-
అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్ యూనివర్సిటీ, న్యూయార్క్లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం ఆదివారం ప్రారంభమైంది. న్యూయార్క్లోని భారత దౌత్యవేత్త జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ భాషకు అగ్రస్థానం కల్పిస్తోందని జ్ఞానేశ్వర్ కొనియాడారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సమ్మేళనంలో హిందీ భాషకు ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తారు. హిందీ రచనలు, రచయితలకు భారతదేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాలేదని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అమెరికాలోని భారతీయ విద్యాభవన్కు చెందిన సీకే రావు, జయరామన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సత్యనారాయణ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ డా. గార్నెనితో పాటు వివిధ దేశాల నుంచి ఎంపికైన 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
న్యూయార్క్: న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్స్ విశ్వ విద్యాలయం, న్యూయార్క్లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం స్థానిక రాత్గేర్స్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనంలో ప్రపంచంలో హిందీ భాష ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని ఎలా అధిగమించాలో చర్చిస్తారు. భారత దౌత్య అధికారి జ్జ్ఞానేశ్వర్ ములే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం హిందీ భాషకు అగ్ర స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. విదేశాలలో సైతం మోదీ హిందీలోనే ప్రసంగాలు చేస్తున్నారన్నారు. హిందీ మాతృభాషగా కలిగిన వివిధ ప్రాంతాల వారు, హిందియేతర ప్రాంతాల రచయితలు వారి రచనలను, అదేవిధంగా విదేశాల నుండి వెలువడుతున్న హిందీ సాహిత్యానికి, భారత దేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాదని, కేవలం భారత దేశంలోని 10 రాష్ట్రాలకే పరిమితం అవుతుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హెచ్చరించారు. ప్రయాగలోని త్రివేణి సంగంలో కనిపించని సరస్వతి నదితో పాటు గంగ, యమునల సంగమాన్ని భారతీయులు అందరు భక్తీ భావనతో చూస్తారని చెప్పారు. కానీ దక్షిణాదిలో వున్న కన్యాకుమారిలో మూడు సముద్రాలూ సంగమమై ఉన్నాగాని దక్షిణ భారత దేశపు ప్రాశస్త్యతను ఉత్తరాది వారు గుర్తించడం లేదని చెప్పారు. అదే విధంగా దక్షిణాదికి చెందిన రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారి ఆధ్యాత్మిక ప్రసంగాలే లేకపోతే హిందీ సాహిత్యంలోని స్వర్ణయుగంగా భావించబడే భక్తి సాహిత్యానికి మనుగడే వుండేది కాదని లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నల్ల సత్యనారాయణ, హిందీ భాష సాహిత్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలను వివరించారు. చార్లెస్ మాబ్రేల్స్, అషార్ దత్తర్, అమెరికాలోని భారతీయ విద్యా భవన్కు చెందిన డాక్టర్ సి.కె. రావు, జయరామన్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం హిందీ ఆచార్యులు, న్యూయార్క్లోని హిందీ ఆచార్యులు డాక్టర్ గార్నెని, డాక్టర్ వితూరి పొవెల్, హిందీ సంఘం ఫౌండేషన్ చైర్మన్ అశోక్ ఓజా, ఆంధ్ర విశ్వవిద్యాలయంకు చెందిన నల్లా సత్యనారాయణతో సహా అమెరికా, కెనడా, బ్రెజిల్, భారత దేశానికి చెందిన 200 మంది నిష్ణాతులైన ఆచార్యులు ఇందులో పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement