-
దక్షిణ మధ్య రైల్వే సీసీఎంగా పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (సీసీఎం)గా ఎం.పాపిరెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయిల్ఫెడ్ ఎండీగా పనిచేశారు. 1985 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి అయిన పాపిరెడ్డి, గుంతకల్ డివిజన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, గుంటూరు డివిజన్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేశారు. సింగరేణిలో చీఫ్ మార్కెటింగ్ అధికారిగా, ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా, నెడ్కాప్ వీసీ అండ్ ఎండీగా, ఉద్యాన శాఖ కమిషనర్గా విధులు నిర్వహించారు. -
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..
రైల్వేబోర్డుకు ఎంపీల ప్రతిపాదనలు వచ్చేనెలలో సాధ్యాసాధ్యాలపై చర్చ ఏటా మిగులుతున్న నిరాశ ఈసారైనా ప్రజాకాంక్షలకు బడ్జెట్ పట్టంకట్టేనా.. విశాఖపట్నం సిటీ: ఈసారైనా బడ్జెట్లో తమ డిమాండ్లు నెరవేరాలని రైల్వే ప్రయాణికులు కోరుకుంటున్నారు. బడ్జెట్కు ముందస్తు కసరత్తు దగ్గరపడ్డంతో ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియన్ రైల్వే టైంటేబుల్ కమిటీ(ఐఆర్టిటిసి) నవంబర్లో ఎంపీల నుంచి ప్రతిపాదనలను కోరింది. దీనిపై కొందరిప్పటికే నివేదికలు సమర్పించారు. మరి కొందరు ఇవ్వాల్సి వుంది. ఈనెల మొదటి వారంలో ఎంపీలు కోరిన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు సర్వే చేస్తారు. సర్వే అనంతరం వచ్చే నెలలో వీటిపై చర్చించి కొన్నింటిని ఆమోదిస్తారు. ఆమోదం పొందిన అంశాలను బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈసారి ఎంపీలు ఐఆర్టిటిసికి ఇచ్చిన ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవీ ప్రయాణికుల డిమాండ్లు వారణాసికి రెగ్యులర్ రైలు అవసరముంది. లేకుంటే భువనేశ్వర్, సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి మరో రైలు మారి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీకి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ రైలు కావాలి. విశాఖ నుంచి అవృతసర్కు వెళుతున్న హిరాకుడ్ ఎక్స్ప్రెస్ను రెగ్యులర్ చేయాలి. ప్రతీ సోమ, గురు, శుక్రవారాల్లో విశాఖ నుంచి బయల్దేరుతున్న ఈ రైలును రెగ్యులర్ చేస్తే ప్రస్తుతానికి కాస్త రద్దీని నియంత్రించేనట్టేనని రైల్వే వర్గాలంటున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నాన్స్టాప్ ఏసీ దురంతో ఎక్స్ప్రెస్ ఆది, మంగళ, గురువారాల్లో బయల్దేరుతుంది. ఈ రైలును రెగ్యులర్ చేస్తే కాస్త హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా వుంటుంది. నగరం నుంచి బెంగుళూరుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒక్కటే దిక్కయింది. మరొక రైలు కోసం ఎంపీలు పట్టుబడితే ప్రయోజనం వుంటుంది. రైల్వేబోర్డును ఎంపీలడిగిన రైళ్లివి: ఎంపీ కె. హరిబాబు ఢిల్లీకి విశాఖ నుంచి రైలు కావాలని అడుగుతున్నారు. రైల్వే జోన్ డిమాండ్ను ఆయన ప్రస్తావించలేదని తెలిసింది. విజయవాడ నుంచి తెలంగాణా మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ను విశాఖ మీదుగా మళ్లించాలని కోరారు.అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు నర్సీపట్నం నుంచి వయా చోడవరం మీదుగా కొత్తవలసకు కొత్త రైల్వే లైన్ కావాలంటున్నారు. అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాలు పొడవు, ఎత్తు పెంచాలని, రైల్వే జోన్ కావాలని లేఖ రాశారు. అరుకు ఎంపీ కొత్తపల్లి గీత అరుకు రైలుకు విస్టాడూమ్ అద్దాలున్న బోగీలు కావాలంటూ పాత ప్రతిపాదనే చేసినట్టు తెలిసింది. విజయనగరం ఎంపీ పి. అశోక్ గజపతి రాజు విశాఖ రైళ్లపై కన్నేశారు. విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్లను విజయనగరం వరకూ పొడిగించాలని కోరుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement