-
మంత్రి గంటాకు చేదు అనుభవం..!
సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి అంటూ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న టీడీపీ నేతలకు నిరసనలు తప్పడం లేదు. సీఎం నుంచి మంత్రులు దాకా, మంత్రులు నుంచి ఎమ్మెల్యేలు వరకూ ప్రజాగ్రహజ్వాలకు గురవుతున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పొగరి సీఎం చంద్రబాబు సభలో మహిళలు వ్యతిరేక నినాదాలతో మార్మోగించగా.. ఇప్పుడు విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ సాయిరాం కాలనీలోని జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆయనకు స్థానిక సమస్యలపై నిరసన జ్వాల ఎగసిపడింది. స్థానిక సమస్యలపై ప్రశ్నలవర్షం కురవడంతో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మంత్రి గంటాను స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్కు అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులు - కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 15వ వార్డులో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదంటూ అధికారులను నిలదీశారు. కాలనీలో నీరు, రోడ్లు, డ్రైనేజీ లేక అల్లాడుతుంటే పరిష్కారం చూపని జన్మభూమి తమకొద్దూ అంటూ, ఇక్కడినుంచి వెళ్లిపోండని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు - అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో జరిగిన జన్మభూమి కార్యాక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తిత్లీ తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు అధికారుల్ని, అధికార పార్టీ నేతల్ని నిలదీశారు. దీంతో అధికార పార్టీ నేతలు నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. తుపాను కారణంగా తీవ్రం నష్టపోయి రోడ్డున పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పైగా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. -
జన్మభూమి సభల్లో టీడీపీ ప్రచారం
హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి-మాఊరు సభల్లో అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదివారం పట్టణంలోని 25, 26, 27 వార్డుల్లో సభలు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగరోజు అందరూ సంతోషంగా ఉండాలని రేషన్కార్డుదారులకు చంద్రన్న కానుకలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిíస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం కొత్త రేషన్కార్డులు, చంద్రన్నకానుకల బ్యాగులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. వార్డుల్లోని సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయసాగారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement