-
‘దెబ్బకు దెబ్బ.. నీ పిల్లల్నీ చంపేస్తా..!’
న్యూయార్క్: నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేయడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ చీఫ్పై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నీ కుటుంబాన్ని అంతం చేస్తాన’ని నిందితుడు ఎఫ్సీసీ చీఫ్ అజిత్పాయ్ను బెదిరించాడు. ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, దానికి బాధ్యుడు అజిత్ పాయ్ అని ఆరోపించాడు. అందుకనే ప్రతికారంగా అజిత్ పిల్లలను అంతమొందిస్తానని ఈ మెయిల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై వైట్హౌస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. నేపథ్యం: ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలపై తటస్థంగా (నెట్ న్యూట్రాలిటీ) వ్యహరించిన ఎఫ్సీసీ ఆ విధానానికి జూన్లో స్వస్తి పలికింది. ఎఫ్సీసీ ప్రతిపాదన మేరకు నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా కాంగ్రెస్ తీర్మానం చేసింది. అయితే, నెట్ న్యూట్రాలిటీని రద్దు చేయడంతో అమెరికా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనీ, ఇది వినియోగదారులపై ఆర్థిక భారం మోపనుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వెబ్సైట్ల మనుగడను ప్రశ్నార్థకం చేసే నెట్ న్యూట్రాలిటీ రద్దుపై ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు ప్రజల్ని రెచ్చగొడుతూ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన మర్కాన్ మన్ మాత్రం.. కేవలం ఎఫ్సీసీ చీఫ్ అజిత్ పాయ్ వల్లనే నెట్ న్యూట్రాలిటీ విధానం రద్దయిందనీ, అందుకే అతనిపై పగ తీర్చుకుంటానని హెచ్చరించాడు. -
తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు
► ఫేస్బుక్కు చుక్కెదురు.. ► వెబ్సైటుకో రేటు కుదరదు ► టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టీకరణ ► చూసే వెబ్సైట్లను బట్టి చార్జీలు మార్చొద్దు ► ఇంటర్నెట్ అందరికీ న్యూట్రల్గానే ఉండాలి ► కొన్ని సైట్లే ఫ్రీగా ఇస్తామన్న ఫేస్బుక్కు ఎదురుదెబ్బ ► ఫ్రీ బేసిక్స్తో పాటు ‘ఎయిర్టెల్ జీరో’కూ షాక్ ► నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు కనిష్టంగా రూ.50,000 జరిమానా ► గరిష్టంగా రూ.50 లక్షల వరకూ వసూలు ఫ్రీ బేసిక్స్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్సైట్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా ఇస్తానంటూ వందల కోట్ల రూపాయలతో ప్రచారం ఊదరగొట్టిన ‘ఫేస్బుక్’కు గట్టి దెబ్బ తగిలింది. ఫేస్బుక్తో జతకట్టిన రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు... ‘జీరో’ పేరిట కొన్ని వెబ్సైట్లు చూస్తే డేటా చార్జీలు ఉండవంటూ మినహాయించిన ఎయిర్టెల్కు కూడా షాక్ తగిలింది. దేశంలో ఇంటర్నెట్ సర్వీసులందించే ఏ సంస్థ కూడా.. కంటెంట్ (వెబ్సైట్లు) ఆధారంగా చార్జీల్లో ఎక్కువ తక్కువ వసూలు చేయకూడదని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) స్పష్టం చేసింది. అంటే ఇప్పటి మాదిరిగా ఏ సంస్థ అయినా తానందించే ఇంటర్నెట్ స్పీడు ఆధారంగా మాత్రమే రకరకాల చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే నిర్దిష్ట స్పీడుతో కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు ఆ పరిధిలో ఏ వెబ్సైట్ను చూసినా అవే చార్జీలు చెల్లిస్తాడు. అంతేతప్ప ఫేస్బుక్, వాట్సాప్లు మాత్రమే ఫ్రీగా ఇస్తామంటే కుదరదు. ఇదీ ట్రాయ్ స్పష్టం చేసిన నెట్న్యూట్రాలిటీ.. న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలకు సంబంధించి దుమారం రేపిన నెట్ న్యూట్రాలిటీ వివాదానికి ట్రాయ్ తెరదింపింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని టెలికం కంపెనీలకు తేల్చి చెప్పింది. ఈ నిబంధన పాటించని పక్షంలో, ఎన్నాళ్లు ఉల్లంఘిస్తే అన్ని రోజులూ రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. డేటా సేవలకు సంబంధించి వివక్షాపూరిత టారిఫ్లను నిషేధిస్తూ రూపొందించిన 2016 నిబంధనావళిని సోమవారం ఢిల్లీలో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్నెట్లో లభించే దేనికీ వివిధ రకాల టారిఫ్లు ఉండకూడదన్నది తమ ఉద్దేశమని, నిబంధనల్లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశామని ఆయన తెలిపారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించే పథకాలను ఆరు నెలల్లోగా కంపెనీలు ఉపసంహరించుకోవాలని శర్మ స్పష్టం చేశారు. ‘‘కంటెంట్ను బట్టి డేటా సేవలకు రకరకాలుగా చార్జీలు విధించేలా ఇంటర్నెట్ కంపెనీలతో టెలికం సర్వీసు ప్రొవైడర్లు ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు. అయితే, అత్యవసర సర్వీసులకు ఉపయోగపడే వాటి విషయంలో మాత్రం సర్వీసు ప్రొవైడర్లు కొంత టారిఫ్ను తగ్గించవచ్చు. ఈ ఎమర్జెన్సీ సర్వీసులు ఏమిటనేది కూడా మేం ప్రత్యేకంగా నిర్వచించలేం. ఇలాంటి వాటికి సంబంధించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లే మాకు ఏడు పనిదినాల్లోగా వివరాలివ్వాలి’’ అని శర్మ వివరించారు. ఫేస్బుక్, ఎయిర్టెల్కు ఎదురుదెబ్బ... ఇంటర్నెట్ ఆధారిత కాల్స్కు వేరుగా చార్జీలు వసూలు చేయాలని 2014 డిసెంబర్లో ఎయిర్టెల్ నిర్ణయించడంతో నెట్ న్యూట్రాలిటీపై వివాదం రేగింది. అప్పటికి ఎయిర్టెల్ వెనక్కి తగ్గింది. ఆపై సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’... ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్సైట్లను ఫ్రీగా ఇస్తానంటూ ముందుకొచ్చింది. దాంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ జతకట్టింది. ‘అవసరమైన’ కొన్ని వెబ్సైట్లను ఫ్రీగా ఇవ్వటం వల్ల అందరికీ ఇంటర్నెట్ అందుతుందని, ఇంటర్నెట్కు అలవాటు పడతారు కనక తరవాత వారు పెయిడ్ వినియోగదారులుగా మారతారని ఫేస్బుక్ ప్రచారం చేసింది. ఒకవంక అందరికీ అలవాటు చేయటానికే ఇలా ఫ్రీగా ఇస్తున్నట్లు చెబుతూ... మరోవంక దేశంలో చాలా మంది ఇంటర్నెట్కు డబ్బులు ఖర్చుచేసే స్థితిలో లేరని, వారికోసమే ఇలా ఫ్రీగా ఇస్తున్నామని కూడా ప్రచారం చేసింది. అసలుకివి రెండూ ఒకదానితో ఒకటి పొసగని వాదనలు. వాస్తవానికైతే ఫేస్బుక్ తనకు నచ్చిన, తన నిబంధనలకు అంగీకరించిన అతికొద్ది సైట్లను అందరికీ ఫ్రీగా ఇవ్వటం ద్వారా... మిగిలిన సైట్లు ఎవ్వరూ చూడకుండా చేసి, ఇంటర్నెట్పై గుత్తాధిపత్యం సంపాదించటానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై నిరసనలు రేగటంతో ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. ఆ తరవాత ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఇంటర్నెట్.ఆర్గ్ అనే కొత్త పేరుతో మరోసారి తెరపైకి తెచ్చింది. దానికోసం వందల కోట్ల రూపాయలతో మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఫ్రీబేసిక్స్ వ్యతిరేకులను విమర్శిస్తూ.. ఫేస్బుక్ తమకు మద్దతునివ్వాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించింది. ఫ్రీ బేసిక్స్కు మద్దతిస్తున్నట్లుగా ఫేస్బుక్ వాడకందార్లచేత ట్రాయ్కి మెసేజీలు కూడా పంపించింది. ట్రాయ్కి వచ్చిన 24 లక్షల కామెంట్లలో అత్యధికం ఫ్రీబేసిక్స్కు మద్దతుగానే ఉన్నాయి. ఇదంతా చూసిన ట్రాయ్... తాను నెట్ న్యూట్రాలిటీపై జనాన్ని అభిప్రాయం అడిగానని, వాళ్లంతా ఫ్రీబేసిక్స్కు మద్దతుగా సందేశాలెందుకు ఇస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. చివరకు తాజా నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలపై ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘‘ఫ్రీ బేసిక్స్తో మరింత మందికి ఇంటర్నెట్ను చేరువ చేయాలన్నదే మా లక్ష్యం. కానీ ట్రాయ్ నిబంధనలు మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేశాయి’’ అన్నారు. ఇంటర్నెట్ విస్తృతికి తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ఎయిర్టెల్ది కూడా ఇలాంటి వ్యవహారమే. ఎయిర్టెల్ జీరో పేరిట ఇపుడు కొన్ని వెబ్సైట్లతో కూడిన ప్యాకేజీని చౌకగా అందిస్తోంది. తానే కొన్ని మ్యూజిక్ యాప్లు విడుదల చేసి... వాటిలో డౌన్లోడ్లకు తక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఇవన్నీ ట్రాయ్ నిర్ణయంతో వెనక్కి పోనున్నాయి. టెలికం కంపెనీలు ట్రాయ్ నిబంధనలపై స్పందిస్తూ... స్వేచ్ఛా విపణిలో తమ హక్కులపై దాడిగా దీన్ని వర్ణించాయి. ఇది దేశవ్యాప్తంగా నెట్ కనెక్టివిటీ విస్తృతికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నాయి. అసలు నెట్ న్యూట్రాలిటీకి నిర్వచనం ఇవ్వకుండా ట్రాయ్ నిర్దిష్ట పథకాలను పూర్తిగా నిషేధించడం సరికాదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్ల తర్వాత సమీక్ష.. స్వభావాన్ని బట్టి కొన్ని ప్రత్యేక పథకాలకు అనుమతి ఇవ్వవచ్చన్న టెలికం విభాగ అధికారుల కమిటీ సూచనలను కూడా ట్రాయ్ తోసిపుచ్చింది. టెల్కోలు సొంతంగా తమ కస్టమర్లకు మూవీ, మ్యూజిక్ యాప్స్ మొదలైన వాటిని తక్కువ రేట్లకే అందిస్తున్నాయి. దీనిపై స్పందించిన శర్మ... ‘‘నెట్పై అందుబాటులో ఉండే దేనికీ కూడా వివిధ రకాల చార్జీలు ఉండకూడదు. ఇంటర్నెట్లో ఏదైనా ఉచితంగా లభిస్తుంటే ఉచితంగానూ, చార్జీలు వర్తిస్తే చార్జీలు విధించేలాగానే నెట్ సర్వీసులుండాలి. తారతమ్యం ఉండకూడదు. ఈ నిబంధనలను రెండేళ్ల తర్వాత లేదా టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో అవసరమైతే అంతకన్నా ముందైనా సమీక్షించే అవకాశం ఉంది’’ అని శర్మ తెలియజేశారు. న్యూట్రాలిటీ మద్దతుదారుల హర్షం.. ట్రాయ్ నిర్ణయాన్ని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఐఏఎంఏఐ, తదితర పరిశ్రమ వర్గాలతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు స్వాగతించారు. ఇది భారత్లోని ఇంటర్నెట్ యూజర్ల ఘన విజయమని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిబంధనలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మరోవైపు, ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకుందని సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్ ఈడీ మిశి చౌదరి పేర్కొన్నారు. -
ఫేస్బుక్కు భారీ ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పుల్ స్టాప్ పెట్టింది. వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ మేరకు ట్రాయ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎయిర్టెల్ జీరో, ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద ఎదురుదెబ్బ కానున్నాయి. గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్బుక్ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా.. ఈ పథకాన్ని కాపాడాలంటూ తన సోషల్ మీడియా సైట్లో నెటిజన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రచారం ద్వారా ఫ్రీ బేసిక్స్ విషయంలో ఏకంగా ట్రాయ్తో ఫేస్బుక్ అమీతుమీకి దిగింది. అయినప్పటికీ వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా డాటా చార్జీలు ఉండాలన్న ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. ఈ విషయంలో డాటా చార్జీల్లో వివక్ష చూపుతూ ఏ మొబైల్ ఆపరేటర్ అయినా ముందస్తు ఒప్పందం చేసుకుంటే తీవ్ర చర్యలు తప్పవని ట్రాయ్ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సమానత్వానికి ఇది వ్యతిరేకమని, 'ఫ్రీ బేసిక్స్' పేరిట ఇంటర్నెట్ సేవలపై గుత్తాధిపత్యానికి ఫేస్బుక్ ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
Advertisement