-
‘రాహుల్ అపాయింట్మెంట్తో రాజుకు ఏం సంబంధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపుల్లో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజుకు ప్రమేయం లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. పీసీసీ, ఎల్.ఓ.పి, ఇంచార్జి కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచించే టిక్కెట్లు కేటాయించామని తెలిపారు. వాటితో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. తమకు టికెట్ ఇవ్వకుండా రాజు అడ్డుకున్నారనే కొంతమంది వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. పార్టీ నాయకులెవరైనా తమ ఫిర్యాదులను పీసీసీ, ఏఐసీసీకి దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, పత్రికలకు ఎక్కి ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. కొప్పుల రాజు సిన్సియర్గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనకు తెలంగాణ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజు వల్లనే రాహుల్ గాంధీని కలవలేక పోతున్నామనే కొందరు నేతల ఆరోపణల్ని సైతం కుంతియా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్తో కొప్పులరాజుకు ఏం సబంధమని ప్రశ్నించారు. అది పూర్తిగా రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి చూసుకుంటారని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు పత్రికలకి ఎక్కి ఆరోపణలు చేయకుండా సమస్యలేవైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సూచించారు. -
రెండురోజులపాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు
హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీలలో సికింద్రాబాద్లోని కేజేఆర్ గార్డెన్స్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతత్వం, భావజాలంపై, అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో పాలక పక్షాలైన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై స్థానిక ప్రజాప్రతినిధులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో పురపాలక సంఘాల స్థాయిలో పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించిన తరహాలోనే ఈసారి గ్రామీణ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటిరోజున జడ్పీటీసీలు, ఎమ్పీపీలు, ఎమ్పీటీసీలు, సింగిల్ విండో ఛైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. రెండో రోజున సర్పంచ్లు, ఉప సర్పంచ్లు శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, రామచంద్ర కుంతియా తదితరులు పాల్గొంటారు. -
దళితుల్లో అభద్రత పెంచిన మోదీ : కొప్పుల రాజు
ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు సాక్షి, హైదరాబాద్: దళితులపై కాకుండా తనపై దాడి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో దళితుల్లో, మైనారిటీల్లో మరింత అభద్రత పెరిగిందని ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో కలసి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దళితులకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలను అమలు చేస్తామని, దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పలేదన్నారు. భరోసా కల్పించేవిధంగా మాట్లాడకుండా, మరింత ప్రోత్సహించే విధంగా మోదీ మాట్లాడటంతో మరింత అభద్రత, ఆందోళన పెరుగుతున్నదన్నారు. గో రక్షక్ విషయంలో చట్టంపై నమ్మకాన్ని కలిగించేలా మోదీ ఎందుకు మాట్లాడలేదని రాజు ప్రశ్నించారు. రెండేళ్లుగా మైనారిటీలపై, దళితులపై దాడులు జరుగుతున్నా నోరెందుకు విప్పలేదన్నారు. జీవో 123పై సుప్రీంకు... జీవో 123పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగు, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలపై వాస్తవ జలదృశ్యాన్ని ఈ నెల 17న ఆవిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలేమిటో ప్రజలకే వెల్లడిస్తామన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, సాయంత్రం రైతు గర్జన ఉంటాయన్నారు. -
రాహుల్ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్గా ఉన్న కొప్పుల రాజు త్వరలో రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమితులవబోతున్నారని సమాచారం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐసీసీ కార్యవర్గాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్న పార్టీ.. కొప్పుల రాజుకు ఈ పదవిని కట్టబెట్టనున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పేద, వెనకబడిన వర్గాల సంక్షేమ పథకాల రచనలో కీలక పాత్ర పోషించిన ఈయన రాహుల్కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. రాహుల్ ముఖ్య ప్రసంగాల కూర్పు నుంచి పార్టీ విధానాల రూపకల్పన వరకూ కొప్పుల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నేతగా స్వల్ప కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ఎస్సీల పాత్ర పెరగడానికి అనుగుణంగా ఆయన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. -
సంఘ సంస్కర్త, జాతి నిర్మాత
విశ్లేషణ రేపు అంబేద్కర్ వర్ధంతి 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబేద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్లమెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘటనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) సంస్కర్త, ఉదార ప్రజాతంత్ర వాది. అణగారిన వర్గా లు, ప్రత్యేకించి ఎస్సీ/ ఎస్టీల ప్రయోజనాల కోసం పాటుపడ్డ వ్యక్తిగా ప్రధానంగా చెప్పుకోవడం పరిపాటి. దీనితో మొత్తం జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు మరుగున పడ్డాయి. భారత రా జ్యాంగ నిర్మాతగా ఆయన చరిత్రలో స్థిరపడిపోయినా ఈ బహుముఖ ప్రజ్ఞాపా టవాల గురించి చర్చ నడవలేదు. 1927లో హిల్టన్ యంగ్ కమిషన్కు అంబేద్కర్ ఇచ్చిన మహాజరు ఆధారంగానే రిజర్వు బ్యాంకు విధి విధానాలు రూపుదిద్దుకున్నా యి. భారతీయ ద్రవ్యం, ఆర్థిక సమస్య లపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేద్కర్ రాసిన ‘రూపాయి సమస్యలు, పుట్టుక, పరిష్కారం’ అన్న గ్రంథంతో తీవ్రంగా ప్రభావితమైంది. 1934లో భారత రిజర్వు బ్యాంకు చట్టంవచ్చింది. 1942-46 మధ్య కాలంలో వైశ్రాయ్ మంత్రిమండలిలో ఆయన కార్మిక, నీటిపారుదల, విద్యుత్ శాఖమంత్రిగా పనిచేశారు. కేంద్ర జలవన రుల సంఘం, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు సమకూర్చ టానికి ఉద్దేశించిన కేంద్ర సాంకేతిక విద్యు త్ బోర్డుకు కూడా ఆయనే ఆద్యుడు. అంబేద్కర్ జీవితాన్ని, కృషిని అధ్య యనం చేసిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఆయన దృక్ప థం అందరికీ సమాన హక్కులు కోరు తోంది. రాజ్యాంగ పరిషత్ లో తన చివరి ప్రసంగంలో తన ఆలోచనను మరింత విఫులీకరించారు. ‘‘మనం సాధించిన రాజకీయ ప్రజా స్వామ్యాన్ని, సామాజిక ప్ర జాస్వామ్యంగా మార్చాల్సి న అవసరం ఉంది. పునాది లో సామాజిక ప్రజాస్వా మ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్య మనుగడ సాగించజా లదు’’ అన్నారు. ప్రథమ న్యాయశాఖ మంత్రిగా మహిళా హక్కులను చట్టబద్ధం చేయటానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందే మహిళా ఉద్ధరణ కోసం పని ప్రారంభించారు. లోథియన్ కమిషన్ (1932) విచారణలోనూ 1933-34లో ఏ ర్పాటైన జాయింట్ సెలెక్ట్ కమిటీ ముం దూ మహిళల హక్కుల కోసం వాదించా రు. దాని ఫలితంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తొలిసారి మహిళలకు ఓట హక్కు దక్కింది. రాజ్యాంగ ముసా యిదాలో కూడా 14-16 అధికరణాల ద్వారా మహిళలకు పౌర హక్కులు దఖలు పర్చటంతో పాటు, కన్యాశుల్కా నికి స్వస్తి చెప్పటంలో ఆయనదే ప్రధాన పాత్ర. స్వాతంత్య్రానికి ముందే మంత్రివర్గం లో చేరమని డాక్టర్ అంబేద్కర్ను నెహ్రూ ఆహ్వానించారు. ఆ నాటికి హిందూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందుం చే క్రమంలో డాక్టర్ అంబేద్కర్ హిందూ స్మృతిని ప్రతిపాదించారు. విప్లవాత్మకమైన ఈ చట్టం మహిళలకు సమాన హక్కులు కల్పించటంతో పాటు కుల పరమైన వ్యత్యాసాలకు తా వు లేకుండా చేసింది. బీఎన్ రావు కమిటీ ప్రతిపాదిం చిన ముసాయిదాను కూ లంకషంగా పరిశీలించిన ఆయన అనేక ముఖ్యమైన సవరణలతో హిందూ స్మృ తి బిల్లు ప్రతిపాదించారు. దీనితో మొదటిసారిగా వితంతువులు, కూతుళ్లు, కొడుకులతో పాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కుదారు లయ్యారు. గృహహింస లేదా భర్తలు నిర్ల క్ష్యం చేయటం కారణంగా భార్యలకు విడా కులు తీసుకునే హక్కు దక్కింది. భర్త రెం డో భార్యను పెళ్లాడటాన్ని నిషేధించింది. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ పురుషులు హిందూ చట్టం కింద వివాహమాడే అవకా శం వచ్చింది. 1949లో అప్పటికే అఖిల భారత హిందూ స్మృతి వ్యతిరేక కమిటీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పని ప్రారంభించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబే ద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్ల మెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘ టనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. బహుశా భారతదేశ చరిత్రలోనే మహిళలకు హక్కు లు కల్పించాలన్న డిమాండ్తో కేంద్రమం త్రి రాజీనామా చేయటం ఇదే తొలి సంఘటన. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజ యం సాధించిన నెహ్రూ హిందూ స్మృతి ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఒకే చట్టంగా కాక హిం దూ వివాహ చట్టం, విడాకుల చట్టం, వార సత్వ చట్టం, దత్తత చట్టం పేర్లతో వివిధ భాగాలుగా ప్రవేశపెట్టారు. వీటిని మహి ళా సభ్యులతో పాటు విఎన్ గాడ్గిల్, పం డిట్ ఖుజ్రు వంటి సభ్యులు సమర్థించారు. తరువాత సంస్కరణవాదులు, మితవా దులు అనివార్యంగా బలపర్చాల్సిన పరి స్థితి వచ్చింది. ఈ బిల్లులు 1955-56లో చట్టాల రూ పం దాల్చాయి. అనంతరం కొంత కాలా నికి డాక్టర్ అంబేద్కర్ స్వర్గస్థులయ్యారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ నెహ్రూ, ‘‘హిందూ సమాజంలోనే అన్ని రకాల అణ చివేతతో కూడిన లక్షణాలపై తిరుగుబాటు ప్రకటించిన వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు. హిందూ స్మృ తికి సంబంధించి ఆయన ప్రదర్శించిన ఆసక్తి, ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతి పాదించిన సంస్కరణల్లో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్ట రూపం తీసుకో వటం సంతోషకరం’’ అని ప్రకటించారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా భారతీయ సమాజ నిర్మాణంలో నెహ్రూ, బాబా సాహెబ్ అంబేద్కర్ల సంయుక్త కృషిని స్మరించుకోవటం ఇరువురికీ సమ ర్పించగలిగిన నివాళి. (వ్యాసకర్త ఏఐసీసీ ఎస్.సి.విభాగం అధ్యక్షులు)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement