-
Napalm girl: మానని గాయంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది
తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట. ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది. ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు. -
విమర్శలతో దిగొచ్చిన ఫేస్బుక్
న్యూయార్క్ : నాపలామ్ బాలిక ఫోటోగ్రాఫ్ తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. తనపై వచ్చిన పలు విమర్శలతో ఫేస్బుక్ యూటర్న్ తీసుకుని, తొలగించిన ఆ ఫోటోను తిరిగి పోస్టు చేయడానికి అంగీకరించింది. 1972లో వియత్నాం యుద్ధ సమయంలో నాపలమ్పై దాడి జరుగుతున్నప్పుడు ఓ చిన్నారి ఏడుస్తూ నగ్నంగా పరుగెట్టుకుంటూ వెళ్తున్న ఫోటో ఫేస్బుక్లో పోస్టు అయింది. యుద్ధ తీవ్రతను తెలుపుతూ నాపలమ్ దాడికి సంబంధించిన ఈ ఫోటోను పులిట్జర్ బహుమతి గ్రహీత, నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ తన ఫేస్బుక్లో పోస్టుచేశారు. అయితే ఈ ఫోటో తన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ తొలగించింది. ఇదే ఫోటోను నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ కూడా పోస్టుచేశారు. కానీ దాని కూడా ఫేస్బుక్ తొలగించింది. దీంతో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమై, ఫేస్బుక్ పలు విమర్శలకు గురైంది. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ ఫోటోను తొలగించడంపై పలువురు మండిపడ్డారు. ఫేస్బుక్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు నార్వే అతిపెద్ద న్యూస్ పేపర్ ఎడిటర్ బహిరంగ లేఖ రాశారు. దీంతో తనపై వస్తున్న విమర్శలతో ఫేస్బుక్ దిగొచ్చింది. నగ్నంగా ఉన్న బాలిక ఫోటో తమ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తుందనే నేపథ్యంలోనే తొలగించామని ఫేస్బుక్ తన ప్రకటనలో తెలిపింది. తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది.చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది.తొలగించిన చోటే దానిని తిరిగి పోస్టు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కొంత సమయం కావాలని ఫేస్బుక్ అభ్యర్థించింది. తమ విధానాలను మెరుగుపరుచుకుంటామని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు తోడ్పడతామని, తమ కమ్యూనిటీ రక్షణకు దోహదం చేస్తామని తెలిపింది. అయితే ఫేస్బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ప్రధాని సోల్బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement