-
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
జాతీయ పక్షి జాడేదీ?
అటవీప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే జాతీయ పక్షి నెమలి జాతి నానాటికి కనుమరుగవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఏజన్సీలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారులు, పొలాలు, గ్రామశివారుల్లో కనిపించేవి. ఇప్పడు చూద్దామంటే మచ్చుకై నా వాటి జాడ కనిపించడం లేదు.ఎక్కడో లోతట్టు అటవీ ప్రాంతంలో తప్ప, మిగతా ప్రదేశాల్లో నెమలి అరుపులు వినిపించడం లేదు. వై.రామవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నెమళ్ల జాడ కనిపించడం లేదు. ఒకప్పుడు 10 వేల వరకు వీటి సంతతి ఉండేది. ఇప్పుడు మూడు వేలకు లోపే ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇవి అంతరించి పోవడానికి వెనుక చాలా కారణాలు లేకపోలేదు. ► వేటగాళ్లు విచ్చలవిడిగా వేటాడుతున్నారు. కొంతమంది విద్యుత్ అమర్చడం వల్ల మృత్యువాతపడుతున్నాయి. ► పొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందుల ప్రభావం కూడా నెమళ్ల సంతతిపై చూపుతోంది. ఆహార ధాన్యాలు తినేందుకు వస్తున్న నెమళ్లు పురుగు క్రిమిసంహారక మందుల అవశేషాలు కారణంగా మృత్యువాత పడుతున్నాయి. వై.రామవచం మండల సరిహద్దు గ్రామాలైన దబ్బపాలెం, నంగలకొండ, చాకిరేవులు తదితర గ్రామాల్లో పురుగుమందులు అవశేషాలున్న పంటలను తిని నెమళ్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ► కొంతమంది అడవిలో నెమళ్లు పెట్టిన గుడ్లను, వాటి పిల్లలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా కూడా వాటి సంతతి వృద్ధి చెందడం లేదు. ► మైదాన ప్రాంతానికి చెందిన వేటగాళ్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆవుల సాయంతో నెమళ్లను వేటాడేవారు. ఆవుల చాటున మాటువేసి నెమళ్లను పట్టుకుని హతమార్చేవారు. లోతట్టు ప్రాంతాలైన జంగాలకోట, బురదకోట, రాములుకొండ పరిసరాల్లో ఈ రకం వేట ఎక్కువగా జరిగేది. అప్పటిలో మావోయిస్టులు ప్రభావం ఎక్కువగా ఉన్నందున అటవీసిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించలేకపోయేవారు. ► పోడు వ్యవసాయం పేరిట అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఈ కారణంగా కూడా మరో ప్రాంతానికి వలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ► వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా వాటి ప్రయోజనం కనిపించడం లేదు. విద్యుత్ కంచెకు ప్రాణాలు బలి నెమళ్లు, అడవి జంతువుల కోసం ఏర్పాటుచేస్తున్న విద్యుత్ కంచె ప్రాణనష్టం జరుగుతోంది. వై.రామవరం మండలంలో విద్యుత్ కంచెలో చిక్కుకుని గిరిజనులు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. పదేళ్లక్రితం చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన కుర్రే వెంకటేశ్వర్లు, గిరిజనుడు విద్యుత్ కంచెకు బలయ్యాడు. గతేడాది మండలంలోని సింహాద్రిపాలేనికి చెందిన ఓ గిరిజనుడు మృత్యువాత పడ్డాడు. ప్రత్యేక విభాగం ఉన్నా.. వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అటవీశాఖలో ప్రత్యేక విభాగం ఉంది. రంపచోడవరం అటవీడివిజన్కు రాజమహేంద్రవరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనికి డీఎఫ్వో స్థాయి అధికారి ఉంటారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం అందిస్తే తగిన రక్షణ చర్యలు చేపడతారు. చట్టపరమైన చర్యలుతీసుకుంటాం వన్యప్రాణులను వేటాడటం, హతమార్చడం చట్టరీత్యానేరం. ఎక్కడైనా వేటాడితే వెంటనే తమ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి తెలియజేస్తాం. – సత్యనారాయణ,డిప్యూటీ రేంజి అధికారి, వై.రామవరం -
నెమలీక.. ఆనంద జ్ఞాపిక
బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కులో సహజ సిద్ధంగా నేలపై రాలిపోయిన నెమలీకలను చిన్నారులు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పవద్దని మంత్రి కేటీఆర్ పార్కు నిర్వాహకులకు సూచించారు. అయిదేళ్ల బాలుడి తల్లి చేసిన ట్వీట్కు స్పందించిన ఆయన ఈ సూచన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తన అయిదేళ్ల కొడుకు వేదాంతతో కలిసి ఓ మహిళ కేబీఆర్ పార్కుకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి వేదాంత నెమలీకలను సేకరించి వాటితో ఆడుకుంటూ సంబరపడసాగాడు. ఈ దృశ్యం ఆమెకు ఎంతో ఆనందాన్నిచి్చంది. కానీ.. ఆ నెమలీకలను చిన్నారి వెంట తీసుకెళ్లడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. ఈ రోజు తన కొడుకుతో పాటు చాలా మంది పిల్లలు నెమలీకలు సేకరించి వాటితో సంబరపడుతూ వెళ్తుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు అని ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కేటీఆర్.. పిల్లలు నెమలీకలను తీసుకోవడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వాలని సూచించారు. చిన్నారుల ముఖంలో సంతోషం చూడాలన్నారు. ఆ తల్లి ట్వీట్ తనను కదిలించిందని పేర్కొన్నారు. (చదవండి: పాస్పార్ట్ కార్యాలయానికి గవర్నర్ తమిళ సై) -
రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!
Peacocks And Peahens Strolling In A Street In Dubai: ప్రకృతిలో అందమైన పక్షులు చూడాలంటే కచ్చితంగా గ్రామాలు లేదా పార్క్లు లేదా అడవుల్లోనో చూడగలం. అయినా అవి ఎప్పుడో గానీ సిటీల్లో కనువిందు చేయడం అత్యంత అరుదు. అలాంటిది ఏకంగా 50 నెమళ్లు రోడ్లపై షికారు చేస్తూ చూపురులకు కనువిందు కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకెళ్తే....దుబాయ్లోని రోడ్లపై నెమళ్లు సందడి చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 50 నెమళ్లు సందడి చేశాయి. పైగా మనం ఆడ, మగ నెమళ్ల గుంపు ఒకేసారి చూడటం అత్యంత అరుదు. అలాంటిది రకరకాల రంగుల్లో ఉన్న నెమళ్లు కనివిందు చేస్తున్నాయి. అంతేకాదు అందులో ఒక నెమలి చాలా అందంగా పురివిప్పి నాట్యం చేస్తోంది. అయితే ఈ అందమైన నెమళ్ల వీడియోని బాలీవుడ్ టెలివిజన్ నటి మినీ మాథుర్ " అపురూపమైన వీడియో" అనే క్యాప్షన్ని జోడించి ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ''వావ్ అమేజింగ్ వీడియో'' అంటూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Mini Mathur (@minimathur) -
మోదీ నివాసంలో నెమళ్ల నాట్యం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement