-
వైతాళికుల ప్రస్థానం ఎటు?
జాతీయ పోరాట స్ఫూర్తి సంకలనంగా తెలుగు సాహిత్యంలో నిలబడే బంగారు అవకాశం ఉండి కూడా, ఎదగని సంకలనం ‘వైతాళికులు’. ఒక సంకలనం చేసేటప్పుడు సంకలనకర్త దృక్పథం కీలకం. ఇప్పటికి పన్నెండు ముద్రణలు పొందిన వైతాళికులు, ముద్దుకృష్ణ సంకలనకర్తగా 1935లో వచ్చింది. ముగ్గురు స్త్రీలతో సహా, 29 మంది కవుల 191 కవితలున్నాయిందులో. సంకలిత కవితల కాలం 1910 నుంచి 1934 వరకూ ఇరవై నాలుగేళ్ళు. తొలి కవిత రాయప్రోలు సుబ్బారావుది, రెండోది గురజాడది, ఆఖరుది శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’. వైతాళికులు అంటే ‘మేలుకొలుపువారు’ అని నిఘంటు అర్థం. ఏ యుగానికి, ఏ శకానికి ఇది కవితల మేలుకొలుపు? ఆ వైతాళిక కవులెవరు అన్న పరిశీలనాయుత ప్రశ్నలతో ఈ 84 ఏళ్ల సంకలనాన్ని చూడాలి. ఏ సంకలనమైనా, సమకాలాన్ని ప్రతిఫలించే సమదర్శన ధర్మంతో ఉండటం తప్పనిసరి. అదే సంకలన స్థాయిని సూచిస్తుంది. 1910 –35 దేశం మొత్తంలోనే గాంధీ నడుపుతున్న స్వాతంత్య్రోద్యమ కాలం కనుక అప్పటి తెలుగు సంఘ స్థితిగతులకు అద్దంగా ఉందా ఈ సంకలనం? భిన్నభాషల్లో, ఉపఖండం నలుమూలలా జాతీయోద్యమ సాహిత్యం ముమ్మరంగా వస్తున్న రోజులవి. చంపారన్ రైతు సమస్యలలో గాంధీజీ విజయాలు, జలియన్ వాలా బాగ్, 1920లో తిలక్ కన్ను మూశాక, కాంగ్రెస్ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమం, తెలుగునాట కూడా బావుటా ఎగురవేస్తూన్న ఒక దశాబ్దన్నర కాలపు కవిత్వ సృజన 1935 నాటికి సంకలనకర్త ఎదుట ఉన్నది. స్వాతంత్య్ర సముపార్జన, సాంఘిక సంస్కరణ లేదా పునర్నిర్మాణ శంఖారావాలు తెలుగు సమాజంలో ఘూర్ణిల్లుతున్నాయి. 1919లో మదరాసులో మొదలైన సాహితీసమితిలో తల్లావఝల శివశంకర శాస్త్రి సభాపతి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, ముద్దుకృష్ణ, తదితరులు ఇందులో ఉన్నారు. ప్రజల్లో ఉన్న స్వాతంత్య్రోద్యమ భావావేశాలు, కవుల్లో ఉన్న రచనాగరిమ బాగా తెలిసిన వీరు, వీరి మిత్రపుంగవులు ధార్మికావేశం, జాతి ఔన్నత్య భావనలు, భావకవిత్వోద్రేకం, ప్రణయభావ సంభరితం అయిన కవితలు రాసేవారు. ఆ కారణంగా ముద్దుకృష్ణ ఈ సంకలనం చేస్తున్నప్పుడు, ఇటువంటి కవితలన్నీ అందులో చేరాయి. 1935 – 36 దాకా ప్రోగ్రెసివ్ రైటర్స్ సభలు లండన్, లక్నోలలో జరుగలేదు. తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం 1942 దాకా ఏర్పడలేదు. అలా ఇరవయ్యో శతాబ్దంలో బహుశా తొలి తెలుగు కవితా సంకలనంగా ‘వైతాళికులు’ ఎంత విశాల బాధ్యత నిర్వర్తించింది? 1935లో విజయవాడ నుంచి తాను రాసిన మూడు పేజీల ముందుమాటలో, ‘నవయుగం’ అంటూ ఆఖరి మూడు పేరాలలో గాంధీ పేరు ఒక్కసారి ప్రస్తావించారు ముద్దుకృష్ణ. దేశ స్వేచ్ఛ కోసం తెలుగు కవులు రాసిన కవితలు సంకలనంలో ఒక్కటైనా ఉండవు. దువ్వూరి రామిరెడ్డి ‘స్వాతంత్య్ర రథం’ అసలు నేల మీదికే రాకుండా అసంతృప్తినే కలిగిస్తుంది. జాతీయ పోరాట స్ఫూర్తి సంకలనంగా తెలుగు సాహిత్యంలో నిలబడే బంగారు అవకాశం ఉండి కూడా, ఎదగని సంకలనం ‘వైతాళికులు’. అంటరానితనంపై పోరాటం, స్త్రీ విద్య, బ్రిటిష్ పాలన లోపాలను విమర్శించే కవితలు, పాటల కవులు మంగిపూడి వెంకట శర్మ, గుర్రం జాషువా, శ్రీరంగం నారాయణబాబు ఎవరూ కనిపించరు. వేసిన కవుల కవితలే వేస్తూ, ఏకంగా కృష్ణశాస్త్రి ఇరవై కవితలు వేశారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్నే పక్కన పెట్టిన అసంగత సంకలనం ఇది. ‘గాంధీజీ 150’ దేశదేశాల్లో జరుగుతున్న సందర్భంలో ఉన్నాము. ఇందులోని 191 కవితల్లో, గరిమెళ్ళ ‘మాకొద్దీ తెల్లదొరతనం’, బసవరాజు అప్పారావు ‘కొల్లాయిగట్టితేనేమి’, 1930 ఉప్పు సత్యాగ్రహం తరువాతి త్రిపురనేని రామస్వామి గీతం ‘వీరగంధము తెచ్చినారము’ వేటికీ ఇందులో చోటు లేదు. తన భావ కవిత్వ ఖండికలు వేసి, ఉప్పు సత్యాగ్రహం సమయంలో బసవరాజు అప్పారావు రాసిన ‘స్వరాజ్యలక్ష్మి పెండ్లి’ (సంద్రమే పెళ్లిల్లంట, సదస్యులే దేవతలంట, ఉప్పే తలంబ్రాలంట స్వరాజ్య లక్ష్మి పెండ్లికి) కూడా విడిచిపెట్టారు. ఇలా ‘వైతాళికులు’ నవయుగాన్ని పట్టించుకోలేదు. కేవలం భావ కవిత్వ ఉదాహరణగా మిగిలిపోయింది. ‘వైతాళికులు’ అని పేరు పెట్టకున్నా, ముందుమాటలో సాహిత్యంలో నవయుగ ప్రస్తావనలు చేయకున్నా, ముద్దుకృష్ణకు ఈ అపఖ్యాతి మిగిలేది కాదు. -రామతీర్థ -
శభాష్ ముద్దుకృష్ణ
♦ ఏటీఎంలో అదనంగా వచ్చిన సొమ్మును పోలీసులకిచ్చాడు ♦ యువకుని నిజాయితీని మెచ్చుకున్న సీఐ పలమనేరు: తనకు ఏటీఎంలో అదనంగా అందిన నగదును పోలీసులకిచ్చి నిజాయితీని చాటుకున్నాడు ఓ యువకుడు. పలమనేరు పట్టణంలోని రాధాబంగ్లాకు చెందిన ముద్దుకృష్ణ మంగళవారం ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో తన ఖాతాలో నుంచి రూ.500ను డ్రా చేశాడు. అయితే అతనికి రూ.16,500 వచ్చింది. తన ఖాతాలో మొత్తం నగదు రూ.632 ఉండగా అంత డబ్బుఎలా వచ్చిందో అర్థం కాలేదు. అంతకుముందు డ్రాచేసిన వారి డబ్బు తనకు వచ్చిందని తెలుసుకున్నాడు. దీంతో నేరుగా పోలీస్స్టేషన్కొచ్చి జరిగిన విషయాన్ని సీఐ సురేందర్ రెడ్డికి తెలిపారు. యువకుని నిజాయితీని సీఐ మెచ్చుకున్నారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. నగదు పోగొట్టుకున్న బాధితుని వివరాలను బ్యాంకు అధికారులు సేకరించాక డబ్బును అందిస్తామని సీఐ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement