-
డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతలు
న్యూఢిల్లీ: భారత్లో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతల వృద్ధిని సాధించి రూ.7,092 ట్రిలియన్లకు చేరుకోవచ్చని బెంగళూరు ఆధారిత రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ కన్సల్టింగ్ అంచనా వేసింది. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో డిజిటల్ పేమెంట్స్కు పెరుగుతున్న ప్రాధాన్యత, వ్యాపారుల డిజిటలైజేషన్ల వృద్ధి దేశంలో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ విస్తరణకు తోడ్పడతాయని రీసెర్చ్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2019–20లో భారత డిజిటల్ పేమెంట్ మార్కెట్ విలువ దాదాపు రూ.2,162 కోట్లుగా ఉన్నట్లు రీసెర్చ్ తెలిపింది. ఈ వృద్ధి అనేక డిమాండ్, సరఫరా అంశాలతో ముడిపడి ఉన్నట్లు కన్సల్టెన్సీ సర్వేలో తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో ప్రస్తుతం 1శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ 2025నాటికి 3.5శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 162 మిలియన్లు ఉన్న మొబైల్ పేమెంట్ యూజర్లు 800 మిలియన్లకు చేరుకొనే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. డిజిటల్ పేమెంట్స్లోకీలకపాత్ర పోషిస్తున్న వాలెట్ ఆధారిత పేమెంట్స్... ఫ్రీక్వెన్సీ, యూజర్ బేస్ రెండింటిలో నిరంతర వృద్ధి చెందుతూ రానున్న డిజిటల్ మార్కెట్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. 2025 నాటికి, వాలెట్ల ద్వారా చెల్లింపులు అధికంగా ఉండవచ్చని, చివరికి తక్కువ–ఆదాయ చెల్లింపుగా భావించే మల్టీపుల్ స్మాల్–టికెట్ లావాదేవీలు కూడా వాలెట్ల ద్వారానే జరగవచ్చని రీసెర్చ్ సంస్థ భావిస్తోంది. కరోనా వ్యాప్తి డిజిటల్ పేమెంట్స్కు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని తెలిపింది. కరోనా భద్రత ఆందోళనలతో ప్రజలు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రాసరీ స్టోర్లో డిజిటల్ పేమేంట్స్ 75% పెరిగినట్లు నివేదిక తెలిపింది. -
డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు!
మీరు ఎవరికైనా డబ్బులు పంపించాల్సి ఉండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోయినా ఇక మీదట చింత అక్కర్లేదు. ఫేస్బుక్ మెసెంజర్ చేతిలో ఉండి, ఇటు పంపేవాళ్లతో పాటు అటు అందుకునేవాళ్లకు కూడా డెబిట్ కార్డులు ఉంటే చాలు.. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయొచ్చట. అమెరికాలో ఫేస్బుక్ మెసెంజర్ వాడేవాళ్లు ఇప్పటికే ఆ యాప్ ద్వారా డబ్బులు పంపుతున్నారని టెక్నాలజీ వెబ్సైట్ సినెట్.కామ్ తెలిపింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే దీన్ని విస్తరిస్తున్నారు. ఇదంతా పూర్తి ఉచితంగానే చేసుకోవచ్చని అంటున్నారు. ఎటూ పిన్ ఆధారంగానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి, ఇందులో భద్రత గురించిన ఆందోళన కూడా అక్కర్లేదని ఫేస్బుక్ అంటోంది. దీని కోసం యూజర్లు ముందుగా తమ ఆండ్రాయిడ్ మెసెంజర్ యాప్లో ప్రొఫైల్ ఐకాన్ టచ్ చేసి, అందులో డెబిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, 'యాడ్ న్యూ డెబిట్ కార్డు' మీద ట్యాప్ చేయడం ద్వారా మిగిలిన పని పూర్తి చేయొచ్చు. మొబైల్ చెల్లింపులు చేయాలంటే, పేమెంట్స్ బటన్ టాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది టచ్ చేస్తే 'పే' స్క్రీన్ వస్తుంది. అక్కడ మనం చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేసి, ఎవరికి చెల్లించాలో కూడా ఎంటర్ చస్తే.. దానికి సంబంధించిన నోట్ వస్తుంది. అక్కడ 'పే' అనే బటన్ మీద టాప్ చేస్తే చెల్లింపు అయిపోయినట్లే. అంటే సెల్ఫోన్ బిల్లుల లాంటివి కూడా చెల్లించుకోవచ్చన్న మాట. -
వచ్చే ఏడేళ్లలో.. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్
- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా న్యూఢిల్లీ: దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు (మొబైల్ పేమెంట్స్) వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం చెల్లింపులలో 0.1 శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ వాటా కూడా 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement