-
దోపిడీదార్ల భరతం పడతా
బందిపోటు మంచివాడిగా మారి ఒకప్పుడు అసహ్యించుకున్న ప్రజల చేతే పూజలు చేయించుకునే ఇతివృత్తంతో అనేక సినిమాలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్లోని ధౌరహ్రా లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్కన్ సింగ్ రాజ్పుత్ కథ కూడా అలాంటిదే . దోపిడీ దొంగలు, హంతకులకు ఆలవాలమైన మధ్య ప్రదేశ్లోని చంబల్లోయ పేరు వింటేనే అప్పట్లో ప్రజలు గడగడ వణికిపోయే వారు. అలాంటి చంబల్ లోయకే నాయకుడైన మల్కన్ 70వ దశకంలో ప్రజలనే కాక ప్రభుత్వాలకు కూడా నిద్ర పట్టకుండా చేశాడు.అనేక హత్యలు, దోపిడీలు చేసిన మల్కన్ను పట్టిచ్చిన వారికి ప్రభుత్వం 70 వేల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అయితే, మల్కన్ను పట్టించడానికి కాదు కదా ఆయన ఆచూకీ చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆయనంతట ఆయనే అనుచరులతో సహా లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.ఆనాటి దోపిడీ దొంగ ఇప్పుడు సమాజంలో ఉండే దోపిడీగాళ్ల భరతం పట్టడానికి ఎన్నికల బరిలో దిగానని చెబుతున్నారు. బుర్ర మీసాలు, గిరజాల జట్టుతో,అమెరికా తయారీ తుపాకీని భుజాన వేసుకుని 76 ఏళ్ల వయసులో కూడా బలిష్టంగా ఉన్న ఆరడుగుల ఈ మాజీ దొంగ దోపిడీల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. తననెవరైనా బందిపోటు అంటే మండిపడే మల్కన్ తనను తాను తిరుగుబాటు దారుడిగా చెప్పుకుంటారు.‘నేను బందిపోటును కాను.ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మ రక్షణ కోసం తుపాకీ పట్టే తిరుగుబాటుదారుడిని. నిజమైన దోపిడీ దొంగలెవరో నాకు తెలుసు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా బాగా తెలుసు.’అంటున్నారు మల్కన్. బందిపోటు అయిన మీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే ‘ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడానికి వీల్లేదు. అలా నేను చూస్తాను. నన్ను ఎన్నుకుంటేనే వాళ్లకి ఆ మంచి జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. పేదలు, మహిళలపై అత్యాచారాలు చేసే వారికి, వాళ్లకు అన్యాయం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతానని మల్కన్ చెబుతున్నారు.15 ఏళ్ల పాటు చంబల్ లోయను ఏలిన తాను లోయలో కుల మత ప్రసక్తి లేకుండా అందరి బాగోగులు చూశానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని అంటున్నారు. ఇక్కడి వాతావరణం నాకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మా పార్టీ కూడా బలంగా ఉంది. నియోజకవర్గంలో వెళ్లినచోటల్లా నాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాబట్టి కచ్చితంగా గెలుస్తాను’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 17 ఏళ్లకే మల్కన్ను(1964) పోలీసులు ఆయుధ చట్టం కింద అరెస్టు చేశారు.మల్కన్ ముఠా అంటే చంబల్ లోయలో అందరికీ హడల్. ఆ ముఠా పై 94 కేసులుండేవి. వాటిలో 18 దోపిడీలు, 28 కిడ్నాప్లు, 17 హత్యలు ఉన్నాయి. పలు దఫాల చర్చల తర్వాత 1982లో అప్పటి మధ్య ప్రదేశ్ సీఎం అర్జున్ సింగ్ సమక్షంలో మల్కన్ లొంగిపోయారు. శివపురిలో స్థిరపడ్డారు. ఇప్పటికీ చాలా మంది మల్కన్ను రాబిన్హుడ్గా అభిమానిస్తుంటారు. 2009లో మల్కన్ ధౌరహ్రా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జితిన్ ప్రసాద్ తరఫున ప్రచారం చేసి ఆయన గెలుపునకు దోహదపడ్డారు. ఈ సారి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందుకే జ్యోతిరాదిత్య సింధియా, రాజ్ బబ్బర్లను కలుసుకున్నానని చెప్పారు. అయితే, వారు టికెట్ ఇవ్వకపోవడంతో ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ నియోజకవర్గంలో మే 6వ తేదీన పోలింగు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి జితిన్ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ, బీఎస్పీ అభ్యర్థి అర్షద్ ఇలియాస్ సిద్ధిఖిలతో మల్కన్ తలపడుతున్నారు. -
బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...
-
బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...
మల్ఖన్ సింగ్... ఈ పేరు చెబితేనే గ్వాలియర్ పరిసర ప్రాంత వాసులు వణికిపోయేవారు. అంత పేరుమోసిన గజదొంగ అతడు. అలాంటి గజదొంగ.. బ్యాంకుకు వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా అతడి తుపాకి భుజాన వేలాడుతూనే ఉంది. మెడలో సెల్ఫోన్ కూడా దండలా వేసుకున్నాడు. బట్టతల, బుర్రమీసాలతో ఉన్న మల్ఖన్ సింగ్ను చూసేసరికి బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వినియోగదారులు కూడా ఒక్కసారి భయపడ్డారు. తీరా.. అతడు ఎందుకు వచ్చాడా అని చూస్తే, తన దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకోడానికి వచ్చినట్లు తెలిసింది. 1970-80 ప్రాంతాలలో అతడు పేరుమోసిన గజదొంగ. అతడి మీద, అతడి ముఠా సభ్యుల మీద కలిపి దాదాపు 94 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 18 దోపిడీ, 28 కిడ్నాపులు, 19 హత్యాయత్నాలు, 17 హత్యకేసులు కూడా ఉన్నాయి. చంబల్ పరిసర ప్రాంతాల్లో అతడి పేరు చెబితే మంచినీళ్లు తాగడానికి కూడా భయపడేవారు. ఆ తర్వాత.. 1983 సంవత్సరంలో అతడు తన వాళ్లతో కలిసి నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. 1976 ప్రాంతంలో మల్ఖన్ సింగ్కు, నాటి బిలావో గ్రామ సర్పంచి కైలాష్ నారాయణ్కు పెద్ద గొడవ జరగడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. నారాయణ్ను మిషన్గన్తో కాల్చి చంపడానికి ప్రయత్నించి, చివరకు అతడి అనుచరులిద్దరిని గాయపరిచి, ఒకరిని చంపేశాడు. నారాయణ్కు కూడా ఆరు బుల్లెట్లు తగిలినా, ప్రాణాలు మాత్రం నిలబడ్డాయి. ఆ ఘటన తర్వాత కొన్నాళ్లపాటు మల్ఖన్ సింగ్ యూపీలోని జలౌన్ ప్రాంతానికి పారిపోయాడు. అప్పటినుంచి యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు బుందేల్ఖండ్ ప్రాంతంలో అతడిపేరు మార్మోగిపోయింది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు ముఖేష్ ఆర్ చౌక్సే మల్ఖన్ సింగ్ మీద ఒక సినిమా కూడా తీశాడు. లొంగిపోయిన తర్వాత తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, తరచు ఆధ్యాత్మిక సభలలో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటికీ తన ఆత్మరక్షణ కోసం మాత్రం తుపాకి వెంట తీసుకునే వెళ్తుంటాడు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
Advertisement