-
ఆర్ద్రహృదయం
ఒకసారి ఒకవ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి, గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను, వస్త్రాలనూ దోచుకుని ఆ వ్యక్తిని అక్కడే పడేసి వెళ్లిపోయారు, ఆ వ్యక్తికి స్పృహ లేదు... అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు (దేవుని పని చేసేవాడు) వెళుతూ ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసి పక్కనుండి తప్పుకుని వెళ్లి పోయాడు, అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకుని వెళ్లాడే తప్ప అతనికి ఏ సహాయమూ చేయలేదు, ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా భక్తుడే, అప్పుడు అక్కడ నుండి ఒక మనిషి ఆ దారి గుండా వెళుతూ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్లి అతని మీద జాలిపడి తనవద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి, అతడిని దగ్గర్లో ఉన్న ఒక పూటకూళ్ల ఇంటికి తీసుకెళ్లి అతడిని అక్కడ ఉంచాడు, అంతే కాకుండా మళ్లీ తిరిగి తెల్లవారు ఝామున ఆ పూటకూళ్లవాని వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకొనమని, అతడికి ఇంకా ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే చే యించమని, ఆ ధనాన్ని తాను ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ సహాయం చేసిని వ్యక్తికీ ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు, అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్లిన ఇద్దరి వ్యక్తుల దృష్టిలో ఈ సహాయం చేసిన వ్యక్తి చెడ్డవాడుగా ఉండేవాడు...ఇప్పుడు ఆలోచించండి, మొదలు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోకం దృష్టిలో చాలా గొప్పవారిగా, భక్తులుగా చెలామణి అయ్యేవారు, దేవుని వద్ద పూజలు చేస్తూ అందరికీ కనిపించేట్టు ప్రార్థనలు చేస్తూ భక్తుల ముద్ర వేసుకున్నవారు. అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు (మత్తయి 22:39), అని క్రీస్తు చెప్పిన మాట పరమార్థం ఇదే కదా... ఒక వ్యక్తి సహాయం కోసం చూస్తుంటే అతనికి సహాయ పడకుండా త్వరగా వెళ్లి ప్రార్థన చేయాలనో లేదా సమయానికి గుడికి వెళ్లకపోతే దేవునికి కోపం వస్తుందనో అనుకునే భక్తులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవునికి ఇష్టమైనట్టు బతకడమే నిజమైన భక్తి అని ఈ ఉపమానం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని పని చేసేవాడు ముందుగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి, భక్తుడు దేవునికి నచ్చిన దానిని చేయాలి. – బెల్లంకొండ రవికాంత్ -
మనుషుల్లో లే'దయా'!
మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు?ఇవ్వాళ, రేపు అంతటా ఇదే తంతు నడుస్తోంది. ఒత్తిడితో కూడిన నేటి పోటీ ప్రపంచంలో మనుషుల్లో దయాగుణం తగ్గిపోతోంది. అందుకేనేమో.. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’వంటి పాటలు మనిషిలో మాయమైపోతోన్న గుణాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి దయతో బతకాలనే స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఏటా నవంబర్ 13న వరల్డ్ కైండ్నెస్ డే నిర్వహిస్తున్నారు. చిన్న సాయమైనా పెద్ద మనసుతో.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో దయా గుణం అనేది అంతర్భాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం ఏటా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం, పేదవారికి ఆహారాన్ని పంచడం, చిన్నారుల చదువులకు సాయపడటం, వృద్ధులకు చేయూతనివ్వడం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వారిని బయటకు తెచ్చే మార్గాల్ని అన్వేషించడం.. ఇలా చేసేది ఉడతా భక్తి సాయమైనా పర్లేదు.. కాస్తంత దయతో, చిత్తశుద్ధితో చేస్తే చాలు. అమెరికాలో కైండ్ నెస్ ఇన్స్టిట్యూట్ ఇతరుల బాధను పంచుకోవాలంటే మనలో దయాగుణం పెరగాలి. భావితరాల్లో దీనిపై సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ గత సెప్టెంబర్లో ఒక ఇన్స్టిట్యూట్నే ప్రారంభించింది. దయా గుణం అనేది అంతర్లీనంగా అందరిలో ఉన్నా.. దానిని ఎలా చూపాలో తెలియని వారికి ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తుంది. పౌరుల్లో దయాగుణాన్ని పెంచడం, మానవీయ సమాజాలు నెలకొల్పే దిశగా నాయకుల్లో స్ఫూర్తి నింపడం వంటివి ఇక్కడ నేర్పిస్తారు. మనిషిలో హింసా ప్రవృత్తిని నివారించే మార్గాలను అన్వేషిస్తారు. సమాజంలో దయకు స్థానం ఎందుకు తగ్గిపోతోందో అధ్యయనం చేస్తారు. మనుషుల్లో పుట్టుకతోనే కొన్ని గుణాలు అబ్బుతాయి. వాటిపై కుటుంబం, స్నేహాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్ వల్ల తోటివారికి సాయపడే గుణం పెరుగుతుందని కాలిఫోరి్నయా వర్సిటీలోని కైండ్నెస్ ఇన్స్టిట్యూట్ డీన్ డార్నెల్ హంట్ అంటున్నారు. మయన్మార్లో దయాగుణం ఎక్కువ తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచారం చేసే ఒక వర్గమిది. మయన్మార్లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్ టాప్లో ఉంది. ఈ జన్మలో చేసే మంచి పనులే వచ్చే జన్మలో మెరుగైన జీవితాన్నిస్తాయని తెరవాడ బౌద్ధుల నమ్మకం. మయన్మార్లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్స్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. థాయ్లాండ్లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది. సంపన్న రాజ్యమైన అమెరికా దయాగుణం గల టాప్–10 దేశాల్లో లేదు. ‘దయ’లో టాప్–10 దేశాలు దయాగుణం గల వారి సంఖ్య శాతాల్లో 1. మయనన్మార్ 81 2. యూకే 71 3. మాల్టా 71 4. థాయ్లాండ్ 71 5. నెదర్లాండ్స్ 71 6. ఇండోనేషియా 69 7. ఐర్లాండ్ 69 8. ఆస్ట్రేలియా 68 9. న్యూజీలాండ్ 65 10. కెనెడా 63 -
‘కారుణ్యం’ కొందరిపైనే
– ఏడాది తరువాత కారుణ్య నియామకాలు చేపట్టిన ఆర్టీసీ – 52 శ్రామిక్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు(రాజ్విహార్): ఆర్టీసీ అధికారుల వైఖరితో సంస్థలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల ఇళ్లలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ అవకాశం కోసం కర్నూలు రీజియన్లో వీరి సంఖ్య 150 మందికి పైగా ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన కానిస్టేబుల్ (సెక్యూరిటీ విభాగం) నియామకాల్లో 35 మందికి పోస్టులు ఇచ్చారు. దీనికి వయస్సు నిబంధన పెట్టడంతో అనేక మంది వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం 120 మంది మిగిలి ఉన్నారు. శ్రామిక్ (మెకానిక్ విభాగం) పోస్టుల్లో నియమించేందుకు పోస్టుల్లో తీసుకోవాలంటూ సంస్థ గత వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు నండూరి సాంబశివరావు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి ఈ శ్రామిక్ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి అదేనెల 31వ తేదీలోపు మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టులోగా అభ్యర్థుల విద్యార్హత, కుల, నివాస తదితర సర్టిఫికెట్ల పరిశీలన చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నా సెలక్షన్ కమిటీ ఎంపికలో జాప్యం జరిగింది. 58 మంది హాజరు: కారుణ్య నియామకాల కింద 52 శ్రామిక్ పోస్టుల భర్తీకి బుధవారం దరఖాస్తుల పరిశీలనకు 60 మందిని పిలవగా 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంకా 68 మంది మిగిలి ఉన్నారు. బుధవారం వచ్చిన అభ్యర్థుల విద్యార్హత, ఇరత సర్టిఫికెట్లను పరిశీలించారు. సాధారణంగా శ్రామిక్ పోస్టులకు 10వ తరగతి తరువాత ఐటీఐలో డిజిల్ మెకానిక్ చేసిన అభ్యర్థులతోనే గతంలో భర్తీ చేసేవారు. అయితే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోరుతూ సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఊరట కల్పించారు. ఐటీఐ లేకపోయినా కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలని సడలించారు. ఓసీ అభ్యర్థుల వయస్సు 22 నుంచి 35 సంవత్సరాలలోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇవ్వగా 40 ఏళ్లు నిబంధన ఉండగా మహిళలు, శారీరక వికలాంగులు అనర్హులు కావడంతో కాల్ లెటర్లు పంపలేదు. సర్టిఫికెట్ల పరిశీల కమిటీకి డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ గోపి చైర్మన్ కాగా సభ్యులుగా డీసీఎంఈ రమేష్ బాబు, డీసీటీఎం శ్రీనివాసులు, కో ఆర్డినేటర్గా పీఓ సర్దార్ హుసేన్ వ్యవహరించారు. -
ఒబామా భారీ క్షమ
78 మందికి క్షమాభిక్ష, 153 మందికి శిక్ష తగ్గింపు హŸనలులు: పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. 78 మందిని క్షమించిన ఆయన.. మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇంతమందికి క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటిల్లో శిక్ష తగ్గించేవి ఎక్కువగా ఉంటున్నాయి. క్షమాభిక్షలో ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత, న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అర్హత పొందటం లాంటివి ఉంటాయి. ఇంకా శిక్షలో తీవ్రతను తగ్గిస్తారు. ఈసారి క్షమాభిక్ష పొందిన వారిలో ఎక్కువ మంది నకిలీ కరెన్సీ మార్పిడి, పేలుడు పదార్థాలతో దొరికినవారు, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు ఉన్నారు. అధ్యక్షుడిగా ఒబామా ఇప్పటి వరకూ 148 మందికి క్షమాభిక్ష పెట్టగా.. 1176 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారని వైట్ హౌస్ న్యాయవాది నీల్ ఎగ్గెల్స్టన్ తెలిపారు. -
ఈ రాజు లక్షన్నరమంది ఖైదీలను ఏం చేస్తారో?
బ్యాంకాక్: థాయిలాండ్ కొత్త రాజు మహా వజ్రలాంకార్న్ దయామయుడిగా మారబోతున్నారు. ఆయన దాదాపు లక్షన్నర మంది నేరస్తులకు క్షమా భిక్ష పెట్టనున్నారు. శిక్షల స్థాయిని తగ్గించడమో, మొత్తానికే రద్దు చేయడమో వంటి చర్యలకు దిగబోతున్నారు. ఈ నేరస్తుల్లో రాజద్రోహానికి పాల్పడిన వారు, అత్యంత కఠినమైన చట్టాల కింద అరెస్టయిన వారు కూడా ఉన్నారు. రాజుగా వజ్రలాంకార్న్ ఈ నెల(డిసెంబర్) 1న కిరీటం ధరించారు. తండ్రి భూమిబోల్ అదుల్యాదేజ్ గత అక్టోబర్ 13న కన్నుమూయడంతో ఆయన స్థానంలో రాజుగా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరస్తుల విషయంలో ఆయన ముందుకు వచ్చిన అతిపెద్ద అవకాశం ఇదేనని రాయల్ గెజిట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొత్తం లక్షన్నరమంది ఖైదీల జాబితా సిద్ధంగా ఉందని, వీరు విడుదలకావడమో, లేక శిక్షా కాలాన్ని తగ్గించడమోనన్న నిర్ణయం రాజు చూపించే దయపైనే ఆధారపడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలం, ప్రవర్తన, వయసు ఆధారంగానే రాజు తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement