-
నా ప్రాణం పోయినా సరే నువ్వు బతకాలి
ముత్తారం(మంథని): ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. గతంలో అనారోగ్యంతో తల్లి మరణిం చింది. ఇప్పుడు ఇంటి ఆడబిడ్డఅయిన కన్నూరి శిరీష(20) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడగా... వైద్యుల సూచనల మేరకు తన సోదరుడు కాలేయాన్ని దానం ఇచ్చాడు. తన సోదరి బతుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే 20 రోజులు చికిత్స పొందిన యువతి మంగళవారం ఊపిరి వదిలింది. ఈ ఘటనతో కుటుంబంలో వి షాదం అలుము కుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కన్నూరి బాబు, శైలజ దంపతులకు నలుగురు సంతానం. వీఆర్ఏగా పనిచేసిన బాబు ఇటీవలే వీఆర్వోగా పదోన్నపతి పొందాడు. నాలుగేళ్ల క్రితం పెద్దకూతురు వివాహం చేసి అప్పులు పాలయ్యాడు. అం తలోనే భార్య శైలజ అనారోగ్యంతో చనిపోయింది. రెండో కూతురైన శిరీషకు కడుపునొప్పి రావడ ంతో హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. కాలే యం కొనే స్థోమత లేకపోవడంతో శిరీష సోద రుడు రవితేజ కాలేయదానానికి ముందుకొచ్చా డు. గతనెల 17న ఆపరేషన్ నిర్వహించి రవితేజ కాలేయాన్ని శిరీషకు అమర్చారు. 20రోజుల పాటు జీవించి ఈనెల 6న చికిత్స పొందుతూ చనిపోయి ంది. ‘తన ప్రాణం ఏమైన మంచిదే కానీ నీవు బతకాలని.. కాలేయదానం చేసినా నిన్ను కాపాడుకోలేకపోయామని’ శిరీష సోదరుడు రవితేజ, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కిమ్స్లో కాలేయ మార్పిడి
మంగళగిరి నుంచి శంషాబాద్కు విమానంలో తరలింపు పోలీసుల సహకారంతో రోడ్డు బ్లాక్ చేసి కిమ్స్కు చేరిక హైదరాబాద్: కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి నగరానికి చెందిన కిమ్స్ వైద్యబృందం విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసింది. కాలేయ మార్పిడి 6 నుంచి 8 గంటల్లోపే చేయాల్సి ఉన్నందున కిమ్స్ వైద్యులు అవయవదాత నుంచి సేకరించిన కాలేయాన్ని విజయవాడ నుంచి విమానంలో తీసుకొచ్చి.. నగరంలో పోలీసుల సాయంతో రోడ్లపై ట్రాఫిక్ ఆపివేసి ఆసుపత్రికి తెచ్చి సకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనమ్మ(54)ను వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. జీవన్దాన్ సిబ్బంది అవయవదానంపై బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అందుకు అంగీకరించారు. వెంటనే కిమ్స్ వైద్యులు విజయవాడ చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు దాత శరీరం నుంచి కాలేయాన్ని సేకరించి ప్రత్యేక బాక్స్లో భద్రపరిచారు. ఆలస్యం చేయకుండా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం 5.30కు బయలు దేరిన విమానం 6.20కి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో గ్రీన్చానల్ ద్వారా రాత్రి 7.10 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కిమ్స్లో చికిత్స పొందుతున్న 43 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ థియేటర్లో ఛాతీ భాగాన్ని తెరిచి ఉంచారు. డాక్టర్ ఎంబీవీ ప్రసాద్ నేతృత్వంలోని వైద్యబృందం బాధితునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement