-
అభివృద్ధి మోదీది.. ప్రచారం బాబుది
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపాటు అనకాపల్లి/సింహాచలం: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.వందల కోట్ల ప్యాకేజీ, పరిశ్రమలను కేటాయిస్తుంటే రాష్ట్ర సర్కారు కేవలం రాజధాని గురించే మాట్లాడుతోందని, దాన్నే ప్రచారం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఆయన సోమవారం విశాఖ జిల్లా అనకాపల్లిలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు విడిపోయిన 11 రాష్ట్రాలు రాజధానులను నిర్మించుకున్నాయని, కానీ ఇక్కడే రాజధానిని నిర్మిస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కంటే రూ.వేల కోట్ల నిధులతో ఏపీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని పని చేస్తున్నారని వివరించారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా మోదీ బొమ్మ కనిపించడం లేదని ఆక్షేపించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకోవడమే ఇక్కడి సీఎం ఘనత అని వ్యాఖ్యానించారు. అమరావతిని హెరిటేజ్ నగరంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సెంట్మెంట్లను ఆపి అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. హోదా కాదు.. ప్రత్యేక రాష్ట్రమే: ప్రత్యేక హోదా ఇవ్వడం కంటే కేంద్రం ఏపీనిప్రత్యేక రాష్ట్రంగానే గుర్తిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. ఆయన సోమవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
ఎమ్మెల్యేలను కాదు.. ప్రజలను ఆకర్షించండి
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచన సాక్షి, విజయవాడ బ్యూరో: ఎమ్మెల్యేలను కాకుండా ప్రజలను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా టీడీపీ పేరు ఎత్తకుండా ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ధరల అదుపుపై పెడితే బాగుంటుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యల్లో ఉన్నారని, కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రత్యేక హోదాపై స్పందిస్తూ.. తమది అవినీతి, మోసకారి పార్టీ కాదని, ఇచ్చిన మాటపై నిలబడి ఉంటామని చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రత్యేక హోదా బెటరా లేక ప్యాకేజీ బెటరా అనే దానిపై చర్చ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఫిరాయింపులపై మొదటి నుంచి తాను విమర్శలు చేస్తున్నానని, ఏ పార్టీ అయినా ఫిరాయింపులను ప్రోత్సహించడం సరైన విధానం కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. -
మేం స్వాగతించడం లేదు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికపై మిత్రపక్ష బీజేపీ స్పందన సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండానే అధికార తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలను మిత్రపక్ష పార్టీగా మీరు స్వాగతిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘మేం స్వాగతించడం లేదు’ అని బదులిచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కొన్ని విలువలున్నాయి. వాటిని ఏ పార్టీ అయినా పాటించాలి. 1998లో కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వానికి జయలలిత మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయాం. అప్పుడు ఐదుగురు ఎంపీలను మేనేజ్ చేసి, వారిని పార్టీలో తీసుకొస్తామని చాలా మంది నేతలు వాజ్పేయితో చెప్పినా అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఇది మా పాలసీ. ఇంతకు మించి నేను ఎవరినీ విమర్శించను’ అని వ్యాఖ్యానించారు. -
టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
♦ ‘హోదా’పై అవగాహన కల్పించడంలో సీఎం, మంత్రులు విఫలం ♦ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం సాంబమూర్తినగర్ (కాకినాడ): రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. బుధవారం కాకినాడలో విలేకరుల తో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేస్తుండగా సీఎం చంద్రబాబు అవన్నీ తామే చేసినట్లు చెప్పుకోవడం బాధాకరమన్నారు. చిన్నారులకు టీకాలు అందించే ‘మిషన్ ఇంద్ర ధనుష్’ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానికి సముచిత స్థానం ఇవ్వకపోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తామే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవాలని సంకల్పించామని, ఇందుకు మీడియా సహకరించాలని వీర్రాజు కోరారు. ‘హోదా’పై అవగాహన కల్పించడంలో విఫలం.. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలని, ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కారాదని అభిప్రాయపడ్డారు.ఇటీవల ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. మోదీ ప్రభుత్వం నూతన రాష్ట్రమైన ఏపీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం రూ.24 వేల కోట్లతో ఎన్టీపీసీ ద్వారా విశాఖలో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో రూ.6వేల కోట్లతో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపడుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీర్రాజు! సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక దాదాపు ఖాయమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబర్లో రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ కోసం చురుకుగా పనిచేసిన వీర్రాజు అభ్యర్థిత్వాన్ని నేతలు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వీర్రాజు పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement