-
సీఎం జగన్ సీఎస్వోగా పరమేశ్వరరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్వోగా నియమించారు. డిప్యూటీ స్పీకర్కు కేబినెట్ ర్యాంకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మా నాన్నను ఎవరు చంపారు?: సునీతా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రి హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉందని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. కేసు దర్యాప్తు జరిగే తీరులో అనేక అనుమానాలు ఉన్నాయని, సరైన రీతిలో జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ప్రెస్క్లబ్లో బుధవారం సునీతా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నాన్న చనిపోయి ఇన్నిరోజులు అయినా ...వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా...ఆ దిశలో విచారణ చేయడం లేదు. మనిషి పోయింది మాకే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తేకే సంబంధం ఉంటే...చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?. మా నాన్నను ఎవరు చంపారనే దానికి సమాధానం కావాలి. అంతేకాకుండా నాన్న హత్యను రాజకీయం చేస్తున్నారు. మా నాన్న 70వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులు జమ్మలమడుగు కోసం ఖర్చు చేశారు. జగనన్న సీఎంని చేయడానికి, వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం నాన్న కృషి చేస్తున్నారు. కడపలో ఉన్న ప్రతి స్థానిక నేత మా నాన్నకు తెలుసు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నాన్నకు మంచి పేరు ఉంది. మా నాన్న ప్రచారంతో ఆదినారాయణరెడ్డి భయపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. మా నాన్నను అడ్డు తొలగిస్తేనే ఎన్నికల్లో గెలుస్తానని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా కుటుంబం గురించి అడిగిన ప్రతి చిన్న విషయాన్ని సిట్ అధికారులకు వివరించాను. మా నాన్నది నలుగురికి సేవ చేసే తత్వం. ఆయన అలా చనిపోతారని నేను అనుకోలేదు. నాన్న చనిపోయిన విషయం సీఐ శంకరయ్యకు ఉదయం 6.40 గంటలకు తెలిపాం. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. అయితే మార్చి 14వ తేదీ ఉదయం పరమేశ్వర్ రెడ్డి ఛాతీ నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరగానే వివేకానందరెడ్డి తనకు సన్నిహితుడని చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి ఆ రోజంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. అదేరోజు సాయంత్రం ఆస్పత్రిలో గొడవ చేసి తనంతట తానే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలను హరిత హోటల్లో పరమేశ్వర్ రెడ్డి కలిశారు. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. నాన్న హత్య జరిగినప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డికి...పరమేశ్వర్ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగాయి. ఇన్నిరోజులు అయినా ఆదినారాయణరెడ్డిని, పరమేశ్వర్ రెడ్డిని ఎందుకు విచారణ చేయడం లేదు. ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు రక్షిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే మాకు అనుమానం కలుగుతోంది. ఆదినారాయణ సిట్ విచారణ సరిగా లేనందునే మేము హైకోర్టును ఆశ్రయించాం. ఈ కేసును సక్రమంగా విచారణ చేయాలి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెగా న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చాను.’ అని అన్నారు. సునీతా రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, అనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వడదెబ్బకు కార్మికుడు మృతి
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. గోపిరెడ్డి పరమేశ్వరరెడ్డి స్థానికంగా గల ఐటీసీ పేపర్ మిల్స్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాల నేపథ్యంలో ఎక్కువగా ఎండలో తిరిగిన పరమేశ్వరరెడ్డి శనివారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని విజయవాలోని ఓ ఆస్పత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement