-
ఆ దెబ్బతో రోడ్డున పడ్డాం.. నెలకు రూ.35తో కుటుంబమంతా..
ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. దివాలా తీశాం.. 'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. ఒక్క పూట భోజనం.. ఆకలి.. అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఆరోపణలతో నటుడిపై మరక! చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అమ్మ గదిలో దొంగతనం.. నా కొడకా.. అని తిట్టేది! -
దీనస్థితిలో నటుడు.. 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడన్న డాక్టర్స్!
సీనియర్ నటుడు, దర్శకుడు జూనియర్ మహ్మద్ అలియాస్ నయూమ్ సయ్యద్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. గత నవంబర్లో ఇతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగోదశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఊపిరితిత్తులు సహా ఇతర శరీర అవయవాలు పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. జూనియర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి ఆప్తమిత్రుడు సలాం కాజీ మాట్లాడుతూ.. 'నెల రోజుల కిందటే అతడికి క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. మొదట కడుపులో కణతి కనిపించింది. పరీక్షించగా క్యాన్సర్ అని తేలింది. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా అప్పుడే 20 కిలోలు తగ్గిపోయాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. నెల రోజుల్లోనే నాలుగో స్టేజీకి రావడంతో 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడని వైద్యులు చెప్పారు' అని తెలిపాడు. దీంతో ఆయనకు సాయం చేయడానికి కమెడియన్ జానీ లివర్.. ముంబైలోని మహ్మద్ ఇంటికి వెళ్లాడు. నటుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది. చికిత్సకుగానూ కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా కానీ వారి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించడంతో బలవంతంగా కొంత డబ్బును అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ మహ్మద్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టాడు. మరాఠీ భాషలో అనేక సినిమాలను తెరకెక్కించాడు, నటించాడు. దాదాపు 265 చిత్రాల్లో నటించాడు. కైటీ పతంగ్, ఆన్ మిలో సజ్నా, కారవాన్ వంటి పలు సినిమాలతో ఆయన పాపులర్ అయ్యాడు. Viral | Popular actor of yester years, Junior Mehmood has not been keeping well. Comedian Jonny liver seen here trying to lift up his spirits. pic.twitter.com/KQyErg4EBL — MUMBAI NEWS (@Mumbaikhabar9) December 1, 2023 చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్కు అదే కారణమంటూ.. -
నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!
ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒకామె.. లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. ఇప్పుడీ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పనిమనిషి కాదని, దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: 'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!) ఇంతకీ ఏం జరిగింది? మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఇంటిపనులు చూసుకోవడంతో పాటు ఇతడి తండ్రి బాగోగులని చూసుకోవడం వాళ్ల పని. కానీ ఇందులో ఉష(41) అని ఆమె మాత్రం 5-6 నెలల నుంచి పుష్కర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈమెనే.. పుష్కర్ ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షలు డబ్బులు, 60 వేల విదేశీ కరెన్సీని.. అక్టోబరు 22న దొంగతనం చేసింది. కానీ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం యజమానికి తిరిగొచ్చేసింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న.. బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది. బీరువాలో బంగారం ఉన్నా సరే దాన్ని పరిశీలించి చూడగా, అది నకిలీది అని తేలింది. పనిమనిషి ఉషనే.. రూ.10 లక్షలు విలువ చేసే బంగారంతో ఆల్రెడీ పరార్ అయిపోయినట్లు బయటపడింది. దీంతో పుష్కర్, అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడీ ఇదంతా వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. (ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో? ) మిలింద్ సఫాయ్ మరాఠీ టీవీ సీరియల్ 'ఆయ్ కుతే కే కర్తే' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఒకరోజు ముందే ఆగస్టు 24న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో సైతం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతోంది. కాగా.. సీమా గతేడాది మృతి చెందిన ప్రముఖ నటుడు రమేష్ డియో భార్య. దీంతో వరుసగా ఇద్దరు నటీనటులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!) -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement