-
కేసీఆర్కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్కు కూడా చాంబర్ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్లోని ప్రతిపక్ష నేత చాంబర్ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్లోగా ప్రతిపక్ష నేత చాంబర్ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారమే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్పూర్ డిక్లరేషన్కు కట్టుబడి ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధనను పాటిస్తూ ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు సమాచారం. ఖర్గే రాజీనామాతో రాజ్యసభ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్లలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ శుక్రవారంతో(సెప్టెంబర్ 30) ముగిసింది. ఖర్గేతో పాటు శశిథరూర్, ఆర్ఎన్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. థరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా 25ఏళ్ల తర్వాత కాంగ్రెస్ చీఫ్గా ఓ దక్షిణాది నాయకుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి చివరిసారి 1994లో పీవీ నరసింహారావు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. గాంధీ కుటుంబం విధేయుడు కావడం, సుదీర్ఘ అనుభవం, దళిత నేత వంటి కారణాలు ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్ సహా కాంగ్రెస్ జీ-23నేతలు కూడా ఖర్గేకే మద్దతు తెలిపారు. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. చదవండి: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ -
హిమ దాస్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గోల్డ్మెడల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హిమదాస్కు వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తే.. వారు అద్భుతంగా రాణించి.. దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించి పెడతారని ఆయన శనివారం టిటర్లో పేర్కొన్నారు. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్తో హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. Congratulations @HimaDas8 on becoming the first ever Indian girl to win gold in world U20 athletics. AP has such potential in abundance. Provided world-class sports facilities, these athletes can perform their best and bring many more accolades to India. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2018 -
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
ప్రతిపక్షనేతగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా డీఎంకే కోశాధికారి, కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్ ఎన్నికయ్యారు. పలువులు ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షులు కరుణానిధి అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాలతో అన్నాడీఎంకే అధికారాన్ని చేపట్టగా, డీఎంకే 89 సీట్లను గెలుపొంది అధికార పార్టీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కరుణానిధి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్, సహాయ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, జీ పెరియస్వామి, అన్ని జిల్లాల కార్యదర్శులు హాజరైనారు. అలాగే కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా స్టాలిన్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కరుణానిధి ప్రకటించారు. ప్రతిపక్ష సహాయ నేతగా దురైమురుగన్, చీఫ్ విప్గా చక్రపాణి, విప్గా పిచ్చాండి సైతం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కేంద్రం కుట్ర వల్లనే డీఎంకే ఓటమి: కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే తమ పార్టీ ఓటమి పాలైందని డీఎంకే కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా ఆరోపించింది. ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే జయలలితను ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తున్నట్లుగా టీవీల్లో వార్త ప్రసారం కావడాన్ని ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం కుమ్మక్కుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి లెక్కింపు పూర్తయ్యేవరకు ఎన్నికల కమిషన్ చర్యలు అన్నాడీఎంకేకు అనుకూలంగా, పక్షపాతంగానే కొనసాగాయి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీల్లో పట్టుబడిన రూ.570 కోట్లపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉండగా, వాటిని లెక్కచేయకుండా బ్యాంకు సొమ్ముగా తేల్చేయడం వెనుక కేంద్రం అండ ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే రూ.570కోట్లపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే డిమాండ్ చేసింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన నేతలు చేసిన 20 తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి. గ డచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 4 కోట్ల 32 లక్షలా 62వేల 906 ఓట్లను పొందడం ద్వారా 39.7 ఓట్లను సాధించింది. గత 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఒక కోటి 35లక్షల 13వేల 816 ఓట్లను పొందింది. గత ఎన్నికల ఓట్లతో పోల్చుకుంటే ప్రజల్లో డీఎంకే పట్ల అపారమైన నమ్మకం పెరిగింది. 1957 నుండి 2016 వరకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అంతేగాక ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీని సాధించారు. నమక్కునామే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి లక్షలాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న స్టాలిన్కు అభినందనలు. వైద్యకోర్సుకు ప్రవేశపరీక్షలు ఈ ఏడాది మాత్రమే కాదు ఇక ఎప్పటికీ ఉండబోవని వెంటనే ప్రకటించాలి. ఏపీలో 20 మంది తమిళులను ఎన్కౌంటర్ చేయడంపై సాగుతున్న కేసు విచారణ, అన్నాడీఎంకే నేత అన్బునాథన్ ఫాంహౌస్లో భారీ ఎత్తున నగదు దొరకడంపై సీబీఐ విచారణ జరిపించాలని తీర్మానాలు చేశారు. ఓటమికి కరుణే కారణం: సుబ్రమణ్యస్వామి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఆ పార్టీ అధ్యక్షులు కరుణానిధే కారణమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. స్టాలిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని అన్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడినా అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. కరుణానిధి ఇక నైనా రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement