-
పైత్యం నశాలానికి.. పసిబిడ్డకు తిండి కరువు.. 18 నెలల వయసులోనే..
వాషింగ్టన్: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే. అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చదవండి: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత -
బిడ్డను బావిలో తోసి హత్య.. తల్లికి యావజ్జీవం
తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03). రెండవ కుమారుడు అఖిల్ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది. చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్కుమార్యాదవ్ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్కుమార్పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
గుత్తి : భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు వి«ధిస్తూ గుత్తి ఏడీజే వెంకటరమణారెడ్డి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్కు చెందిన సంతోష్కుమార్, బాను ప్రేమించుకొని 2008, డిసెంబర్ 31న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో బాను తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. 2015, మే, 11న ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రేకంతో సంతోష్కుమార్ భార్య గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు, హత్యానేరం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు బుధవారం తుది విచారణ జరిగింది. హత్యానేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదుతోపాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎంవీ మహేష్కుమార్ వాదించారు. -
హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
ఇచ్ఛాపురం రూరల్: ఎనిమిదేళ్ల క్రితం తల్లీకొడుకులను హత్య చేసిన ఘటనలో ఇచ్ఛాపురానికి చెందిన ఇద్దరు నిందితులకు మంగళవారం సోంపేట ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జీవితకాల కారాగార శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొల్లవీధికి చెందిన డి.బలరాంరెడ్డి, సి.హెచ్.గోపి 2008 ఆగస్టు 8 రాత్రి కేశవ జ్యూయలర్ యజమాని వెచ్ఛా కేశవరావు ఇంట్లో లేని సమయంలో భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్కుమార్ను ఇనుప రాడ్తో మోది హత్య చేసి బంగారాన్ని దోచుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకొని చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువైనందున జీవితకాల ఖైదు, పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమాన విధించారు. జరిమాన కట్టకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. 450 ఐపీసీ సెక్షన్ కింద పది సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష విధించగా, 397 సెక్షన్ కింద∙ఏడు సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ జడ్జి ఎం.భవిత తీర్పు చెప్పినట్టు తెలిపారు. ఈ మూడు సెక్షన్లు ఏకకాలంలో అమలు జరగుతాయని తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement