-
పంట చేలో పాల కంకి పల్లకిలో పిల్ల ఎంకి నవ్వినంత అందంగా...
చీర గురించి ఎన్ని పాటలు రాసినా రాయాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి. అందమైన చీరకట్టును చూస్తే పంటచేలో పాలకంకి, పల్లకిలో పిల్ల ఎంకీ నవ్వినంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు వినూత్నంగా డిజైన్ చేసిన చీరల ఛాయాచిత్రాలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కేరళ కసువు శారీ (వైట్ కాటన్ శారీ విత్ గోల్డెన్ జరి బార్డర్) రకరకాల వేడుకలకు క్లాసిక్ ఫేవరేట్గా పేరు పొందింది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు ఈ చీరకు సంబంధించి పురాతన టెక్నిక్లను మాన్యువల్ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. ప్రతి ప్రింట్ ఒక అందమైన కథ చెబుతుంది. అరటిఆకుల నుంచి ఇంగ్లీజ్ రోజ్, చెంబూర్ ఫ్లవర్ వరకు ప్రకృతిలోని ఎన్నో అందాలు కసువు చీరెలో కనిపించి కనువిందు చేస్తాయి. -
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..?
చేతులతో మలం ఎత్తే పనులు(Manual Scavenging)పై 10 ఏళ్ల క్రితమే నిషేధం విధించినప్పటికీ నేటికీ ఈ పనులను చాలామంది చేస్తూనే ఉన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్ట్యాంకులు క్లీన్ చేసే నేపధ్యంలో ప్రతీయేటా చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. గడచిన ఐదేళ్లలో దేశంలో మ్తొతం 339 మంది కార్మికులు మృతిచెందారు. మురుగు కాలువలు శుభ్రంచేసే సమయంలో నేఫ్టీ డివైజెస్ ఉపయోగిస్తూ, పనులలోకి దిగాలనే అంశంపై చట్టం చేసినప్పటికీ, ఇటువంటి మరణాలు ఆగడం లేదు. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనం ఇదే.. 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చేతులతో మాలాన్ని ఎత్తే పనులపై ఎంప్లాయిమెంట్ ప్రొహిబిషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో దాని నిర్వచనాన్ని కూడా తెలియజేసింది. ఆ నిర్వచనం ప్రకారం ‘మాన్యువల్ స్కావెంజింగ్ పని చేయడానికి, మురికిని తీసి, శుభ్రం చేయడానికి, బహిరంగ కాలువలు లేదా గుంతలను శుభ్రం చేయడానికి, మానవ విసర్జనను సేకరించడానికి స్థానిక అధికారాన్ని పొందిన వ్యక్తిని ‘మాన్యువల్ స్కావెంజర్’ అని అంటారు. ఈ వ్యాధుల బారిన పడుతూ.. భారతదేశంలోని దశాబ్దాల నాటి కుల వ్యవస్థ కారణంగా ఇటువంటి పనులను కుల వ్యవస్థలోని అట్టడుగున ఉన్న వర్గాలవారే చేస్తూ వస్తున్నారు. మానవ మలమూత్రాలను చేతితో శుభ్రం చేయడం, వాటిని దూరంగా ఎక్కడికైనా విసిరేయడం వల్ల ఇలాంటి క్లీనింగ్ కార్మికులు కలరా, హెపటైటిస్, టీబీ, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ 339 మంది మరణించారు. 2022లో 66 మంది, 2023లో 9 మంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. చట్టంలో ఏముంది? మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని నిర్మూలించేందుకు 1993లో భారతదేశంలో మొదటిసారిగా చట్టాన్ని ఆమోదించారు. 2013లో మరోసారి దీనికి సవరణ చేశారు. మొదటిసారిగా రూపొందించిన చట్టంలో డ్రై లెట్రిన్లలో పనిచేయడాన్ని నిషేధించారు. 2013లో తీసుకొచ్చిన చట్టంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనాన్ని తెలియజేశారు. సెప్టిక్ ట్యాంక్లను మాన్యువల్గా శుభ్రపరచడంతో పాటు రైల్వే ట్రాక్లను శుభ్రపరచడం కూడా ఈ చట్టంలో చేర్చారు. రూ.10 లక్షల నష్టపరిహారం 2014, మార్చి 27న మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యపై సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించింది. మురుగునీటి క్లీనర్ల సమస్యను కూడా ఈ చట్టంలో చేర్చింది. ఎందుకంటే మురుగునీటి క్లీనర్లు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా మురుగు కాలువలను శుభ్రపరిచేటప్పుడు మానవ విసర్జనను కూడా వారు శుభ్రం చేయాల్సివస్తుంది. మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధన విధించింది. అయితే ఈ విధమైన నష్టపరిహారం, పునరావాసం కోసం ఎన్నో ఏళ్లుగా బాధిత కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిరావడం శోచనీయం. ఇది కూడా చదవండి: 76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే -
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ను విడుదల చేసింది. ఎక్స్షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్తో కూడిన హెడ్ల్యాంప్స్ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
ఆరుకోట్లకు అమ్ముడుపోయిన అటోగ్రాఫ్! ఎవరిదంటే..
Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ను ఓ పాథ్ మేకర్గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్ మ్యానువల్.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. 1977లో యాపిల్ II కంప్యూటర్ రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్.. పర్సనల్ కంప్యూటింగ్లో, కంప్యూటర్ల బిజినెస్లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్కు చెందిన మ్యానువల్పై స్టీవ్ జాబ్స్, యాపిల్ సెకండ్ సీఈవో మైక్ మర్క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్ మైక్ బ్రివర్(తర్వాత యూకే యాపిల్ కంప్యూటర్కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్.. మీ జనరేషన్ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్ జాబ్స్ చేత్తో రాసిన రాత కూడా ఉంది. మైక్తో స్టీవ్ జాబ్స్ బోస్టన్కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ కంపెనీ ఈ అటోగ్రాఫ్ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్ బిడ్ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్ కోల్ట్స్కు చెందిన.. జిమ్ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్, మర్క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్. ఇక 1973లో స్టీవ్ జాబ్స్ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని.. యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది. చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement