-
ఇక్కడా... నో క్యాష్
ఇంట్లో చూస్తే నో మనీ.. ఏటీఎంలకు వెళ్తే ‘నో’ క్యాష్. బ్యాంకుకు వెళ్తే ‘నగదు’ పరిమితి. ఇలా ఎక్కడ విన్నా ... ఏ నోట విన్నా ఇదే మాట. పండుగపూట చేతిలో సొమ్ములు లేక నానాయాతన పడుతున్నారు. డబ్బుండీ బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశంలేక తలలు పట్టుకుంటున్నారు. నోట్ల రద్దయి ఏడాది దాటినా అదే పరిస్థితి పునరావృతమవడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ: పండుగపూట జిల్లా వాసులకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకుల్లోను, ఏటిఎంల్లో నగదు నిల్వలు అడుగంటిపోవడంతో డబ్బులకోసం నానాయాతన పడుతున్నారు. జిల్లాలో 815 ఏటిఎంలుండగా వీటిలో 75 శాతం మూతపడిపోగా కొద్దోగొప్పో నగదు నిల్వలున్న ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఓ వైపు పండుగ సందడి దగ్గరపడడం, మరో వైపు వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రావడం, తగినంతగా బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో అవస్థలుపడుతున్నారు. విత్డ్రాలు మాత్రమే... బ్యాంకుల నుంచి గడచిన వారం పది రోజుల్లో నగదు తీసుకువెళ్లడం మినహా ఏ ఒక్కరూ డిపాజిట్లు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రభావం పడింది. మరోవైపు కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ప్రకటన ప్రభావం కూడా ఈ సంక్షోభానికి కారణంగా బ్యాంకర్లు చెబుతున్నారు. నగదుపై పరిమితి జిల్లాలో సుమారు 750 వివిధ బ్యాంకు బ్రాంచీల ద్వారా నిత్యం రూ.600 నుంచి రూ.700 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఈ లావాదేవీలు 30 శాతానికి దిగజారిపోయాయని సమాచారం. దీని కారణంగా అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదుపై అనేక బ్రాంచీల్లో పరిమితులు కూడా పెట్టేశారు. ఒకప్పుడు నోట్ల రద్దు సమయంలో ఇచ్చినట్టుగా రోజుకి రూ.5 నుంచి రూ.20వేలు వరకు ఆయా బ్యాంకులు పరిమితి విధిస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. పండుగ ఎలా? బ్యాంకు వరుస సెలవులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో పండుగ ఎలా జరుపుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పండుగపూట ఇవేమి కష్టాలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పాం బ్యాంకుల్లో తగినంతగా నగదు నిల్వ లు లేవు. దీని కారణంగా ప్రజల అవసరాల మేరకు క్యాష్ అందివ్వలేకపోతున్నాం. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు తగినంతగా నగదు సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సమస్యను ఉన్నతాధికారులకు, ఆయా బ్యాంక్ యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్ళాం. – కె.ఆదినారాయణమూర్తి, సంయుక్తకార్యదర్శి, బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ -
చెలా‘మనీ’ లేక..
• బ్యాంకుల్లో డబ్బు లేక ప్రజల అవస్థలు • మధ్యాహ్నానికే ’నో మనీ’ అని • బోర్డులు తగిలిస్తున్న బ్యాంకులు • డీసీసీబీ పరిస్థితి తలకిందులు ఖమ్మం వ్యవసాయం : బ్యాంకుల్లో డబ్బు అందక చాలామంది నానాతంటాలు పడుతున్నారు. పలు చోట్ల భోజన సమయం తరువాత ’నోమనీ’ అనే బోర్డులు వేలాడుతున్నారుు. రోజుకు రూ.10 వేల చొప్పున డ్రా చేసుకునేందుకు గంటల తరబడి బ్యాంకుల్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. వరుసలో ముందున్న ఖాతాదారులకు డబ్బు దొరుకుతుండగా, 11 గంటల తర్వాత బ్యాంకులకు వచ్చే వారికి లైన్లో ఉన్నా భోజన సమయం వరకు కౌంటర్ను అందుకోలేక డబ్బు లభించటం లేదు. దీంతో సామాన్యులు, మధ్య తరగతి వారు, రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాల కోసం డబ్బు డ్రా చేసుకోవాలని ఏటీఎంలను ఆశ్రరుుంచినా, పలుచోట్ల అవి పనిచేయటం లేదు. ఎక్కడో ఒకటి అరకొరగా పనిచేస్తుంది. చెస్ట్ బ్యాంకులు ఉన్న బ్యాంక్ బ్రాంచిల వద్ద ఉన్న ఏటీఎంలు అంతంత మాత్రంగా పనిచేస్తున్నారుు. డీసీసీబీ బ్రాంచిల్లో పెద్దనోట్ల మార్పిడిని రద్దు చేయటంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తమ ఖాతాలు ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయని, తామ వద్ద ఉన్న పెద్దనోట్లను మార్పు చేసుకోవడం ఇబ్బందికరంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement