-
వలసలు..!
‘దేశం’ లక్ష్యంగా పావులు ఎంపీపీలపై కన్నేసిన టీఆర్ఎస్ టీడీపీ సభ్యులు లక్ష్యంగా ఎత్తులు అవసరమున్న చోట కాంగ్రెస్ వైపు గుడ్బై చెప్పేందుకు తమ్ముళ్లు రెడీ ‘స్థానిక’ కుర్చీలపై దృష్టిసారించిన టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ,జెడ్పీటీసీ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఎత్తుగడలు వేస్తోంది. తమ వైపు చూసే వారికి ‘ఆకర్ష’ పద్ధతిని గూట్లోకి లాక్కొని పదవులను నిలబెట్టుకోవాలని పథక రచన చేస్తోంది. ‘పల్లె పోరులో’ పట్టు సాధించిన కమలం, సైకిల్ పక్షాల వారిని ఆకట్టుకొని మండల పరిషత్ల్లో పాగా వేయాలని యోచిస్తోంది. మహబూబ్నగర్ : జిల్లా, మండల పరిషత్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ వలసల ద్వారా కుర్చీలు దక్కించుకోవాలనే వ్యూహంతో కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిని ఆకర్షించడం ద్వారా లక్ష్యం చేరుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ను మినహాయిస్తే జిల్లాలో టీడీపీ, బీజేపీ మాత్రమే ప్రాదేశిక ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రాదేశిక సభ్యులు, నేతలు లక్ష్యంగా చేరికల వ్యూహానికి పదును పెడుతోంది. త్వరలో జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో 64 మండల పరిషత్లకు గాను 20కి పైగా మండల పరిషత్లలో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం దక్కలేదు. ప్రాదేశిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అటు జిల్లా, ఇటు మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేలా వ్యూహ రచన చేస్తోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కనీసం 33 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్ఎస్కు 25 మంది సభ్యులున్నారు. దీంతో తొమ్మిది మంది సభ్యుల బలమున్న టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ వైపు టీడీపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆ పార్టీ సభ్యులను పార్టీలో చేరేలా పావులు కదుపుతోంది. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి నుంచి గెలుపొందిన ఓ టీడీపీ జడ్పీటీసీ సభ్యుడి మద్దతు కూడగట్టుకునే యోచన కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో గెలుపొందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులను మినహాయిస్తే మిగతా ఐదుగురు టీడీపీ సభ్యులను పార్టీ గొడుగుకు రప్పించే వ్యూహంతో వున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతలను ఆకర్షించే బాధ్యతను పార్టీకి చెందిన కీలక నేతకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ‘దేశం’ సభ్యుల పక్కచూపు జిల్లాలో 982 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు గాను కాంగ్రెస్ 367, టీఆర్ఎస్ 298, టీడీపీ 178, బీజేపీ 69, సీపీఐ మూడు, సీపీఎం నాలుగు, స్వతంత్రులు 63 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ సొంతంగా 28 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో సంఖ్యా పరంగా టీఆర్ఎస్ రెండో స్థానంలో వున్నా చాలా చోట్ల సొంత బలంపై ఆధార పడి అధ్యక్ష పదవులు దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను ఆకర్షించడం ద్వారా మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా తయారైన పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన చోట టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చే యోచన టీడీపీ సభ్యుల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి దూరంగా వుంటే అభివృద్ధి నిధులు దక్కవనే భావన కూడా టీడీపీ ఎంపీటీసీ సభ్యుల్లో కనిపిస్తోంది. కొడంగల్, నారాయణపేట, వనపర్తి, మక్తల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకుండా పోయింది. పార్టీ పరంగా తమను పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో ఇతర పార్టీల వైపు టీడీపీ శ్రేణులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ పరిస్థితిని ఆసరాగా చేసుకుని జిల్లా, మండల పరిషత్ అధ్యక్ష పదవులపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది -
జి.కొండూరులో వైఎస్సార్ సీపీ హవా
జి.కొండూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. దివంగత శాసనసభ్యుడు చనమోలు వెంకట్రావ్ సొంత మండలమైన జి.కొండూరు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఇదే నేపధ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహానేత మరణానంతరం నిలిచిపోయిన సంక్షేమ పథకాలు,పాలన తీరుపై అప్పటివరకు పార్టీకి వెన్నుదన్నులా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. ఈ క్రమంలో మహానేత వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమవుతాయని భావించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు వేలాది సంఖ్యలో ఆయా పార్టీలను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో బలోపేతంగా మారింది. దీనికి తోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పులిపాక థామస్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దగ్గుమళ్లి భారతి, కోణా భిక్షమేశ్వరరావు, వెల్లటూరు గ్రామ మాజీ సర్పంచి జీఎన్ఎం.కృష్ణ ప్రసాద్,దేశం సుధాకర్ రెడ్డి,ఈలప్రోలు వెంకటేశ్వరరావు,పామర్తి శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి అదనపు బలం పెరిగింది. దీంతోపాటు ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్న జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పామర్తి వెంకటనారాయణ,వేమిరెడ్డి వెంకటరెడ్డి,వేమిరెడ్డి పుల్లారెడ్డి,సంఘి రెడ్డి,చెరుకూరి శ్రీనివాసరావు లతో పాటు కొత్తగా వచ్చిన పార్టీ నాయకులు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో నియోజకవర్గంలో మిగిలిన మండలాలకు భిన్నంగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. ఇదే తరహాలో రానున్న అసెంబ్లీ ,పార్లమెంట్ ఫలితాలు కూడ వస్తాయని పార్టీ అభిమానులు భావిస్తున్నారు. అత్యధిక స్థానాలు కైవసం మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా అందులో 11 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీపీ అభ్యర్థిగా జి.కొండూరు-2 స్థానం నుంచి బరిలో ఉన్న వేములకొండ సాంబశివరావు సమీప టీడీపీ అభ్యర్థి ఉయ్యూరు నరసింహారావుపై 395 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండల పరిషత్లు వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునా పులిపాక థామస్ రెండు సార్లు,లంకా శ్రీ గౌరి దేవి ఒక సారి కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉయ్యూరు నరసింహారావు ఒక సారి మాత్రమే ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. జెడ్పీటీసీ అభ్యర్థి బ్రహ్మయ్యకు అత్యధిక మెజార్టీ జి.కొండూరు మండల జెడ్పీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న కాజా బ్రహ్మయ్య కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న మిగిలిన మండలాల్లో జెడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకున్నా జి.కొండూరులో మాత్రం వైఎస్సాఆర్ సీపీ హవా కొనసాగింది. పార్టీ అభ్యర్థి కాజా బ్రహ్మయ్య సమీప టీడీపీ అభ్యర్థి ఆలూరి రాజబాబుపై 951 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాజా బ్రహ్మయ్య సతీమణి కాజా సంధ్యారాణి గడిచిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా కొన సాగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దీంతోపాటు చనమోలు అనుయాయుడిగా కొనసాగిన కాజా బ్రహ్మయ్య మండలంలో ఉన్న నాయకులు,కార్యకర్తలతో సంబంధాలు ఉండడం,గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ కలిసిరావడంతో కాజా గెలుపు సునాయాసమైంది. ఇప్పటివరకు మండల జెడ్పీటీసీ పదవుల్లో టీడీపీ నుంచి దొప్పల మురళి ఒకసారి, కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుమళ్లి భారతి ఒకసారి, జోగి వెంకటేశ్వరరావు ఒకసారి కొనసాగారు. ఎంపీటీసీ విజేతలు వీరే జి.కొండూరు-2 స్థానం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేములకొండ సాంబశివరావు, గంగినేని నుంచి పిల్లి వెంకటేశ్వరరావు,చెరువుమాధవరం నుంచి మండల సుమలత, జి.కొండూరు-1 నుంచి వేములకొండ శైలజ, చెవుటూరు నుంచి పుప్పాల సుబ్బారావు, వెంకటాపురం నుంచి యరమల విజయశ్రీ, వెల్లటూరు-1 నుంచి చింతపల్లి పద్మావతి, వెల్లటూరు-2 నుంచి మారాసి కోటయ్య, కందులపాడు నుంచి వేములకొండ తిరుపతి రావు, వెలగలేరు నుంచి పోలుదాసు వెంకటలక్ష్మీ, కవులూరు-2 నుంచి గుణదల వెంకటేశ్వరరావు విజయం సాధించారు. -
నేడే.. పల్లె ఫలితాలు
మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఒక టేబుల్లో ఓ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఒక్కో రూములో ఆరు టేబుళ్లు మధ్యాహ్నంలోపు ఎంపీటీసీ ఫలితాలు సాయంత్రానికల్లా జెడ్పీటీసీ ఫలితాలు కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ మాల్యాద్రి కడప : ప్రతిష్టాత్మకంగా సాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఉత్కంఠతకు మంగళవారంతో తెరపడనుంది. జిల్లాలో రెండు విడతల్లో ఏప్రిల్ 6, 11 తేదీల్లో 535 ఎంపీటీసీ స్థానాలు, 50 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ బరిలో 1695 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ బరిలో 237 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజంపేట డివిజన్కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్ లెక్కింపు కేశవరెడ్డి స్కూలులో, జమ్మలమడుగు డివిజన్ లెక్కింపు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 మండలాలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలలో 50 రూములలో ఒక్కొక్క రూముకు ఆరు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎంపీటీసీ ఫలితాల లెక్కింపును ఒక్కో టేబుల్పైన చేపడతారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఒక్కో రౌండ్కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రంలోగా రానున్నాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రాలకు ఆరు గంటల్లోపే బాక్సుల తరలింపు కొత్త కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూములో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను భద్రపరిచారు. వీటిని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్వోల నేతృత్వంలో ఉదయం 3 నుంచి ఆర్టీసీ డీజీటీల ద్వారా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు చేరుస్తారు. వీటిని తరలించే సమయంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ ఏజెంటుతోపాటు అభ్యర్థినిమాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి ఆర్వో వద్ద ఉంటే కౌంటింగ్ సరళిని ఏజెంటు పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తోపాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 400 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు. 2200 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. కడప డివిజన్కు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తమ సిబ్బందితో మూడు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. లెక్కింపు సందర్బంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సంబంధిత డీఎస్పీలతో బందోబస్తుపై చర్చించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వసతులపై సిబ్బందితో ఆరా తీశారు. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్రెడ్డితోపాటు సంబంధిత మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్వోలు పర్యవేక్షిస్తారు. -
లెక్కల్లో పార్టీలు..!
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఈ నెల నాలుగైదు తేదీల వరకు ఫైనల్ లిస్టును ప్రకటించి ...నామినేషన్ల దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తగిన ప్లానుతో ముందుకు సాగుతున్నాయి.అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ూడా పూర్తి కాగలవని భావిస్తున్నారు. ల్లాలోని రెండు లోక్సభ, 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4 లేదా 5న అధికారికంగా ప్రకటించాని యోచిస్తోంది.సీపీఐతో సీట్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ సంఖ్యాపరంగా సీట్లను ఫైనల్ చేసినప్పటికీ నియోజక వర్గాల చిక్కు ముడి వీడక పోవటం వల్ల అధికారికంగా వెల్లడించలేక పోతున్నారు.ఒకటి, రెండు రోజుల్లో ఈ చిక్కముడి విడిపోగలదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.సీపీఐ మాత్రం సర్దుబాటులో భాగంగా నాగరుకర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిప్రాదించినట్టుగా చెప్పుతుండగా...ఈ జిల్లానుంచి ఏమి ఉండక పోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ, బీజెపీ ల మధ్య కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఒక వేళ జరిగితే బీజెపీ జిల్లా నుంచి మహబూబ్నగర్ లోక్సభతో పాటు మహబూబ్నగర్,నాగరుకర్నూల్,నారాయణపేట,కల్వకుర్తి, కొడంగల్, మక్తల్ అసెంబ్లీ స్థానాలు ప్రతి ప్రాదించినట్టు తెలుస్తోంది. జిల్లా విషయానికి వస్తే ఈ స్థానాలపైనే చర్చజరుగుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.టీడీపీ కూడా ఈ సీట్లల్లో ఒకటి, రెండు అటో,ఇటో అన్నరీతిలో చర్చలు సాగిస్తున్నట్టు భోగట్టా. సీపీఎం అభ్యర్థిగా జబ్బార్..: సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న సీపీఎం ...జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా జబ్బార్ ను ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు.కొల్లాపూర్ సీపీఎం డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జబ్బార్ పానుగల్ మండలం రేమొద్దుల గ్రామ సర్పంచిగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం తేల్చింది. 1,096 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక స్థానం ఏకగ్రీవం అరుు్యంది. ఖమ్మం జిల్లాలోని కుక్కనూరు, వేలేర్పాడు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 1,093 స్థానాల్లో పోటీ జరుగ నుంది. ఈ స్థానాలకు 5,034 మంది పోటీ పడుతున్నారు. 16,589 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా, అందులో 331 సీట్లల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్రులు 105, టీడీపీ 102, వైఎస్సార్ కాంగ్రెస్ 70, కాంగ్రెస్ 31, టీఆర్ఎస్ 15, సీపీఎం 4, సీపీఐ 2, బీజే పీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ఏకగ్రీవమయ్యూరుు. ఖమ్మం జిల్లా కుక్కనూరులో 8, వేలేర్పాడులో 7 ఎంపీటీసీ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 16,243 స్థానాలకు 52,568 మంది రంగంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలు, విశాఖపట్నం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement