-
నోటికి ఓటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సర్పంచ్ పదవి దక్కించుకోవడం భారంగా మారింది. పీఠమెక్కడానికి అర్హతలేకాదు.. ఆర్థిక వనరులు కూడా ముఖ్యమని తెలుస్తోంది. నోట్ల కట్టలను వెదజల్లకపోతే.. మందు, విందు ఇవ్వకపోతే సర్పంచ్ పదవేకాదు ఆఖరికి వార్డు సభ్యుడిగా కూడా గెలిచే పరిస్థితి లేదు. రాజధాని చుట్టూరా ఉన్న రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి రంగం ప్రభావం ఎక్కువ. దీంతో పంచాయతీల్లో పాగా వేయడానికి రియల్ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగుతు న్నారు. పల్లె పోరులో సీనంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. ఎన్నికలకు నగారా మోగకముందే కొన్ని గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేవగా.. నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ఇంకొన్ని పల్లెల్లో తాయిలాల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు కుల సంఘాలు, యువజన సంఘాలకు మాత్రమే పరిమితమైన ప్యాకేజీలు.. తాజాగా ప్రతి ఇంటి దారి పట్టాయి. ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా ‘ఓటుకు నోటు’ సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఓటరుకు నగదు ముట్టజెప్పడమే లక్ష్యంగా గ్రామాల్లో రాజకీయం సాగుతోంది. మరీ ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఇన్నాళ్లు మందు, విందు, వినోదాలు కేవలం కొందరికే పరిమితం కాగా.. తాజాగా సంక్రాంతి సందడిని సైతం అభ్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కోడ్ కూయకముందే.. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సర్పంచ్ గిరిపై కన్నేసిన ఓ యువకుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడ వేశాడు. దీనికి డిసెంబర్ 31వ తేదీ అనువైనదిగా భావించాడు. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రతి కుటుంబానికి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ పంపిణీ చేశాడు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామ పంచాయతీలోనూ ప్రలోభాలకు తెరలేచింది. ఓ అభ్యర్థి నోటిఫికేషన్ రాకమునుపే మద్దతుదారులకు స్మార్ట్ ఫోన్లను గిఫ్ట్గా ఇచ్చారు. ఇదే మండల పరిధిలోని ఘట్టుపల్లిలో ఓ అభ్యర్థి అనుచరులకు కలర్ టీవీలు, వాషింగ్ మెషీన్లు అందజేశాడు. యూత్కు గాలం! మీ యూత్లో ఎంతమంది ఉన్నారు. వారికి ఏమేమి కావాలి. హోటల్ వారికి చెబుతా. కావాల్సిన ఆహారపదార్థాలు తీసుకోండి. దీంతోపాటు ఫలానా వైన్షాపుకు వెళ్లి నాకు ఫోన్ చేయండి. కావాల్సిన బ్రాండ్ చెబుతా. ఇదీ.. నందిగామ మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు యువతను ఆకట్టుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లు. ‘అన్నా మేం పది మంది పొరగాళ్లం ఊరు బయట ఉన్నాం. మాకు మందు కావాలని ఓ యువకుడు బరిలో ఉన్న అభ్యర్థిని అడిగిందే తడువు.. వారి కోరికలు తీరుస్తున్నారు. మీరేమైనా అడగండి కానీ, మీ యూత్ మొత్తం మనకు ఓటు వేసేటట్లు చూడాలి అని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలకు నెలవైన ఈ మండలంలో సర్పంచ్, వార్డు పదవులకు భారీగా డిమాండ్ పలుకుతోంది. ఏకగ్రీవానికి ఎకరా భూమి? సర్పంచ్ పదవిని ఖరారు చేసినందుకు ప్రతిఫలంగా గుడి నిర్మించడానికి ఓ అభ్యర్థి తన పట్టా పొలంలో నుంచి ఎకరా భూమిని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీలో ఈ అంగీకారం మేరకు సర్పంచ్ స్థానమే కాదు.. వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే, దేవాలయ నిర్మాణ వ్యయం భరించేందుకు వార్డు అభ్యర్థులు ఒప్పుకోవడంతో ఈ పంచాయతీ పరిధిలోని అన్ని పదవులకు సింగిల్ నామినేషనే నమోదైనట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలో ఎకరా భూమి సుమారు రూ.60 లక్షలు పలుకుతోంది. బకరా.. బాటిల్! అభ్యర్థులకు సంక్రాంతి కలిసొచ్చింది. సరిగా ప్రచారం వేళ ఈ పండగ రావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు గాలం వేయడానికి సర్వశక్తులొడ్డుతున్నారు. పండగ ఘనంగా జరుపుకోవడానికి కుటుంబానికో మద్యం బాటిల్ పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. శంషాబాద్ మండలంలో ఇప్పటికే లిక్కర్ను డంప్ చేసిన అభ్యర్థులు.. ఒకే కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉంటే మద్యంతోపాటు మేకలు, కోళ్లు పంచడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పండగకు సొంతూరు వచ్చే ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓటేయడానికి రానుపోను ఖర్చులను ఇప్పుడే చెల్లించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
డబ్బులు పంచుతూ దొరికిన తెలుగు తమ్ముళ్లు
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ తెలుగు దేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటమిలో భయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారు. పలు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు డబ్బులు, మద్యం పంచుతూ పోలీసులకు చిక్కారు. * చిత్తూరు జిల్లా నగరిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు మద్యం, స్వీట్స్ ప్యాకెట్లు పంచిపెడతూ టీడీపీ కార్యకర్తలు పోలీసులకు చిక్కారు. కులం పేరుతో చిత్తూరులో టీడీపీ నాయకుల విందు భోజనాలు ఏర్పాటు చేశారు. సదుం మండలం జోగివారిపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొలకలచెరువు మండలం చౌడసముద్రంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని 12 కేసుల మద్యం సీసాలు పట్టుకున్నారు. * అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ముగ్గురు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు. * కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి, రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. * ప్రకాశం జిల్లా దర్శి పుట్టబజార్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్ట్ చేసి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు * విశాఖ జిల్లా కంచరపాలెంలోని కోనేరు జోగారావు నగర్లో ఇంటింటికి రూ.500 చొప్పున టీడీపీ-బీజేపీ టీడీపీ-బీజేపీ కార్యకర్తలు పంచిపెట్టారు. * గుంటూరు జిల్లా చిలకలూరిపేట 12వ వార్డులో నలుగురు టీడీపీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement