-
రెండో రోజూ ఉత్సాహంగా కాకతీయ వేడుకలు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. పలు వేదికల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఖిలావరంగల్ ఖుషిమహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను వరంగల్ కలెక్టర్ గోపి ప్రారంభించారు. హనుమకొండ అంబేడ్కర్ భవన్లో కాకతీయుల పాలనపై కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ హాజరై పలువురు కవులను సన్మానించారు. చారిత్రక వెయ్యిస్తంభాల గుడి ఆవరణలో కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు అలరించాయి. పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తృష్ణ నాటకం, చిందుయక్షగానం ప్రదర్శించారు. జనగామలో కాకతీయ ఉత్సవాలను కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. పేరిణి నృత్యం, బోనాలు, కోలాటాలు, బతుకమ్మలను ప్రదర్శించారు. ఉత్సవాల్లో తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
కాకతీయ ముగింపు ఉత్సవాలు ప్రారంభం
-
కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు
సాక్షి, హన్మకొండ : కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి వేదికలుగా ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిధుల లేమి కారణంగా కాకతీయ ఉత్సవాలు అరకొరగా సాగుతున్నాయి. ఉత్సవాల నిర్వాహణకు కోటి రూపాయలు విడుదల చేస్తామని గతేడాది ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ. 60 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులన్నీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. డిసెంబర్లో జరిగే ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిధుల కేటాయించాల్సిందిగా ఇటీవలే జిల్లా కలెక్టర్ కిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. -
మెగా...దగా
=కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఉత్తిదేనా.. =కనీసం ప్రతిపాదనల జాడే లేదు =మిగతా పర్యాటక ప్రాంతాలకు రెండో విడత నిధులు =ఈ ప్రాంతంపై వివక్షకు ఇదే నిదర్శనం =ముగింపునకు చేరుకున్న కాకతీయ ఉత్సవాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘వరంగల్ను రాబోయే సంవత్సరంలోగా మెగా టూరిస్ట్ సర్క్యూట్గా గుర్తిస్తాం. భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ప్రముఖంగా ఉంచుతాం. దీంతో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడకు రావడానికి.. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి దోహదపడుతుంది. వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో విశాఖ బీచ్ కారిడర్.. తర్వాత రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో వరంగల్కు మెగా సర్క్యూట్గా అవకాశం కల్పిస్తాం.’ ఇవీ.. గత ఏడాది డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేసిన బాసలు. ఆయన ఈ హామీ ఇచ్చి... దాదాపు పదకొండు నెలలు కావస్తోంది. ఏడాది పాటు మొక్కుబడిగా సాగిన కాకతీయ ఉత్సవాలు.. ముగించేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ, ఇప్పటికీ మెగా టూరిస్ట్ సర్క్యూట్ ఎక్కడ..? కనీసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయా...? అంటే జిల్లా యంత్రాంగం సైతం ఏం చెప్పలేకపోవడం గమనార్హం. కాకతీయ ఉత్సవాలకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ కిషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మెగా టూరిస్టు సర్క్యూట్కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు... ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం ఏమీ పంపించలేదని... టూరిజం విభాగం నుంచి ప్రతిపాదనలు పంపిస్తామని జవాబిచ్చారు. దీంతో వరంగల్ను టూరిజం సర్క్యూట్గా గుర్తించే ప్రక్రియ ఏ దశలో ఉందో తెలిసిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రభుత్వం విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ కారిడార్ను మెగా టూరిస్టు సర్క్యూట్గా గుర్తించింది. ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం తరఫున రూ.45.88 కోట్లు మంజూరు చేసేందుకు ఆ శాఖ మంత్రి చిరంజీవి ఆమోదం తెలిపారు. తొలి విడతగా రూ.3.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో గుర్తించిన తిరుపతి, కడప మెగా సర్య్కూట్ ప్రాజెక్టులు అమలు రెండో దశకు చేరింది. వీటికి సైతం మంత్రి చిరంజీవి రెండు నెలల కిందటే నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తిరుపతి ప్రాజెక్టుకు రెండో విడతగా రూ. 13.95 కోట్లు, కడప మెగా ప్రాజెక్టుకు రూ.11.07 కోట్లు మంజూరు చేశారు. తిరుపతి, కాళహస్తి, కాణిపాకంతో పాటు చిత్తూరు జిల్లాలోని వివిధదేవాలయాలు, పరిసర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యంలో గొలుసుకట్టులా నిర్మితమైన కోటలు, దాదాపు 21 దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కడప జిల్లాకు మెగా సర్క్యూట్ మంజూరైంది. కానీ... కాకతీయుల శిల్ప కళా వైభవానికి, కాకతీయ సామ్రాజ్యానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన వరంగల్ను ఇప్పటికీ మెగా సర్క్యూట్గా గుర్తించకపోవడం ఈ ప్రాంతంపై పాలకుల వివక్షకు అద్దం పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన నగరంగా వరంగల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారసత్వంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని మెగా సర్క్యూట్గా గుర్తిస్తే కాకతీయుల దేవాలయాలతో పాటు ఆనాటి గొలుసుకట్టు చెరువులన్నీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఉపాధితో పాటు పర్యాటక రంగానికి చేయూతనిచ్చే ఈ ప్రాజెక్టుకు స్వయానా కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా... కనీసం కాగితాలపై ప్రతిపాదనలు సైతం ఇప్పటికీ సిద్ధం కాకపోవడం, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులకు ఏకంగా రెండో విడత నిధులిచ్చేటప్పుడు కనీసం వరం గల్ ఊసెత్తక పోవడం గమనార్హం. జిల్లా నుంచి కేం ద్ర, రాష్ట్ర కేబినెట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు సైతం ఏడాది పాటుగా కనీసం ఈ హామీని అమలు చేసే దిశగా వీసమెత్తు ప్రయత్నం చేయకపోవడం...చిరంజీవిని కలిసి ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసే చొరవ చూపకపోవడం శోచనీయం. -
రా రమ్మని.. రా రా రమ్మని
ఓరుగల్లుకు పెరిగిన పర్యాటకుల రాక ఈ ఏడు అరకోటి మంది సందర్శన ఏడాదిలో రెట్టింపు సంఖ్యలో తాకిడి సాక్షి, హన్మకొండ : కాకతీయుల చారిత్రక వైభవం తెలుసుకోవడంతోపాటు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పర్యాటకులు వరంగల్కు వచ్చేందుకు ఆసక్తి చూపారు. ఈఏడాది ఇప్పటికే అరకోటి మందికి పైగా పర్యాటకులు జిల్లాకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో 608 మంది విదేశీ టూరిస్టులు ఉండడం విశేషం. మేడారం మహా జాతరను మినహాయిస్తే ఈ స్థాయిలో జిల్లాకు పర్యాటకులు రావడం ఇదే ప్రథమం. కాకతీయ ఉత్సవాల ప్రభావం కాకతీయ రాజుల రాజధాని వరంగల్ . వారి పాలనకు గుర్తుగా ఖిలావరంగల్, వేయిస్తంభాల ఆలయాలతోపాటు కళ్లు చెదిరే శిల్పసంపదకు నెలవైన రామప్ప ఆలయం, గణపురం కోటగుళ్లు వంటి చారిత్రక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. అంతేకాదు... లక్నవరం, పాకాల, గణపసముద్రం, ఏటూరునాగారం అ భయారణ్యం వంటి ప్రకృతి అందాలు జిల్లా సొంతం. అన్నీ ఉన్నప్పటికీ సరైన ప్రచారం లభించక హైదరాబాద్తో పో ల్చితే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. అయితే ఇక్కడి చారిత్రక ప్రాంతాలను వరల్డ్ హెరి టేజ్ సైట్స్గా గుర్తించాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 2012 డిసెంబర్లో కాకతీయ ఉత్సవాలను ప్రారంభిం చింది. ఈ నేపథ్యంలో మీడియా సైతం ఓరుగల్లులోని ప ర్యాటక ప్రాంతాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో 2012-13 ఏడాదికి గాను వరంగల్ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. వీటి ప్రభావంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012లో జిల్లాకు వచ్చిన పర్యాట కుల సంఖ్య 23,00,000 ఉంది. జిల్లా పర్యాటక శాఖ ఆది వారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2013 జనవరి నుం చి సెప్టెంబర్ వరకు 51,92,266 మంది పర్యాటకులు జి ల్లాను సందర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకు లు 2,27,079 మంది, విదేశీ పర్యాటకులు 608 మంది ఉ న్నారు. ఏడాది కాలంలోనే పర్యాటకుల సంఖ్య రెట్టిం పైం ది. ఈ తొమ్మిది నెలల కాలంలో మార్చిలో అత్యధికంగా 14,18,652 మంది పర్యాటకులు సందర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement