలంబిస్తున్నారు. ఉండి మండలంలోని ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి ఆదివారం తన వార్డు పరిధిలోని ఓటర్లకు ఇంటింటికీ బ్రాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, గృహావసర వస్తువులు పంపిణీ చేయడం పరిపాటి. అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త ధోరణిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాంసాహార ప్రియులు ఆదివారం సాధారణంగా చేపలు, మాంసం కొనుగోలు చేస్తుంటారు. దీనిని గ్రహించిన వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఏకంగా ఒక్కొక్క ఇంటికి బ్రాయిలర్ కోడితో పాటు పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసి పోటీలో ఉన్న ప్రత్యర్థిని కంగు తినిపించారు. అదే మండలంలోని మరొక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న వ్యక్తి ఇంటి అవసరాలకు ఉపయోగపడే కిరాణా సరుకులను పంపిణీ చేశారు. (చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..) (చదవండి: బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..) -
చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలకు నిరసనగా కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గుండు గీయించుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు. బీసీలపై జగన్కున్న ప్రేమ, బీసీ డిక్లరేషన్లో ఆయన ప్రకటించిన నిర్ణయాలు నచ్చి జగన్కు అండగా నిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు జిల్లా అంతటా వినూత్నంగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. బీసీలను చంద్రబాబు వంచించారని, జిల్లాలో ఒక్క ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు జిల్లా అంతటా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని గ్రామాలు తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఇంటికి వెళ్లి జగన్ బీసీ కోసం చేస్తున్న కార్యక్రమాలు, అన్ని పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం, బీసీ నిధులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement