-
మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్ఐఎమ్లు కొంత ప్రాక్టికల్గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్కు మద్దతుగా బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తలపెట్టారు. కాని కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్ఎస్తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎమ్బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్సీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎమ్సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్సీలు తీసుకువెళ్లే స్కీమ్ను చేపట్టారని ఆయన అన్నారు. కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్బీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్ సభకు రాని అంశాన్ని హరీష్రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్ఎస్లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు. ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్ జగన్మోహన్రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది. నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ కేసీఆర్ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం. తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది. – కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
కృష్ణా జలాల వివాదంపై నేటి భేటీ రద్దు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వివాదం పరి ష్కారమే అజెండాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ భేటీ ఎప్పుడన్నది తర్వాత తెలియజేస్తామని రెండు రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం సమాచారం ఇచ్చారు. హక్కులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను గత నెల 30న ఏపీ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రా ష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైంది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల సీఎస్లతో ఈనెల 6న సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ఈక్రమంలో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. -
ట్రిబ్యునల్కి పరిధి లేదు!
సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా సమ కేటాయింపులు జరిపే అధికారం తమకు లేదని కృష్ణా ట్రిబ్యునల్–2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్ మరోసారి స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడం..బేసిన్ ప్రమాణాల ప్రకారం ఏమాత్రం సమంజసమని తెలంగాణ రాష్ట్రం వాదించగా.. ఆయన పై విధంగా స్పందించారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తాము జారీ చేసిన జీవోను సమీక్షించే అధికారంసైతం కృష్ణా ట్రిబ్యునల్–2కి ఉండదని, అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి ఈ అంశం వస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్(ఐఏ)ను తోసిపుచ్చాలని కోరింది. బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 గురువారం ఢిల్లీలో ఏపీ దాఖలు చేసిన ఐఏపై విచారణ నిర్వహించగా, తెలంగాణ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ఈ మేరకు వాదనలు వినిపించారు. కేటాయించింది నికర జలాలే బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని వివరించింది. ఆ నీళ్లను ఏ ప్రాజెక్టులకైనా కేటాయించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తూ గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ గుర్తు చేసింది. దీని ఆధారంగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులు చేసుకున్నామని స్పష్టం చేసింది. మైనర్ ఇరిగేషన్లో తెలంగాణకు కేటాయించిన 89 టీఎంసీల్లో వాడుకోని 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున, నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన 80 టీఎంసీల కోటా నుంచి మరో 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. ప్రాజెక్టుకు నికర జలాలనే కేటాయించినట్టు వాదనలు వినిపించింది. గోదావరికి కృష్ణా జలాల మళ్లింపునకు ప్రతిఫలంగా వచ్చిన 80 టీఎంసీల నుంచి 30 టీఎంసీలను 2013లో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ)కి కేటాయించిందని గుర్తు చేసింది. ఎస్ఎల్బీసీకి ప్రాజెక్టుకు కేటాయించిన 30 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు తిరిగి కేటాయించినట్టు వెల్లడించింది. ఏ ప్రాజెక్టుకూ కేటాయించని జలాలను బేసిన్ లోపలి ప్రాజెక్టులకు కేటాయించాల్సి ఉంటుందని, అందుకే పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. నికర జలాలనే కేటాయించినందున ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చాలని సూచించింది. తెలంగాణ వాదనలు గురువారంతో ముగియగా, శుక్రవారం ఏపీ వాదనలు వినిపించనుంది. -
కృష్ణా డెల్డాకు తక్షణం నీరు విడుదల
హైదరాబాద్: నల్గొండ, కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం తక్షణం నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. బోర్డ్ చైర్మన్ పాండ్య అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. గత పదేళ్ల కృష్ణా జలాల విడుదలపై నివేదిక ఇవ్వాలని పాండ్య అధికారులను ఆదేశించారు. తాగునీటి జలాల విడుదల పై పది రోజుల తర్వాత మరో సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
తాగునీటిపైనా ఆంక్షలు!
తెలంగాణ ప్రభుత్వ తీరుతో జిల్లాకు తాగునీటి కష్టాలు నీటి విడుదలపై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం కొత్తగా నీరు ఇస్తున్నట్లు చర్చలు ఆరు టీఎంసీలకు బదులు నాలుగు టీఎంసీలు ఇచ్చేందుకు నిర్ణయం నాలుగు రోజుల్లో ఇస్తామని ప్రకటించిన అధికారులు విజయవాడ : నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కృష్ణా జిల్లాకు అందించే తాగునీటి విషయంలో రాద్ధాంతం మొదలైంది. గతంలో ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాలకు ఎలా ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా నీరు విడుదల చేయొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై పలు ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉంది. మంగళవారం హైదరాబాద్లో కృష్ణా వాటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు నాలుగు టీఎంసీల నీరు ఇచ్చేందుకు నిర్ణయించారు. నిజానికి జిల్లాకు ఆరు టీఎంసీల తాగునీరు వదలాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అడుగంటిన చెరువులు... జిల్లాలో 336 చెరువుల్లో చుక్క నీరు లేదు. చెరువులు పూర్తిగా ఎండాయి. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో తాగునీరు చెరువులకు చేరకుంటే మట్టినీరే గతవుతుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురు కాలేదు. తాగునీటి విషయాన్ని ఉన్నతాధికారులే గమనించి విడుదల చేసేవారు. ఈ సంవత్సరం రాష్ట్రం విడిపోవడంతో ముందుగానే అధికారులు తాగునీటి విషయాన్ని మాట్లాడారు. తెలంగాణ వారు స్పందించిన తీరు వేరుగా ఉండటంతో కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా నీటిబోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ప్రధానంగా కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా తాగునీరు అందించాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోనూ చెరువులు ఎండిపోయాయి. ఆరు టీఎంసీలు నీరు ఇస్తే అందులో రెండు గుంటూరు జిల్లాకు, నాలుగు కృష్ణా జిల్లాకు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కానీ ఇందులో నాగార్జున సాగర్ నుంచి నీరు ఇక్కడికి చేరేటప్పటికి రెండు జిల్లాలకూ కలిపి కనీసం ఒక టీఎంసీ నీరు ఇంకిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాకు సుమారు 3.25 టీఎంసీలు మాత్రమే చేరే అవకాశముంటుంది. బోర్లలోనూ ఉప్పునీరే వస్తోంది... కృష్ణా జిల్లాలో 26 లక్షల మంది తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీర్చాల్సి ఉంది. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లో ప్రస్తుతం బోర్లలో నీరు లోతుకు పోవడంతో ఉప్పునీరు మాత్రమే వస్తోంది. 20 అడుగుల లోతులో ప్రస్తుతం తీర ప్రాంతంలో నీరు ఉంది. ఎనిమిది అడుగుల లోతులో నీరు ఉంటే ఉప్పు లేకుండా ఉంది. అలా కాకుండా లోతుకు నీరు వె ళ్లడం వల్ల తాగునీటి పరిస్థితి దారుణంగా తయారైంది. మరో పదిరోజులు ఆగాల్సిందే... నాలుగు రోజుల్లో తాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. నిజానికి సాగర్ కాలువల నుంచి నీరు కృష్ణా జిల్లాకు చేరుకోవాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. పైగా ప్రస్తుతం కాలువల్లో మురుగునీరు పేరుకుపోయి ఉంది. ఈ మురుగంతా కొట్టుకుపోవాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంటే పది రోజుల తరువాత తాగునీరు చెరువులకు చేరే అవకాశముంటుంది. తాగునీటి విషయంలోనే ఇన్ని ఆంక్షలు పెడితే రానున్న రోజుల్లో సాగునీటి విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మరెన్ని గొడవలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులకు సమాచారం లేదు... జిల్లా ఇరిగేషన్ అధికారులకు ఇంతవరకు దీనిపై ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయమై కృష్ణా జిల్లా ఎస్ఈని అడిగితే తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ఒంగోలులో ఉన్న ఇరిగేషన్ సీఈ హైదరాబాద్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారని, ఆయన చెప్పిన మాటలను బట్టి కృష్ణా జిల్లాకు నాలుగు రోజుల్లో తాగునీరు వస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ నీటిని వాడుకుంటే తర్వాత మరోసారి తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ సీపీ ముందే చెప్పింది - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తాగునీటి ఇబ్బందులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పింది. కృష్ణాడెల్టాకు కృష్ణా జలాల వినియోగంపై ప్రథమ హక్కు ఉంది. ఓ వైపు తెలంగాణకు తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లిస్తున్నారు. మరోవైపు కృష్ణాడెల్టా ప్రాంతానికి నీరిచ్చేందుకు కేంద్ర జల వనరుల సంఘం అధ్యక్షుడు వచ్చి చర్చలు జరిపితేనే అంగీకరించారు. ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో డెల్టా ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయాలని ప్రకాశం బ్యారేజీపై అనేక ఉద్యమాలు చేశారు. తాగునీటికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే సాగునీటి విడుదలపై ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో.. మంత్రి ఏం చేస్తారో.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement