-
COVID-19: కరోనాను అడ్డుకునే స్ప్రే
వాషింగ్టన్: కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యులార్ ఫిలమెంట్స్గా (ఎస్ఎంఎఫ్) పిలుస్తున్నారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్ తదితర వైరస్లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘కరోనా శ్వాస ద్వారానే సోకుతుందన్నది తెలిసిందే. ఎస్ఎంఎఫ్ స్పాంజ్ మాదిరిగా కరోనా వంటి వైరస్లను పీల్చుకుంటుంది. తద్వారా అవి ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారకుండా చూస్తుంది’’ అని వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హాంగాంగ్ కుయ్ వివరించారు. వీటిని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారట. కరోనా వైరస్ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్2గా పిలిచే రిసెప్టర్లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తద్వారా కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్ఎంఎఫ్ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. -
కరోనాపై పోరులో కొత్తమందు!
లండన్: కోవిడ్ వైరస్ ఉపరితలాన్ని అతుకోవడం ద్వారా, సదరు వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఒక మాలిక్యూల్(ఔషధి, చిన్న సైజు ఆర్గానిక్ కాంపౌండ్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెన్మార్క్కు చెందిన ఆర్హస్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఔషధి చౌకైనదని, కోవిడ్పై పోరులో ఉపయోగపడే యాంటీ బాడీల ఉత్పత్తితో పోలిస్తే దీన్ని ఉత్పత్తి చేయడం తేలికన్నారు. పీఎన్ఏఎస్ జర్నల్లో పరిశోధనా ఫలితాలను మంగళవారం ప్రచురించారు. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ ఈ మాలిక్యూల్ ఆర్ఎన్ఏ ఆప్టమర్స్ జాతికి చెందిన కాంపౌండ్ అని, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీలో ఉపయోగపడే బిల్డింగ్ బ్లాక్స్ దీనిలో ఉంటాయని తెలిపారు. 3డీ నిర్మితిలో మలిచేందుకు వీలయ్యే జన్యు పదార్ధం(డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ)ను ఆప్టమర్ అంటారు. ఇవి నిరి్ధష్ట లక్షిత కణాలను కనుగొనే శక్తి కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్ వైరస్ ఉపరితలానికి అతుక్కోగానే వైరస్లోని స్పైక్ ప్రోటీన్ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని కేవలం కోవిడ్ నిరోధానికే కాకుండా, గుర్తించడానికి వాడుకోవచ్చన్నారు. -
కరోనాకు మరో వ్యాక్సిన్, ఇది అన్నిటికంటే స్పెషల్!
బెంగళూరు: గది ఉష్ణోగ్రత వద్ద పని చేసే తొలి కరోనా వ్యాక్సిన్ ఇండియాలో రూపు దిద్దుకుంటోంది. ఇండియన్ ఇన్స్స్టిట్యూ్ట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఈ వ్యాక్సిన్ను రూపొందిస్తోంది. బెంగళూరు వేదికగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయోగ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐఐఎస్ చెబుతోంది. ఎలుకల్లో ప్రయోగాలు ఐఐఎస్ బెంగళూరులో మాలిక్యూలర్ బయో ఫిజిక్స్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడుగా పని చేసే మాలిక్యూల్ని కనుగొన్నారు. ఈ మాలిక్యూల్తో ఎలుకల్లో ప్రయోగాలు జరపగా యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కంటే ఎనిమిదిరెట్లు అధికంగా యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషుల్లో త్వరలోనే ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే పని చేసేవిగా తయారయ్యాయి. కరోనాకు తొలి వ్యాక్సిన్గా వచ్చిన ఫైజర్ అయితే ఏకంగా మైనస్ 71 సెల్సియస్ డిగ్రీల దగ్గర నిల్వ చేయాల్సి ఉంది. ఇక కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీలు 8 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. దీంతో వ్యాక్సిన్ల నిల్వ, సరఫరా ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఐఐఎస్ బెంగళూరు రూపొందించిన వ్యాక్సిన్ను గది ఉష్ణోగ్రత వద్ద కూడా బాగా పని చేస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సులువు అవుతుందంటున్నారు సైంటిస్టులు. -
ఈ ఇంటిదొంగలను పట్టేద్దామా?!
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత అందరికీ తెలిసిందే. మన ఇంట్లోనే దాగి ఉండి... మనకు హాని చేసే ఈ విషాల విషయంలో అది అక్షర సత్యం. మనం నిరపాయకరంగా భావించే అనేక చోట్ల ఈ విషాలు నక్కి ఉంటాయి. మన నట్టింట్లో అనుక్షణం నడయాడుతుంటాయి. మనింట్లో మనకే తెలియకుండా పొంచి ఉండి కాటేసి చిమ్మే అనేక విషాలనూ... వాటికి విరుగుడు మార్గాలను తెలుసుకుందామా. వాటి గురించి ఒక అవగాహన కల్పించుకోవడం కోసమే ఈ కథనం. ఇటీవల మన ఇండ్లలోకి కొత్తరకం పాత్రలు వస్తున్నాయి. లోహం అయితే చాలా బరువుగా ఉండటం వల్ల ఈ తరహా పాత్రలు ఇప్పుడు వినియోగదారులను ఆకర్శిస్తున్నాయి. నిజానికి చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్ ఆరోగ్యానికి అంత అందమైనవి కాదు. ఈ పాత్రలు ‘మెలామైన్’ అనే ప్లాస్టిక్లాగానే ఉండే ఒకరకం పదార్థంతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే వేడికి ఆ మెలామైన్ అణువులు... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా ఒంట్లోకి చేరిపోతుంటాయి. మెలమైన్ వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లో సైతం ప్రచురితమైంది. ఈ పదార్థం వల్ల కిడ్నీఫెయిల్యూర్కు దారితీసే అవకాశంతో పాటు క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు సాక్షాత్తూ డబ్ల్యూహెచ్ఓ నివేదికలూ పేర్కొంటున్నాయి. కొంతమంది నేరుగా ఈ బౌల్స్ను మైక్రోవేవ్ ఒవెన్లో ఉంచి వేడిచేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదంటూ అమెరికాలో ఔషధాలకు అనుమతి ఇచ్చే అత్యున్నత ప్రమాణాల సంస్థ అయిన ఎఫ్డీఏ గట్టిగా సిఫార్సు చేస్తోంది. దీనివల్ల హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ప్రభావం ఉంటుందట. దాంతో గర్భధారణ సమస్యలు వస్తాయంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక పురుషుల్లోనూ... వీర్యకణాల సంఖ్య తగ్గడం, వాటి కదలికలు మందగించడం, హార్మోన్ల స్రావాలు తగ్గడం జరుగుతాయి. చాలామందిలో డయాబెటిస్ వచ్చే ముప్పు విపరీతంగా పెరుగుతున్నట్లుగా కూడా ఒక అధ్యయనంలో తేలింది. నివారించండిలా: వేడివేడి సూప్లూ, కూరలు, ఇతరత్రా పదార్థాలను వడ్డించాలనుకుంటే పింగాణీ బౌల్స్ లేదా పింగాణీ ప్లేట్లే మంచివి. వాటిలో తినడమే ఆరోగ్యదాయకం. మన సోఫాల్లో మరెన్నో విషపదార్థాలు... మంటలు అంటుకున్నా సురక్షితంగా ఉండేలా ఇటీవల ఆధునికమైన కొన్నిరకాల సోఫాలను రూపొందిస్తున్నారు. వీటిని ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలను ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటారు. ఈ సోఫాలపై మనం చేతులు ఆనించినప్పుడు ఈ రసాయనాలు చేతులపైకి చేరతాయి. అవే చేతులతో మనం ఏవైనా ఆహారపదార్థాలను తిన్నప్పుడు... ఆ విషాలు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ విషాలు మన గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్)ను దెబ్బతీస్తాయి. ఫలితంగా ఎంజైముల, జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రధానంగా ఈ దుష్ప్రభావం ప్రధానంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడే అవకాశం ఉంది. దాంతో కొన్ని రకాల ప్రత్యుత్పత్తి సంబంధిత వ్యాధులు రావచ్చు. ఒక్కోసారి క్యాన్సర్లు వచ్చేందుకూ అవకాశాలున్నాయి. నివారించండిలా: సోఫాలను క్రమం తప్పకుండా వాక్యూమ్ క్లీనర్తో తరచూ శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా శుభ్రపరిచే సమయంలో ఎయిర్ఫిల్టర్ ఉపయోగించడం మరింత మంచిది. ఇలాంటి సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినేముందు నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. ప్రకాశవంతమైన లైట్లతో ఆరోగ్యానికి ముప్పు మీరు ఇంట్లో రాత్రి నిద్రపోయే సమయంలో పెద్ద లైట్లు అస్సలు వేసుకోకండి. బాగా కాంతి తక్కువగా ఉండే (డిమ్గా ఉండే) జీరో బల్బులు మాత్రమే వాడండి. రాత్రివేళల్లో అలముకునే చీకటి కారణంగానే మన మెదడుల్లో... మెలటోనిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది స్రవించడం వల్లనే మనకు నిద్ర వస్తుంది. లైట్లు వేసుకుని పడుకోవడం వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. దాంతో రాత్రి నిద్ర పట్టదు. ఫలితంగా నిర్ణీత వేళల్లో నిద్రతెప్పించేందుకు మన మెదడులోని వ్యవస్థ అయిన ‘సర్కాడియన్ రిథమ్’ దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపేందుకు చాలా ఆస్కారం ఉంది.నిద్రలేమి వల్ల మహిళల్లోనైతే బ్రెస్ట్ క్యాన్సర్లకు, పురుషుల్లోనైతే ప్రోస్టేట్ క్యాన్సర్లకు అవకాశం ఉంటుంది. అంతేకాదు... పెద్దపేగు, బ్లాడర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ల రిస్క్ పెరుగుతుందని పేర్కొన్న ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ప్రచురితమయ్యాయి. నివారించండిలా: రాత్రి చీకటి అలముకోగానే మెలటోనిన్ స్రవించేలా చేయడం అన్నది ప్రకృతి స్వాభావికంగా చేసిన ఏర్పాటు. దాన్ని బ్రైట్లైట్స్తో దెబ్బతీయవద్దు. రాత్రివేళల్లో చాలా డిమ్ లైట్స్ మాత్రమే ఉపయోగించండి. కర్టెన్ల వెనక కాలకూటం గతంలో మన ఇళ్లలో బట్టలతో చేసిన కర్టెయిన్లు వాడేవాళ్లం. కానీ ఇటీవల ఒక రకం ప్లాస్టిక్తో చేసిన బ్లైండ్లను వాడటం పరిపాటి అయ్యింది. చాలా కాలం పాటు మన్నికతో ఉండటానికి మనం ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన ఈ తరహా కర్టెన్లను వాడుతున్నాం. ఇక బాత్రూమ్లలోనైతే నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం మనం వాడే షవర్ కర్టెయిన్లన్నీ తప్పనిసరిగా వాటర్ప్రూఫ్ మెటీరియల్తో తయారవుతున్నాయి. వాటిని వాటర్ప్రూఫ్గా తయారు చేయడానికి విధిగా ఒకరకం ప్లాస్టిక్ను ఉపయోగించాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్ కర్టెన్లు సాధారణ బట్టల్లాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా ‘థాలేట్’ అనే పదార్థంతో వీటిని తయారుచేస్తారు. ఈ షవర్ కర్టయిన్లలో మాత్రమే కాకుండా... మన ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్పేపర్లు, అనేక రకాల ఫ్లెక్సీలు కూడా ఈ పదార్థంతోనే తయారుచేస్తుంటారు. ఈ థాలేట్ అనేది పురుషుల సెక్స్ హార్మోన్పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) బాగా దెబ్బతింటుంది. ఇక ఈ కర్టెయిన్ల మీదుగా వీచే గాలి అలర్జీలను ప్రేరేపిస్తుంది. దాంతో అనేక శ్వాససంబంధ సమస్యలు రావడం జరగవచ్చు. దీర్ఘకాలంలో ఆస్తమా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మహిళల విషయానికి వస్తే... ఈ తరహా వాల్పేపర్లు, గృహాలంకరణ వస్తువులు, కర్టెయిన్లు ఉన్న ఇండ్లలో గర్భవతుల ఉంటే ఇవి వారికి మరింత ప్రమాదకరం. ఇవి ఉపయోగించడం అంటే... పుట్టబోయే పిల్లలు ఇంట్లోకి రావడానికి ముందే వారి ఆరోగ్యకరమైన చిన్ని అవయవాలను పూర్తిగా కలుషితం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడమే. ఇలాంటి కర్టెయిన్లు, వాల్పేపర్లు, అలంకరణ సామగ్రి ఉపయోగించే ఇళ్లలో పెరిగిన పిల్లల్లో ఏడీహెచ్డీ వంటి రుగ్మతలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలా అధ్యయనల్లో తేలింది. నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ ధోరణులు పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి. నివారించండిలా: ఇంట్లోని డోర్ కర్టెన్లు, షవర్ కర్టయిన్ల కోసం వీలైనంత వరకు నిరపాయకరమైన మెటీరియల్తో తయారు చేసినవే వాడండి. దెబ్బతిన్నప్పుడు మార్చుకోవడం శ్రమ అయినా సరే... కాటన్తో తయారైన కర్టెయిన్లనే వాడండి. ఫర్నిచర్గా, అందంగా ఉండే ప్లాస్టిక్ పీవీసీతో తయారు చేసిన వాటికంటే కలపతో తయారు చేసిన వాటినే వాడండి. నాన్స్టిక్ పాత్రలతో చాలా ప్రమాదం... మనం వంట వండినప్పుడు అది పాత్రల అడుగున అంటుకుపోనివ్వకుండా చేసే నాన్స్టిక్ తరహా గిన్నెలు, పెనం వంటి గృహోపకరణాలకు ఇటీవల బాగా ప్రాచుర్యం పెరిగింది. వీటిని ‘నాన్స్టిక్ కుక్వేర్’గా అభివర్ణిస్తుంటాం. నాన్స్టిక్ కిచెన్వేర్ ఆరోగ్యానికి కీడు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా వంటపాత్రల్లో వండిన వంటలను తిన్న పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని ఈ అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి గృహోపకరణాలు ఉపయోగించే వారిలో సంతానలేమి అంటే... పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం వంటి అనర్థాలు కలుగుతాయని ‘ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్’ హెల్త్ జర్నల్లోని నివేదికలు చెబుతున్నాయి. నివారించండిలా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్స్టిక్ కుక్వేర్కు బదులుగా సాధారణ స్టెయిన్లెస్ స్టీల్ వంటివి ఉపయోగించడం మంచిది. ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు ఈ నాన్స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం మానేయాలి. మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండాల్సిన వంటకాలకు ఈ నాన్స్టిక్ కుక్వేర్ను ఉపయోగించకపోవడమే మంచిది. వంటింట్లోకి గాలి ధారాళంగా రావాలి ఇంటి నిర్మాణం సమయంలో వంటింటికి చాలా మంది చాలా తక్కువ స్థలాన్ని కేటాయిస్తారు. ఇదెంతో ప్రమాదకరం. కిచెన్లోకి గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కిరోసిస్ స్టవ్లు ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిరోసిన్ మండే సమయంలో కొన్ని హానికర వాయువులు వెలువడతాయి. ఇక కట్టెల పొయ్యి అయితే కార్బన్ డై ఆక్సైడ్తోపాటు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వస్తాయి. వీటివల్ల ప్రాణాపాయం కూడా తప్పని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. నివారించండిలా వంటగది విశాలంగా ఉండేలా చూసుకోండి. కిచెన్ను అనవసరమైన వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంట... కిచెన్లో వద్దు. ఆరుబయటే చేయండి. బాత్రూమ్లో హానికర రసాయనాలెన్నో హానికరమైన రసాయనాలకు బాత్రూమ్ కూడా ఒక నెలవే. అక్కడ ఉపయోగించే షాంపూలలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇక సువాసన వచ్చేందుకు గాను కొన్ని రకాల సబ్బుల్లో చేర్చే సుగంధ ద్రవ్యాల వల్ల కూడా చర్మంపై అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. నివారించండిలా రసాయనాలు తక్కువగా ఉండే స్వాభావిక పదార్థాలతో చేసిన సబ్బులు, షాంపులు ఉపయోగించండి. ఇంటిబయటే చెప్పులూ, బూట్లు, సాక్స్... ఒకటి రెండు రోజులు అవే వేసుకుంటే సాక్స్ (మేజోళ్లు) దుర్వాసన వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాలిని పట్టుకుని ఉండే మేజోడులో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ దుర్వాసన వస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాక సాక్స్ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. అందుకే పాదరక్షలు, ప్రధానంగా సాక్స్ ఇంటి బయటే వదలాలి. ఉతికి పొడిగా మారాక మాత్రమే వాటిని ఇంట్లోకి తీసుకురావాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్పులు, పాదరక్షలు, షూస్, సాక్స్ స్టాండ్ ఇంటి బయట ఉండటమే మంచిది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతోనే మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఉండే అనేక రకాల విషాలను, హాని చేసే ముప్పులను నివారించుకోవచ్చు. డా‘‘ ఎం. రామకృçష్ణ, సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట్, హైదరాబాద్ -
ట్రాన్ సెల్ లో ఐఏఎన్ పెట్టుబడి
♦ 25 శాతం వాటాకు రూ.15-20 కోట్లు ♦ వీటిని మాలిక్యూల్స్ అభివృద్ధికి వెచ్చించనున్న సంస్థ ♦ వచ్చే మూడేళ్లలో మస్క్యులర్ డిస్ట్రొఫీకి ఔషధం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్సెల్ బయాలాజిక్స్లో ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ (ఐఏఎన్) పెట్టుబడి పెట్టింది. డీల్ విలువ రూ.15-20 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీలో ఐఏఎన్ 22-25 శాతం వాటా దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మూల కణ ఆధారిత ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కంపెనీ చేస్తున్న పరిశోధన, దీర్ఘకాలిక వ్యూహం ఐఏఎన్ను ఆకట్టుకుంది. ఇక డీల్ ద్వారా వచ్చిన మొత్తాన్ని మాలిక్యూల్స్ అభివృద్ధికి ట్రాన్సెల్ వెచ్చించనుంది. మస్క్యులర్ డిస్ట్రొఫీ చికిత్సకు మూలకణ ఆధారిత ఔషధం అభివృద్ధికై ఇప్పటికే ట్రాన్సెల్ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. 2018 నాటికి ఔషధాన్ని తేవాలన్నది సంస్థ లక్ష్యం. ఔషధాన్ని తొలుత యూరప్లో విక్రయించాలని ట్రాన్స్సెల్ భావిస్తోంది. అక్కడ డిస్ట్రొఫీ బాధితులు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ట్రాన్సెల్ బోర్డులోకి ఐఏఎన్ నుంచి సంజయ్ జెస్రానీ రానున్నారు. ఇతర చికిత్సలకూ.. క్యాన్సర్, అల్జీమర్స్ చికిత్సకు మూల కణ ఆధారిత మాలిక్యూల్స్ను తీసుకురావాలని ట్రాన్సెల్ కృతనిశ్చయంతో ఉంది. ఏడాదిలో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని కంపెనీ భావిస్తోంది. రానున్న రోజుల్లో ఇతర వ్యాధుల చికిత్సకు కూడా ఔషధాలను అభివృద్ధి చేయనుంది. కాగా, ట్రాన్సెల్ను మూల కణ రంగ శాస్త్రవేత్త సుభద్ర ద్రావిడ ఏర్పాటు చేశారు. స్టెమ్సెల్ బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవలతో కంపెనీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 8,500 శాంపిళ్లను భద్రపరిచే సామర్థ్యం కంపెనీకి ఉంది. శ్రీలంక, దుబాయ్తోపాటు పలు దేశాల్లో సేవలను విస్తరించిన ఈ సంస్థ త్వరలో ఆఫ్రికాలో అడుగు పెడుతోంది. సేకరించిన మూలకణాలు రవాణాలో 48 గంటల పాటు భద్రంగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసింది. విదేశాల్లోనూ సేకరించిన స్టెమ్ సెల్స్ను హైదరాబాద్ సెంటర్లో నిల్వ చేస్తోంది. ఐఏఎన్ ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ ఏంజెల్ గ్రూప్ కావడం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement