-
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
-
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
చెన్నై: కశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు. అక్కడి నుంచి అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు జవానుల గ్రామాలకు తరలించారు. తిరుచ్చి నుంచి రెండు మార్గాల ద్వారా బయలుదేరిన జవానుల భౌతికకాయాలకు దారిపొడవునా ప్రజలు అశ్రునివాళులు అర్పించారు. అధికారులు, మంత్రులతో పాటు ప్రజలు గౌరవ సూచకంగా అంతిమ యాత్రలో పాల్గొనడంలో రోడ్లు స్తంభించిపోయాయి. అమరవీరుల త్యాగాలను మరువబోమంటూ, జైహింద్ అంటూ యువకులు, అన్నివర్గాల ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
రాహుల్ వస్తున్నారు.. అంత్యక్రియలు ఆపండి!
పెన్షన్ విషయమై ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు రాంకిషన్ గ్రెవాల్ అంత్యక్రియల సమయంలో కాసేపు పొలిటికల్ డ్రామా జరిగింది. వాస్తవానికి నాయకులు ఎవరూ రాకపోయినా తగిన సమయంలోనే తాము అంత్యక్రియలు చేద్దామని కుటుంబ సభ్యులు భావించారు. అందుకోసం గ్రెవాల్ మృతదేహానికి స్నానాలు కూడా చేయించారు. కానీ.. రాహుల్ గాంధీ వస్తారని, అప్పటివరకు అంత్యక్రియలు ప్రారంభించొద్దని కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ఆపారు. ఉదయం 10.45 గంటల సమయంలో రాహుల్ గాంధీ అక్కడకు చేరుకున్నారు. కొద్ది నిమిషాల పాటు గ్రెవల్ ఇంటివద్ద ఉండి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, అక్కడి నుంచి శ్మశానవాటికకు వెళ్లారు. రాహుల్ గాంధీ వచ్చేశారు కాబట్టి ఇక అంత్యక్రియలు చేస్తారనుకుంటున్న తరుణంలో.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో అంత్యక్రియలు జరగాలని కుటుంబ సభ్యులు భావించారు. దాంతో రాహుల్ కాసేపు అక్కడే వేచి ఉన్నారు. భివానీలోని శ్మశానవాటిక వద్దకు కేజ్రీవాల్ వచ్చేవరకు అరగంట పాటు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. మధ్యాహ్నం సమయానికి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకున్నారు. ఆయన వచ్చిన కొద్ది నిమిషాల తర్వాత గ్రెవాల్ పెద్దకొడుకు దిలావర్ తన తండ్రి చితికి నిప్పంటించారు. రాహుల్, కేజ్రీవాల్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా గ్రెవాల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బల్మా గ్రామానికి వెళ్లారు. వీళ్లంతా కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయలేదంటూ ప్రధాని మోదీని విమర్శించినా.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరదూరంగా ఉన్నారు. చితికి నిప్పంటించిన కొద్ది క్షణాలకే అక్కడినుంచి బయల్దేరదామని రాహుల్ భావించినా, కుటుంబ సభ్యులతో కాసేపు గడుపుదామని మళ్లీ తిరిగి వచ్చారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement