-
చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలి
నరసాపురం : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో డివిజన్లోని నీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో వేసవిలో నీటి సరఫరా అంశంపై ఆయన సమీక్షించారు. చెరువులను నింపుకోవడానికి ఈ నెల 25వ తేదీ నుంచి కాలువలకు నీరు వదలుతారని చెప్పారు. నరసాపురం డివిజన్లో చించినాడ, వడ్డిలంక, రాపాక, జిన్నూరు కాలువల పరిధిలో మంచినీటి చెరువులను పూర్తిగా నింపుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎం.అనంతరాజు మాట్లాడుతూ డివిజన్లో 69 తాగునీటి చెరువులు ఉన్నాయని అన్నారు. 25వ తేదీ నుంచి కాలువలకు నీరు పూర్తిస్థాయిలో విడుదల చేస్తున్న దృష్ట్యా అలసత్వం చూపించకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ డీఈ సీహెచ్ వెంకటనారాయణ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తమ శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు అండగా ఉంటాం : సీఎం
ఏలూరు(మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు గ్రామాలకు సంబంధించి నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. 22 వేల మంది నిర్వాసితులకు సంబంధించి వారి అంగీకారంతో అనువైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో ఒక్కొక్క కాలనీలో 5 వేల ఇళ్ల సముదాయం ఉండే విధంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, కేఎస్ జవహర్, ఇరిగేషన్ ఎస్ఈ రమేష్బాబు, స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, ఐటీడీఏ పీవో షాన్మోహన్, రంపచోడవరం పీవో దినేష్కుమార్ పాల్గొన్నారు. మా బాబే.. ఏం చెప్పావు..!? పోలవరం ప్రాజెక్టు. ప్రాజెక్టు ఉన్న ప్రాంతం మాత్రం పోలవరం నియోజకవర్గంలోనిది. ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చినా, ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినా పోలవరం నిర్వాసితులు రావాలి. పోలవరం నియోజకవర్గ ప్రజలు రావాలి. కానీ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నది, ముఖ్యమంత్రి హితబోధలు నేర్పింది మాత్రం దెందులూరు రైతులకు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు. సాక్షాత్తూ పోలవరం డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో రైతులు పామాయిల్ తోటలు పెంచుతారని, ఈ తోటల పెంపకంపై చూపే ఆసక్తి ఫామ్ఫాండ్స్పైనా చూపించాలని కోరారు. అంతేకాకుండా రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారా? అంటూ దెందులూరు రైతులనే ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యేవారితో ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు. ఇచ్చే నష్టపరిహారం అయినా, ప్యాకేజీ అయినా నిర్వాసితులకు సరిపోయిందా? అని ప్రశ్నించిన పాపాన పోలేదు. మరుగునపడిన మూలలంక పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డుగా ఉపయోగించే మూలలంక ప్రాంత రైతులు ఇటీవల నిరాహార దీక్షలు సైతం చేశారు. దెందులూరు నుంచి వచ్చిన రైతులను ప్రశ్నించారు తప్ప ప్రాజెక్టు సమీపంలో నష్టపోయే రైతులైన మూలలంక రైతులను ఏకోశాన పట్టించుకున్న పాపాన పోలేదు. -
ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు
ఏలూరు (మెట్రో) : రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లాలో విజ్ఞానాన్ని పెంచే ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడ నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖా మండల స్ధాయి అధికారుల వరకూ నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖా ప్రగతి తీరుపై సమీక్షించారు. కలెక్టరేట్లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఈ సెల్కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించి నూతన ఆలోచనా విధానాలు, కొత్త విషయాలను తెలుసుకుని వాటిని పది మందికి తెలియచేసి విజా›్ఞనాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఆ దిశగా అధికారులు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాని కలెక్టర్లను కోరారు. ప్రాధమిక విద్యా స్ధాయి నుండి యూనివర్శిటీ స్ధాయివరకూ ప్రతి ఒక్కరూ విద్యా రంగంలో కొత్త విధానాలను తీసుకురావాలని ప్రతి జిల్లానూ ఒక విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఇంక్యూబేషన్ సెంటరు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను వారానికోరోజు పల్లె ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ చెట్టులు నాటడం వాటి సంరక్షణా చర్యలు చేపట్టం నీటి నిల్వ వల్ల కలిగే లాభాలను పరిశుభ్ర కార్యక్రమాల వలన ఆరోగ్యం ఏ విధంగా పెంపొందుతుందో ప్రజలకు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాధమిక విద్యా స్ధాయి నుండే వృత్తి విద్యాకోర్సుల్లో అవగాహన పెంచే విద్యను అమలు చేస్తున్నామని 10వ తరగతి తరువాత ఏ ఉపాధి పొందాలో ఏ విద్య నేర్చుకోవాలో అవగాహన కలిగించాలని ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, డీఈఓ డీ.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్పీఓ వీ.బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
ఏలూరు (ఆర్ఆర్ పేట): తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టును దేశానికే ఆదర్శవంతంగా నిలిపే దిశగా జిల్లా యంత్రాంగం కషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్మార్ట్ పల్స్ సర్వే పూర్తవుతున్న తరుణంలో జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించుకుని సర్వేను అర్థవంతంగా నిర్వహించాలన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం దేశంలో మరో నాలుగు జిల్లాలతో పాటు పశ్చిమగోదావరిను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖలు నిర్వహిస్తున్న పలు రిజిస్టర్ల నిర్వాహణకు స్వస్తి పలికి ఆన్లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించదలిచామన్నారు. దేశంలో ఐదు జిల్లాలు 11 వేల అంగన్వాడీ కేంద్రాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇస్తారని, ప్రాజెక్ట్లో భాగంగా 55 వేల ట్యాబ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 60 రోజుల్లో పూర్తిచేస్తాం కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్ట్కు జిల్లా ఎంపిక కావడం ఆనందించదగిన విషయమని, 60 రోజుల్లో ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని చెప్పారు. ఐసీడీఎస్ పరిధిలో 18 ప్రాజెక్టులు, 46 బ్లాక్ల్లో 10 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి, కేంద్ర ప్రభుత్వ అధికారులుధర్మపాల్, ముష్రఫ్ ఫారూఖ్, కుల్వంత్సింగ్, యష్పాల్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ రాజశేఖరరెడ్డి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ సంజీవకుమార్, న్యూఢిల్లీ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్కుమార్, ఐటీ నిపుణులు రత్నాకర్, అనూష్గుప్తా, న్యూట్రిషన్ కన్సల్టెంట్ లక్ష్మి, శ్రీకాంత్, డీఎంహెచ్వో కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో ఆలస్యాన్ని సహించను
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మీ కోసం, మీ సేవ కార్యక్రమాల్లో ప్రజలకు సర్వీస్ చేసే విషయాల్లో ఒక్క రోజు ఆలస్యం చేసినా సహించేది లేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమంలో వచ్చే ప్రజాఫిర్యాదులు పరిష్కరించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, ఏ ఒక్క ఫిర్యాదు ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూటికి 80 నుంచి 90 శాతం వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 999 పంచాయతీల్లో కంప్యూటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ–ఆఫీస్ ద్వారా పంచాయతీ కార్యాలయాల్లో ఫైల్స్ను సంబంధిత కార్యాలయాలకు పంపించి త్వరితగతిన నివేదికలు పొందాలని కలెక్టర్ అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో జేసీ పి.కోటేశ్వరరావు, డీపీవో కె.సుధాకర్, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, డీఎస్వో డి.శివశంకర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాల బాధ్యులపై చర్యలు జిల్లాలో పంచాయతీల్లో జరిగే అక్రమ లేవుట్లు, అక్రమ భవన నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టరు భాస్కర్ చెప్పారు. శుక్రవారం పంచాయతీ పన్నులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఎల్ఈడీ బల్బులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో అధికారుల నిర్లక్ష్యం, అవకతవకల వల్ల అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో పంచాయతీల్లో ఎక్కడెక్కడ అక్రమ లేఅవుట్లు, బిల్డింగులు నిర్మాణాలు జరుగుతున్నదీ తెలుసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్ను రూపొందించనున్నట్టు చెప్పారు. పంచాయతీ కార్యాలయంలోనే నివాసం ఉంటున్న తిరుపతిపురం గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీపీవోను ఆదేశించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement