-
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్డీఎఫ్సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్డీఎఫ్సీకి నిఫ్టీ ఇండెక్స్లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
10,000 ముంగిట నిఫ్టీ
♦ కొద్ది క్షణాల్లో మళ్లీ కిందకు ♦ సెన్సెక్స్ మరో కొత్త హై ♦ స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు • 1000 1996 సంవత్సరం • 2000 డిసెంబర్ 2, 2004 • 3000 జనవరి 30, 2006 • 4000 డిసెంబర్ 1, 2006 • 5000 సెప్టెంబర్ 27, 2007 • 6000 డిసెంబర్ 11, 2007 • 7000 మే 12, 2014 • 8000 సెప్టెంబర్ 1, 2014 • 9000 మార్చి 14, 2017 ముంబై: కొద్ది వారాల నుంచి ఇన్వెస్టర్లను ఊరిస్తూవచ్చిన చరిత్రాత్మక 10,000 పాయింట్ల స్థాయిని ఎన్ఎస్ఈ నిఫ్టీ–50 సూచీ ఎట్టకేలకు మంగళవారం అందుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో 10,010 పాయింట్ల రికార్డును సృష్టించిన నిఫ్టీ కొద్ది క్షణాల్లోనే, ఆ స్థాయి నుంచి దిగువకు జారిపోయింది. ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూచూడని స్థాయికి సూచీ చేరగానే లాభాల స్వీకరణ జరగడంతో 9,949 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 1.85 పాయింట్ల స్వల్పనష్టంతో 9,964.55 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ కూడా ట్రేడింగ్ ప్రారంభంలో 32,374 పాయింట్ల కొత్త గరిష్టస్థాయిని చేరింది. ఈ సూచీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 32,228 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కొన్ని బ్లూచిప్ కంపెనీలు మార్కెట్ అంచనాలకంటే మెరుగైన ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్లోకి నిధులు కుమ్మరించడంతో నిఫ్టీ చరిత్ర సృష్టించగలిగిందని విశ్లేషకులు తెలిపారు. బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నందున, మార్కెట్లో చిన్నపాటి కరెక్షన్ జరిగినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ రికార్డు... ప్రధాన సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కొద్దిరోజుల నుంచి ఏరోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పుతున్న బ్యాంక్ నిఫ్టీ మంగళవారం మరో నూతన గరిష్టస్థాయి 24,625 పాయింట్ల స్థాయికి చేరింది. ట్రేడింగ్ ముగింపులో కూడా ఈ సూచీ 100 పాయింట్ల లాభంతో (0.41 శాతం) 24,520 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీలో భాగమైన యాక్సిస్ బ్యాంక్ 1.94 శాతం పెరిగి రూ. 545 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 1,759 వరకూ ర్యాలీ జరిపిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరకు స్వల్పలాభంతో రూ. 1,739 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్, ఎస్బీఐలు కూడా స్వల్ప పెరుగుదలతో బ్యాంక్ నిఫ్టీ లాభాలతో ముగియడానికి కారణమయ్యాయి. టెలికం షేర్లు జూమ్... స్పెక్ట్రం ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం..టెలికం కంపెనీలకు మరింత సమయం ఇవ్వనున్నదన్న వార్తలతో టెలికం షేర్లు జోరుగా పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 1.76 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 428 వద్ద ముగిసింది. ఐడియా సెల్యులార్ షేరు 6 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 97.70 వద్ద క్లోజయ్యింది. అలాగే వరుసగా రెండోరోజు ర్యాలీచేసిన టీసీఎస్ మరో 1.5 శాతం పెరుగుదలతో రూ. 2,570 వద్ద క్లోజయ్యింది. మెటల్స్ దిగ్గజం వేదాంత ఆకర్షణీయమైన ఫలితాల్ని ప్రకటించడంతో 4 శాతంపైగా పెరగ్గా, అల్యూమినియం తయారీ కంపెనీ హిందాల్కో 2 శాతంపైగా ఎగిసింది. 21 సంవత్సరాల్లో 900 శాతం 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ప్రస్థానం మొదలయ్యింది. 1993లో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొంది 1994లో క్యాష్ సెగ్మెంట్ను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టి ట్రేడింగ్ను సులభతరం చేసింది. అదే ఏడాదిలోనే డెట్ మార్కెట్లోకి ప్రవేశించింది. 1996లో నిఫ్టీ 50 సూచీని ప్రారంభించింది. 1,000 పాయింట్లను బేస్గా తీసుకుని 12 రంగాలకు చెందిన షేర్లతో సూచీని ప్రారంభించింది. నిఫ్టీ సూచీ ట్రేడ్కావడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 9 రెట్లు పెరిగింది. నిఫ్టీ ప్రస్థానం మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ... 21 సంవత్సరాల్లో 900 శాతం ర్యాలీ జరిపింది. ఈ 21 ఏళ్లలో చక్రగతిన 11.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. కాగా, ఈ ఏడాదిలోనే వరుసగా 9,000, 10,000 పాయింట్ల శిఖరాల్ని ఎన్ఎస్ఈ నిఫ్టీ అధిరోహించడం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement