-
నెమ్మదించనున్న ట్రాక్టర్ల అమ్మకాలు : మాగ్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని, అది ఈ ఏడాది 5 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్బీఎఫ్సీ మాగ్మా ఫిన్కార్ప్ పేర్కొంది. ఎలినెనో, వర్షాలు ఆలస్యంగా కురవడం కారణంగా ఖరీప్ పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు మాగ్మా ఫిన్కార్ప్ ట్రాక్టర్ల అమ్మక విభాగ అధిపతి ధృబషీష్ భట్టాచార్య తెలిపారు. గతేడాది రబీ పంటలు బాగుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసిక అమ్మకాలు బాగున్నాయని, కాని రెండో అర్థభాగం నుంచి అమ్మకాలు తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టాచార్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినా, మాగ్మా ఫిన్కార్ప్ ట్రాక్టర్ల రుణాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో గతేడాది రూ.562 కోట్ల రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాపారంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూ. 500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు అనుమతించిందని, అవసరమైనప్పుడు ఈ నిధులను సమీకరిస్తామన్నారు. తెలంగాణాలో 12, ఆంధ్రాలో 12 శాఖలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లో శాఖల సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు. -
ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 3 విభిన్న కాలవ్యవధులున్న డిపాజిట్లపై 3.25 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. కొత్త రేట్లు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్ పేర్కొంది. తాజా చర్యలతో 31-45 రోజుల వ్యవధిగల డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడున్న 6% నుంచి 9.25%కి పెరిగింది. 46-90 రోజుల డిపాజిట్లపై 8.5% నుంచి 9.5%కి; 91-179 రోజుల డిపాజిట్లపై 8.75% 9.75%కి రేట్లను పెంచినట్లు వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్ బేస్రేటు కూడా..: అలహాబాద్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు) 0.05 శాతం పెరుగుదలతో 10.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలతో సహా అన్ని కొత్త రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేనా బ్యాంకు ఎఫ్సీఎన్ఆర్ రేట్ల సవరణ.. ఎఫ్సీఎన్ఆర్(ఫారిన్ కరెన్సీ నాన్-రిపాట్రియబుల్) (బి), ఆర్ఎఫ్సీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను దేనా బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల దాకా వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 2.57 శాతం నుంచి 2.55 శాతానికి, 4 నుంచి 5 ఏళ్ల దాకా డిపాజిట్లపై 5.24 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement