-
లైపోసక్షన్ వికటించి స్టార్ సింగర్ కన్నుమూత, విషాదంలో ఫ్యాన్స్
బ్రెజిలియన్ పాప్ స్టార్ డానీ లీ (42) మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. లైపోసక్షన్ మెట్రో కథనం రిపోర్ట్ ప్రకారం బ్రెజిల్లో గాయనిగా పాపులర్ అయిన లీ బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ తరువాత సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రలో కన్నుమూసింది. ఇది ఊహించని పరిణామమంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు తమ అభిమాన స్టార్ సింగర్ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్ కూడా దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. బ్రెజిల్లోని పిన్హైస్లో నిర్వహించిన బొడ్డు, వీపుపై లైపోసక్షన్తో పాటు రొమ్ములను తగ్గించుకునేందు కూడా ఆపరేషన్ చేయించుకుంది. అయితే పరిస్థితి విషమించడంతో సమీపంలోని మీపంలోని కురిటిబాలోని ఒక ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. లీకి భర్త, ఏడేళ్ల కుమార్తె ఉంది. గాయని మృతిపై విచారణ జరుగుతోందని మెట్రో నివేదించింది. అమెజాన్లోని అఫువా అనే ద్వీపంలో పుట్టిన లీ సింగర్అయ్యేందుకు చిన్నతనం నుంచీ కృషి చేసింది. 2014లో విడుదలైన ఆమె 'యూ సౌ డా అమెజోనియా' (ఐ యామ్ ఫ్రమ్ ది అమెజాన్) అనే పాటతో గాయనిగా ఆమె ప్రసిద్ధి చెందింది. అయిదేళ్ల వయసునుంచే పాడటం ప్రారంభించిన ఆమె టాలెంట్ షోలతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సింగింగ్ కరియర్ కోసం 17 సంవత్సరాల వయస్సులో మకాపాకు వెళ్లింది. 'వెమ్ మీ డైజర్', 'ప్రా వోస్ ఫికార్ కోమిగో' 'కైక్' తదితర పాటలో స్టార్ సింగర్గా ఎదిగింది. ఆమె చివరి పాట ‘గుయెర్రా డి అమోర్' జనవరి 14న విడుదలైంది.డాని లి, అసలు పేరు, డానియెల్ ఫోన్సెకా మచాడో. View this post on Instagram A post shared by Dani Li (@danili.dl) -
కత్తిగాటు లేకుండా..రక్తపు చుక్క కారకుండా
సాక్షి, హైదరాబాద్: పొట్టపై కత్తిగాటు లేకుండా... రక్తం చిందించకుండా.. కనీసం నొప్పి కూడా తెలియకుండా బరువు తగ్గించే ప్రక్రియను కేర్ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కొవ్వు కరిగింపు చర్యలో భాగంగా బెరియాట్రిక్ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్కు బదులు.. తాజాగా రోబోటిక్ ఎండోస్కోపిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తొలిరోజే ముగ్గురు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయడం విశేషం. ఈ మేరకు శుక్రవారం హోటల్ గోల్కొండలో ఈ అంశంపై ప్రముఖ రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ బండారి, కేర్ ఫెసిలిటీ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్ ఖాన్లు విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆ రెండు చికిత్సలకు భిన్నంగా.. బరువు తగ్గించే చికిత్సలు రెండు రకాలు. ఒకటి లైఫోసక్షన్. దీనిలో సూదుల ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును బయటికి లాగేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడినది. రెండోది బెరియాట్రిక్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో పొట్టపై మూడు నుంచి నాలుగు చిన్నపాటి రంధ్రాలు చేసి(కీ– హోల్)బెలూన్ తో పెద్దపేగు సైజును తగ్గించే పద్ధతి. ఈ రెండు చికిత్సలూ ప్రమాదకరమైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స అవసరం లేని ‘ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లా స్టీ’అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ల్లో మాత్రమే ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బెరియాట్రిక్, లైఫో సక్షన్కు భిన్నంగా ఈ ఎండోస్కోపిక్ పద్ధతి లో చేస్తారు. అత్యాధునిక కెమెరాతో తయారు చేసిన రోబోటిక్ ఎండోస్కోపిని నోటి ద్వారా పొట్టలోకి పంపించి, పెద్ద పేగు సైజు ను తగ్గించి కుట్లు వేసే ప్రక్రియే ఈ చికిత్స. పొట్ట సైజును 1/4 శాతం తగ్గిస్తారు. తక్కువ ఆహారానికే కడుపు నిండిపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోలేక పోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంది. ఇలా 25 నుంచి 30 కేజీల వరకు తగ్గుతారు. ఈ తరహా చికిత్సలో కత్తిగాటు లేకపోవడమే కా దు..కనీసం నొప్పి కూడా తెలియదు. ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గింపునకిది శాశ్వత పరిష్కారంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ ఆయనే దేశంలో రోబోటిక్ బెరియాట్రిక్ సర్జరీలు నిర్వహించిన తొలి వైద్యుడు డాక్టర్ మోహిత్ బండారే. ఆయన ఇప్పటి వరకు 11 వేలకు పైగా కొవ్వు కరిగింపు చికిత్సలు చేశారు. కేవలం 11 గంటల్లో 25 చికిత్సలు చేసి, లిమ్కాబుక్లో చోటు సంపాదించారు. 2012లో 350 కేజీల బరువు ఉన్న ఆసియా మహిళకు ఆయన చికిత్స చేశారు. 2013లో ఆరేళ్ల బాలునికి బెరియాట్రిక్ నిర్వహించి ఖ్యాతి గాంచారు. -
లావు తగ్గే ఆపరేషన్కు ఆర్తి అగర్వాల్ బలి
* గుండెపోటుతో అమెరికాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూత * లైపోసక్షన్ ఆపరేషన్ వికటించడం వల్లే మరణించినట్టు అనుమానాలు * కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు న్యూజెర్సీ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్(31) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆర్తి శనివారం అమెరికా న్యూ జెర్సీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. ఆర్తి కొద్దిరోజుల క్రితం లైపోసక్షన్ ఆపరేషన్ (లావు తగ్గే శస్త్ర చికిత్స) చేయించుకున్నారని, అయితే ఆ ఆపరేషన్ వికటించడం వల్లే ఆమె గుం డెపోటుకు గురై మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నువ్వు నాకు నచ్చావ్తో.. 1984 మార్చి 5న న్యూజెర్సీలో అమెరికాలో స్థిరపడిన గుజరాతీ కుటుంబంలో ఆర్తి అగర్వాల్ జన్మించారు. 2001లో సినీ రంగప్రవేశం చేశారు. హిందీ చిత్రం పాగల్పన్లో ఆమె తొలిసారి వెండితెరపై కనిపించారు. అదే ఏడాది ప్రముఖ హీరో వెంకటేష్తో కలసి నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ చిత్రం సూపర్హిట్ కావడంతో ఆర్తికి అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్బాబు, తరుణ్, ఉదయ్కిరణ్, రవితేజ, సునీల్ తదితరుల సరసన నటించారు. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, ఇంద్ర, నీ స్నేహం, వసంతం, సంక్రాంతి, నేనున్నాను తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. అతి తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ సమయంలోనే వ్యక్తిగత కారణాలతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కోలుకుని 2006లో సునీల్ కథానాయకుడిగా వచ్చిన అందాల రాముడు చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్తి సుమారు 25 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి సినిమా రణం-2 ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్తి సోదరి అదితి కూడా అల్లు అర్జున్ సరసన గంగోత్రి సినిమాలో నటించింది. ఎన్నో ఎత్తుపల్లాలు..: 2005లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2007 నవంబర్ 21న ఎన్ఆర్ఐ ఉజ్వల్ కుమార్ను ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకుంది. తెలుగు సినిమాల్లో మంచిస్థాయిలో ఉన్న ఆర్తి.. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. కొద్దిరోజులు అమెరికాలో కాపురం చేసిన తర్వాత ఆమె చిత్ర సీమలోకి పునరాగమనం చేశారు. అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సునీల్ సరసన అందాల రాముడులో కథానాయికగా తెరపై కనిిపించారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో బరువు పెరిగిన ఆర్తికి అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అమెరికాలో స్థూలకాయం, శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆర్తి మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘విన్నర్’ మలుపుతిప్పి ఉండేది తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ న్యూజెర్సీ అమ్మాయిపై తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి కూడా పడింది. దీంతో ‘బంపరకన్నాలే’ చిత్రంతో ఆర్తి తమిళ సినీరంగ ప్రవేశం చేశారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో దర్శకుడు సుందర్ సి తన చిత్రం ‘విన్నర్’లో ఆర్తిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం నుంచి ఆర్తి అనివార్య కారణాల వల్ల వైదొలిగారు. ఒకవేళ ఆర్తి ‘విన్నర్’లో నటించి ఉంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమె మంచి స్థాయికి అందుకునేవారేమో.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement