-
‘మా ఆయన అలా చేస్తాడనుకోలేదు’
లండన్: తన భర్త ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని బ్రిటన్ పార్లమెంట్ పై దాడికి ప్రయత్నించి హతమైన ఉగ్రవాది ఖలీద్ మసూద్ భార్య రోహే హైదరా పేర్కొంది. మసూద్ చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని, దాడికి ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించింది. మెట్రోపాలిటన్ పోలీసుల ద్వారా యూకే ప్రెస్ అసోసియేషన్ కు ప్రతికా ప్రకటన విడుదల చేసింది. ‘ఖలీద్ చేసిన పని నాకెంతో బాధ, దిగ్భ్రాంతి కలిగించింది. అతడి చర్యను పూర్తిగా ఖండిస్తున్నాను. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెల్పుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబాన్ని ఏకాంతంగా వదిలేయాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా పిల్లల కోసం మమ్మల్ని ఒంటరిగా వదిలేయాల’ని రోహే హైదరా వేడుకుంది. బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా గత బుధవారం లండన్ లో ఖలీద్ మసూద్ జరిపిన దాడిలో పోలీసు అధికారితో సహా నలుగురు మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఖలీద్ హతమయ్యాడు. -
అతడు మా దేశంలో ఇంగ్లిష్ నేర్పాడు
లండన్: బ్రిటిష్ పార్లమెంట్పై దాడికి యత్నించిన దుండగుడు ఖలీద్ మసూద్ తమ దేశంలో కొంతకాలం ఉన్నాడని సౌదీ అరేబియా ప్రకటించింది. 2005నవంబర్ నుంచి 2006నవంబర్ వరకూ, 2008 ఏప్రిల్ నుంచి 2009 ఏప్రిల్ వరకు వర్క్వీసాపై తమ దేశంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడని తెలిపింది. 2015 మార్చిలో తిరిగి ఆరు రోజులపాటు ఇక్కడే గడిపాడని పేర్కొంది. ఖలీద్ మసూద్ అసలు పేరు ఆడ్రియన్ ఎల్మ్స్ అని బ్రిటన్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం వెల్లడించింది. హింసా ప్రవృత్తి కలిగిన అతడిపై పలు నేరారోపణలున్నాయని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం మసూద్ మితిమీరిన వేగంతో కారునడిపి పలువురి మృతికి కారణమైన ఇతడు ఓ పోలీసు అధికారిని కూడా పొడిచి చంపాడు. అనంతరం భద్రతా అధికారుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. -
ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్
లండన్: బ్రిటన్ పార్లమెంట్పై దాడికి పాల్పడిన 52 ఏళ్ల వ్యక్తి అసలు పేరు అడ్రియన్ రస్సెల్ అజావ్ అని ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఖలీద్ మసూద్గా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి మసూద్ సన్నద్ధత, ప్రేరణ, సహచరుల గురించి తెల్సుకునేందుకు ‘ఆపరేషన్ క్లాసిఫిక్’ పేరిట వందల మంది అధికారులతో కౌంటర్ టెర్రరిజం కమాండ్ విచారణను ముమ్మరం చేశారు. మసూద్కు ఎన్నోమారు పేర్లున్నా చిన్నతనంలో అతన్ని అడ్రియన్ రస్సెల్ అని పిలిచేవారు. గతంలోనూ నేరచరిత్ర ఉన్న అతను 2000లో ఓ మహిళ ముఖంపై కత్తితో దాడిచేయడంతో అతని కుటుంబాన్ని స్థానిక కోర్టు బహిష్కరిస్తూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, బ్రిటన్ పార్లమెంట్పై జరిగిన దాడిలో గాయపడిన మరో వ్యక్తి గురువారం చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మరోవైపు, ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారని, ఉగ్రదాడులపై సంఘీభావాన్ని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్వీటర్లో తెలిపింది. -
‘లండన్’ దాడి మా పనే!
-
‘లండన్’ దాడి మా పనే!
♦ ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన ♦ దుండగుడ్ని ఖాలిద్ మసూద్గా గుర్తించిన పోలీసులు ♦ దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ప్రపంచ దేశాధినేతలు లండన్: బ్రిటన్ పార్లమెంట్పై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. సంకీర్ణ దళాల దాడులకు ప్రతీకారంగానే దాడి చేశామని వెల్లడించింది. మరోవైపు బుధవారం నాటి ఉగ్రదాడితో బ్రిటన్ భయపడలేదని, యథాప్రకారం పార్లమెంట్ సమావేశమైందని, ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆ దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్పై దాడి జరిగిన 24 గంటల్లోపే గురువారం హౌస్ ఆఫ్ కామన్స్ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దుండగుడు ఇస్లామిక్ భావజాలంతో ప్రభావితమయ్యాడని, పోలీసులకు అతని వివరాలు తెలుసని, తర్వాత వెల్లడిస్తామని మే చెప్పారు. అయితే దుండగుడ్ని ఖాలిద్ మసూద్గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఉగ్రదాడికి సంబంధించి 8 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంట్పై జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు, ఒక పోలీసు అధికారి సహా ఐసిస్ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రవాద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా ఆ బెదిరింపులకు మనం భయపడలేదు. ఈ రోజు యథాప్రకారం సమావేశమయ్యాం. ఉగ్రవాదానికి మేం భయపడలేదు అన్న సందేశాన్ని మన పూర్వీకులు చెప్పారు, భవిష్యత్ తరాలు కూడా చాటి చెప్తాయి. ఎప్పటికైనా ప్రజాస్వామ్య విలువలదే పైచేయ’ని ప్రధాని మే ఉద్ఘాటించారు. పార్లమెంట్పై దాడి చేసింది బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని , హింసాత్మక కార్యక్రమాలతో సంబంధాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం పోలీసులు అతన్ని విచారించారని మే వెల్లడించారు. దుండగులు దాడికి పాల్పడతాడనే ముందస్తు నిఘా సమచారం లేదని, ఒక్కడే ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు నమ్ముతున్నారని ఆమె తెలిపారు. సంకీర్ణ సేనలకు వ్యతిరేకంగానే దాడి: ఇస్లామిక్ స్టేట్ థెరిసా మే ప్రసంగం ముగిసిన వెంటనే దాడికి తామే సూత్రధారులమంటూ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీలో ఆ వివరాల్ని వెల్లడించింది. ఐఎస్పై సంకీర్ణ దేశాల దాడులకు వ్యతిరేకంగా దాడి చేసినట్లు ప్రకటించింది. కాగా లండన్, బర్మింగ్హామ్ నగరాల్లో గురువారం పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. దాడి కోసం దుండగుడు వినియోగించిన కారును బర్మింగ్హమ్లోని సొలిహల్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. విచారణ కీలక దశలో ఉందని, ఉగ్రవాది సమాచారం ప్రస్తుతం వెల్లడించలేమని స్కాట్లాండ్ యార్డ్ తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ మార్క్ రౌలే చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడూ పోలీసులకు చెప్పాలని ఆయన కోరారు. పోలీసుల వార్షిక సెలవులు రద్దు చేసి 24 గంటలూ పహారా పెంచామన్నారు. మరోవైపు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ట్రఫాల్గర్ స్క్వేర్లో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాధినేతల సంఘీభావం: లండన్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బ్రిటన్కు భారత్ సాయంగా ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రపంచ నేతలు బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు ఫోన్ చేసి అండగా ఉంటామని చెప్పారు. దాడి సమయంలో బ్రిటన్ భద్రతా దళాలు వేగంగా స్పందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు బ్రిటన్కు అవసరమైన సాయం చేస్తామన్నారు. ఉగ్రవాదం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోందని, బ్రిటన్ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫ్రాన్స్కు తెలుసని, తాము కూడా ఉగ్ర బాధితులమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హŸలాండే అన్నారు. బ్రిటన్ ప్రజలకు జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో వారి పక్షాన ఉంటామని హామీనిచ్చారు. మరిన్ని దాడులపై నిఘా సమాచారం లేదు: మే బ్రిటన్కు ఉగ్రవాద ముప్పు ‘తీవ్ర స్థాయి’లో ఉందని దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. మరిన్ని దాడులు జరగవచ్చన్న దానిపై ఎలాంటి నిఘా సమాచారం లేనందున దాన్ని ‘అతి తీవ్రస్థాయి’కి పెంచడం లేదన్నారు. దాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘దుండగుడు వేగంగా కారు నడుపుకుంటూ వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ దాటుతున్న పాదచారులపై దూసుకెళ్లాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. అనంతరం పార్లమెంట్ వద్ద ఉన్న క్యారేజీ గేట్స్ వద్ద కారు వదిలి పోలీసు అధికారిపై పెద్ద కత్తితో దాడిచేశాడు. అదే సమయంలో మరో అధికారి ఆ దుండగుడ్ని కాల్చి చంపాడు’ అని చెప్పారు. పలుమార్లు జైలుకెళ్లిన దుండగుడు లండన్ ఉగ్రదాడికి పాల్పడిన దుండగుడ్ని ఖాలిద్ మసూద్(52)గా గుర్తించారు. బ్రిటన్లోని కెంట్లో జన్మించిన అతను గతంలో కొన్ని హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో జైలుశిక్ష అనుభవించినట్లు తెలిసింది. విధ్వంసానికి పాల్పడినందుకు 1983లో శిక్ష అనుభవించగా, కత్తి కలిగిఉన్నందుకు 2003లో విచారణ ఎదుర్కొన్నాడు. గతంలో అతనికి ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
ఇంటి ‘ఓటు’ పడింది !
వివాహిత అనుమానాస్పద మృతి?
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా
సై.. అంటే సై!
ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలి
ఓటరు సహకార కేంద్రం ఏర్పాటు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement