-
సీట్బెల్ట్ వాడకే మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. సీట్ బెల్ట్ వినియోగించని కారణంగానే ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య , డ్రైవర్ మృతిచెందారు. పిన్నమనేని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాతపడటానికీ సీట్ బె ల్ట్ ధరించకపోవడమే కారణం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు ప్రతీక్రెడ్డి కారు ఔటర్పై ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించినా..సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఆరవ్రెడ్డి బయటపడ్డారు. సీట్ బెల్ట్ ఎందుకంటే..:కారులో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో వారూ ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లు తదితరాలను వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీ కొడితే.. అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఇలా పడటం వల్ల తీవ్రగాయాలపాలై మృత్యువాతపడుతుంటారు. అదే సీట్ బెల్ట్ వాడితే పెద్ద కుదుపునకు మాత్రమే గురై గాయాలతో బయటపడచ్చు. సీట్ బెల్ట్కు.. ఎయిర్ బ్యాగ్స్కు లింకు..! - పిన్నమనేని కారు ప్రమాదంలో తెరుచుకోని ఎయిర్బ్యాగ్స్ సాక్షి, హైదరాబాద్: ఔటర్పై ప్రమాదానికి గురైన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం మిత్సుబిషి కంపెనీ పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్కు చెందింది. ఈ వాహనానికి ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్బ్యాగ్స్ ఉంటాయి. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. అయితే పిన్నమనేని ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనా ఇవి తెరుచుకోలేదని, దీనికి కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి ‘సాక్షి’కి తెలిపారు. వాహనరంగ నిపుణులు మాత్రం లేటెస్ట్ మోడల్కు చెందిన ఈ తరహా కారుల్లో డ్రైవర్ సీటుబెల్ట్ ధరిస్తేనే ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా తయారీదారులు రూపొందించారని చెప్తున్నారు. పిన్నమనేని డ్రైవర్ ‘బెల్ట్’ పెట్టుకోకపోవడంతో... పిన్నమనేని ప్రయాణిస్తున్న కారులో ఆయన డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ ధరించగా.. డ్రైవర్ స్వామిదాసుతో పాటు వెనుక కూర్చున్న భార్య సాహిత్యవాణి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్లో సీట్ బెల్ట్కు, ఎయిర్బ్యాగ్స్కు లింకు ఉంటుందని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణ నషం్ట తగ్గేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాహనానికి సంబంధించి ఎయిర్బ్యాగ్స్ అంశాన్ని నిత్యం పరీక్షించుకోవడం కూడా ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. -
పిన్నమనేని భార్య మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాద ఘటనపై వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగులను సంప్రదించగా.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందని, కారు వెనుక టైరు బాగా దెబ్బ తినడంతో అదుపు తప్పి, డివైడర్ను ఢీకొని తిరగబడిందని చెప్పారు. దాంతో ముందుసీట్లో కూర్చున్న డ్రైవర్ దాసు, భార్య సత్యవాణి బయటకు పడిపోయారని, కారు అలాగే 50 అడుగుల పాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయిందని అన్నారు. రోడ్డు మీద పడిపోవడంతో తలకు గాయాలై సత్యవాణి, డ్రైవర్ వాసు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు తిరగబడిన కారు -
గుడివాడ టీడీపీలో కోల్డ్వార్
గుడివాడ : గుడివాడ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై కోల్డ్వార్ జరుగుతోంది. గుడివాడలో పార్టీ గెలవకపోయినా పార్టీ అధికారాన్ని పంచుకునే విషయంలో రావి అనుచరులకు ఉన్న ప్రాధాన్యం పిన్నమనేని అనుచరులకు ఇవ్వటం లేదనే విమర్శ ఆ వర్గం నుంచి వినిపిస్తోంది. కలిసి పనిచేసినా... గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నికల ముందు తన అనుచరులతో కలసి టీడీపీలో చేరారు. ఇద్దరూ కలిసి పనిచేసి పార్టీని గుడివాడలో గెలిపించాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇరు వర్గాలు కలిసి పనిచేసినా గుడివాడలో పార్టీ విజయం సాధించలేక పోయింది. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా గుడివాడలో టీడీపీని గెలిపించలేకపోయారు. అయితే అధికారాన్ని పంచుకునే విషయంలో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. కమిటీల్లో దక్కని చోటు... ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయంలో భాగంగా సామాజిక పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో జన్మభూమి కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో పిన్నమనేని అనుచరులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పిన్నమనేనికి మంచి పట్టు ఉంది. పిన్నమనేని వెంకటేశ్వరరావు సోదరుని కుమారుడు పిన్నమనేని బాబ్జి అన్ని ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయినా తమకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై వీరు గుర్రుగా ఉన్నారు. ప్రత్తిపాటికి ఫిర్యాదు.. ఇటీవల గుడివాడకు వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పిన్నమనేని బాబ్జి, ఆయన అనుచరులు ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు సమర్థవంతంగా చేయటం లేదని, పిన్నమనేని కుటుంబానికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని కోరారు. గుడివాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టే విషయంలో వారం రోజులుగా పార్టీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నా రావి సమర్థవంతమైన నిర్ణయం తీసుకోలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చి బహిరంగ విమర్శలు చేసుకోవద్దని ఇరు వర్గాల వారికి హెచ్చరికలు జారీ చేయటంతో కొంతమేరకు అడ్డుకట్ట పడింది. నీరు-చెట్టు పథకం పనులకు సంబంధించి జన్మభూమి కమిటీ పేరుతో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఈ పనులను రావి వర్గానికే కేటాయించటంతో పిన్నమనేని వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుత అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవిని పిన్నమనేని బాబ్జికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుందని సమాచారం. అదే జరిగితే పాత టీడీపీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తుంది. -
'నాబార్డ్ నుంచి రాయితీలు రావడం కష్టమే'
ఒంగోలు: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కాబ్కు నాబార్డు నుంచి రాయితీలు రావటం కష్టంగా మారిందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం సదస్సులో పిన్నమనేని మాట్లాడుతూ... ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఆప్కాబ్కు ఉంటే నాబార్డు నుంచి రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రూ.7 వేల కోట్లు, తెలంగాణలో రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు నాబార్డు నుంచి రాయితీలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement