-
2024 సాధారణ ఎన్నికలకు సూచికే
- సాక్షికి ప్రత్యేకం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో యూపీ ప్రభుత్వం విజయవంతం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ కారణాల్లో ఒకటి. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఎస్పీ విఫలమైంది. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. ఈ విజయం ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే! ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగిం టిని గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సాను కూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగ్గానే అంచనా వేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు ఎందుకు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూపీలో మోడీ–యోగీ హవా! ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయానికి మోడీ–యోగీ ద్వయం కారణ మన్నది నిర్వివాదాంశం. మొత్తం 403 స్థానాల్లో 255 బీజేపీకి దక్కడం, అది కూడా 41 శాతం ఓటుషేరుతో కావడం భారీ విజయం గానే చెప్పుకోవాలి. 2017 ఎన్నికలతో పోలిస్తే 57 సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేసిన అప్నాదళ్ (సోనేలాల్) పన్నెండు స్థానాలు గెలుచుకోగా, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్ ఇంకో ఆరు సీట్లు గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ గత ఎన్నికల కంటే 73 స్థానాలు ఎక్కువగా, మొత్తం 111 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. సైకిల్ గుర్తుకు పడ్డ ఓట్లూ 32 శాతానికి చేరాయి. ఎన్నిక లకు ముందు ఎస్పీతో జట్టు కట్టిన ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 13 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏతావాతా యూపీ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతలకూ, సమాజ్వాదీ గూండా రాజ్యానికీ మధ్య జరుగుతున్నాయన్న బీజేపీ ప్రచారం బాగానే పనిచేసిందని ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి యోగీ అవసరమని భావించిన ఓటర్లు తమ తీర్పును విస్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూలేని విధంగా ఒక పార్టీకి వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశం దక్కింది. అలాగే ‘ఎన్సీఆర్’ ప్రాంతంలోని నోయిడాను సందర్శించిన వారు యూపీ గద్దెనెక్కలేరన్న గుడ్డి నమ్మకాన్ని కూడా యోగీ ఆదిత్యనాథ్ వమ్ము చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో రాణించడానికి పలు కారణా లున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ల చరిష్మాతో పాటు కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ అధి కారంలో ఉండటమూ కలిసొచ్చింది. మోడీ హవా సామాజిక వర్గా లను దాటుకుని అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడేలా చేసింది. అగ్రవర్ణాలు, ఎస్సీలు, చిన్న చిన్న ఓబీసీ వర్గాలతో కలిసి 2014లో సృష్టించుకున్న కూటమి బీజేపీకి దన్నుగా (కొన్ని ప్రాంతాలు మినహా) నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో ప్రభుత్వం విజయవంతం కావడం బీజేపీ విజయ కారణాల్లో ఇంకోటి. ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు బీజేపీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగు తున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకుందామనుకున్న ఎస్పీ ఈ విషయంలో తీవ్ర భంగపాటుకు గురైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, బీజేపీ సీనియర్ నేతలు జాట్ నేతలను కలవడం పరిస్థితిని బీజేపీకి కొంత అనుకూలంగా మార్చింది. ఆర్ఎల్డీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఎక్కువ సీట్లు సాధించ వచ్చునన్న ఎస్పీ అంచనా తప్పింది. వేర్వేరు పార్టీల మధ్య ఓట్ల మార్పిడి కూడా సరిగ్గా జరగలేదు. అయితే, ఎస్పీ కూటమికి దక్కిన అదనపు సీట్లు బీజేపీ వ్యతిరేక పార్టీలతో జాతీయ స్థాయి కూటమి కట్టాలన్న ప్రయత్నంలో జరిగిన మార్పు అనుకోవాలి. పంజాబ్ను ఊడ్చిన ఆమ్ ఆద్మీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చేసిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ స్థానాలు 117లో ఏకంగా 92 గెలుచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్లు 22 శాతమే అయి నప్పటికీ సాధించిన అదనపు సీట్లు మాత్రం 72. కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లతో 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఆప్కు పంజాబ్లో దక్కిన అపూర్వ విజయం... ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే. అదే సమయంలో ఈ ఓటు భూస్వామ్యవాద పోకడలతో, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పడ్డది గానూ చూడవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ము లాటలు, వర్గపోరుల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్ అమరీందర్సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య భగ్గుమన్న విభేదాలు పార్టీ మద్దతుదారులు అనేకులు దూరమమ్యేందుకు కారణమైంది. సిద్ధూను పార్టీ అధ్యక్షుడిగా, దళితుడైన చరణ్జీత్సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చన్నీ, సిద్ధూ ద్వారా రాష్ట్రంలోని 32 శాతం దళిత, 20 శాతం జాట్ ఓటర్లను కూడగట్టాలని అనుకున్న కాంగ్రెస్ పథకం పూర్తిగా బెడిసికొట్టింది. ఆధిపత్య పోకడలకు పోయే జాట్ సిక్కులతో కలిసి ప్రయాణించలేమనుకున్న దళితులు మూకుమ్మడిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రచార లోపాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించిన క్షణం నుంచి ఆ పార్టీకి అనుకూల పవనాలు వీచాయంటే అతిశయోక్తి కాదు. నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, విద్యా వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, మహిళలకు పింఛన్ల వంటి పథకాలు ప్రజలను ఆప్కు ఓటేసేలా చేశాయి. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... మోడీ హవాతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఉత్తరాఖండ్లో వరుసగా రెండోసారి విజయం దక్కింది. ఉన్న డెబ్భై స్థానాల్లో 47 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మును పటి కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ దక్కించుకున్నా అధికారం మాత్రం అందని మానిపండుగానే మిగిలింది. ముఖ్యమంత్రులను మార్చడం, పార్టీలో అంతర్గత విభేదాల కార ణంగా బీజేపీ మూడు శాతం ఓట్లు, పది సీట్లు కోల్పోయింది. కొత్త ఉద్యోగాల కల్పన, ఏడాది పొడవునా చార్ధామ్ యాత్రకు ఉయోగపడేలా రహదారుల నిర్మాణం, కర్ణ ప్రయాగ్, రిషికేశ్ల మధ్య రైల్వే లైను వంటి బీజేపీ ఎన్నికల హామీలు పని చేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో తన స్థితిని కొంచెం మెరుగుపరచుకోగలిగింది కానీ, హైకమాండ్ నుంచి తగిన మద్దతు లభించకపోవడం; పార్టీలో వర్గాలు, ప్రచారకర్తల లేమి వంటి కారణాలతో ఓటమి పాలైంది. మణిపూర్లో బీరేన్ సింగ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై సీట్లలో విజయం లక్ష్యంగా అరవై స్థానాలున్న అసెంబ్లీకి పోటీ పడింది. దక్కింది 32 స్థానాలు మాత్రమే అయినప్పటికీ... సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, జేడీ(ఎస్), ఫార్వర్డ్ బ్లాక్లతో కూడిన కాంగ్రెస్ కూటమికి ఐదు స్థానాలు మాత్రమే లభించాయి. కేంద్రంలో బీజేపీ భాగస్వామి అయిన ఎన్పీపీ ఒంటరిగానే పోటీకి దిగి ఏడు స్థానాలు, జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్పీఎఫ్ ఇంకో ఐదు స్థానాలు గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సుస్థిర, శాంతియుతమైన ప్రభుత్వం అందిం చినందుకుగానూ మణిపూర్ ప్రజలు మరోసారి బీజేíపీకి పట్టం కట్టినట్లుగా చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక వర్గాల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకోవడమూ కాషాయ పార్టీకి కలిసివచ్చింది. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బహుముఖ పోటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహా రాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోయి ఉండటం కలిసి వచ్చింది. మోజారిటీకి ఒక స్థానం తక్కువగా 20 స్థానాలు గెలుచు కుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 12, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోగా తృణమూల్కు ఒక్క స్థానమూ దక్కలేదు. బీజేపీయేతర పార్టీల్లో అనైక్యత ఫలితాలు ఎలా ఉంటాయో గోవా ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించడం వెనుక ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోవడం కారణమన్న వాదనలో అంత పస లేదనే చెప్పాలి. మంచి పాలన, వి«ధానాల ఆధారంగానే ఓటర్లు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తుకు సూచికగా చూడవచ్చు. పంజాబ్, గోవాల్లో అధికారాన్ని దక్కించు కోవడంలో విఫలమైన కాంగ్రెస్ తన పతనావస్థలో చరమదశకు చేరుకుందని చెప్పాలి. 2024 సాధారణ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సూచిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
కీలకమైన గెలుపు హవా!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీతోపాటు పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్ని కల తంతు ముగిసింది. జయాప జయాల వివరాలు ఇంకో రెండు రోజుల్లో స్పష్టమవుతాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఒక విషయమైతే అంచనా వేయవచ్చు. దేశ ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతికంగా మోడీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికలు మోడీని జాతీయ స్థాయి నేతగా నిలబెడితే, 2019 నాటి ఎన్నికలు మోడీ ఆధిపత్యాన్ని పరాకాష్టకు చేర్చాయి. మోడీ నాయ కత్వంపై విదేశీ మీడియా మాత్రమే కాదు.. వామపక్షవాదులు, విమర్శకులు, విదేశీ మీడియా తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓటమిపాలైనా మోడీ హవా అయిపోయిందనీ వీరు ప్రకటించేస్తూంటారు. వ్యవసాయ చట్టాల రద్దు తరువాత మోడీ రైతులకు క్షమాపణలు చెప్పడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. అయితే, మోడీ హవాను అర్థం చేసుకోవడం అంత సులువైన పనేమీ కాదు. మోడీ హవాకు నాందీ పడింది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అధికారం నిర్వహించినప్పుడన్నది నిర్వివాదాంశం. మోడీ మార్కు గుజరాత్ నమూనా ఆర్థిక వృద్ధికి సూచికగా మారిన విషయం తెలిసిందే. 2002–12 మధ్యకాలంలో గుజ రాత్ ఆర్థిక వృద్ధిని సవాలు చేసే వాళ్లెవరూ లేకపోగా ఈ పరి ణామం కాస్తా ఆయన్ని మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేయ గలిగింది. నిజాయతీపరుడు, కష్టజీవి, హిందుత్వవాది అన్న ముద్ర మోడీకి దక్కింది. ఆర్థికంగా ఎదగాలన్న మధ్యతరగతి వర్గం రాష్ట్ర అభివృద్ధి విషయంలో మోడీ దార్శనికతను తమదిగా చేసుకున్నారు. హిందూ ఓట్లు మోడీకి నమ్మకంగా పడటం మాత్రమే కాకుండా.. హిందుత్వ రాజకీయాలకు మోడీ ఓ మార్గదర్శకుడయ్యాడు. బీజేపీ తరఫున ప్రధానిగా మోడీ పోటీ చేయనున్నారన్న వార్తతో మెజారిటేరియన్ రాజకీయాల్లో మోడీ ప్రభ గుజరాత్ను దాటి దేశవ్యాప్తమైంది. మోడీ చరిష్మాతో దేశ ఎన్నికల యవనికపై కాషాయం అలుముకుంది. మట్టి మనిషి, అభివృద్ధి రాజకీయాలపై దార్శనికత ఉన్న వాడిగా ముద్ర సంపాదించుకున్న మోడీ వాటి సాయంతోనే తన చరిష్మాను కొనసాగించారు. ఆర్థికంగా సాధించిన అభివృద్ధి గుజరాత్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కూడా ఇక్కడ ఉపయోగపడింది. చాయ్వాలా నేపథ్యం, ఆర్ఎస్ఎస్ సిద్ధాం తాల మద్దతులు ఒకవైపున... అవినీతి, వారసత్వ రాజకీయాలు ఇంకోవైపున ఉన్న సందర్భంలో ప్రజలు మోడీకి ఆకర్షితుల య్యారని చెప్పాలి. రాజకీయ, వాక్ చాతుర్యాలూ కలిసి వచ్చాయి. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ... మైనారిటీ లను ప్రసన్నం చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను తరచూ ప్రస్తావిస్తూ హిందూ వర్గాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు అందించడం, ప్రజల నాడిని గ్రహిస్తూ వాటిల్లో తప్పులను సరిదిద్దుకోవడం మోడీకి లాభిం చింది. మోడీ వినా మరో ప్రత్యామ్నాయం లేదన్న మానసిక స్థితిని సృష్టించడంలోనూ విజయం సాధించారు. 2014 తరువాత జరిగిన ఎన్నికల్లో అత్యధికం హవాల ఆధారంగా నడిచినవే. బీజేపీ విజయాలు.. లేదా ఓట్లశాతంలో పెరుగుదల ప్రధానంగా మోడీ అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత సెంటిమెంట్ల ఆధారంగానే జరిగాయి. ప్రభుత్వ పాలన సరిగా లేని మధ్యప్రదేశ్, హరియాణాల్లో మోడీ ప్రభ బీజేపీ పతనాన్ని అడ్డుకుంది. ఓటమి తాలూకూ తీవ్రతను గణనీ యంగా తగ్గించింది. పశ్చిమబెంగాల్లో పార్టీ రెండో స్థానానికి ఎదిగేందుకు సాయపడింది. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అన్న నినాదంతో 2022 నాటికి సరి కొత్త భారత దేశాన్ని నిర్మిస్తా మన్న మోడీ నినాదం దేశంలో ఓ కొత్త ఊపు తెచ్చింది. జాతీయ మౌలిక సదుపాయా లను ఆధునికీకరించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తవాటిని ఏర్పాటు చేయడం అన్న ద్విముఖ వ్యూహంతో మోడీ కొత్తగా నేషన్ బిల్డింగ్ మొదలుపెట్టారు. ఆర్థిక సంస్క రణలు వేగవంతం చేయడం, ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలు రాజకీయంగా మోడీకి ఉన్న ఆదరణను మరింత పెంచాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం వంటి చిరకాల ఆర్ఎస్ఎస్ అజెండాను వేగంగా ఆచరణలోకి తీసుకురావడం మోడీ హవాకు మరింత జోరు నిచ్చాయి. ఏతావాతా.. మోడీ హవా మరింత కాలం కొన సాగేందుకు ఇవన్నీ దోహదపడుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కొందరు మోడీ హవా, బీజేపీ తాలూకూ వ్యవస్థ చాలా బలహీన పడ్డాయని చెబుతూ, అందుకు ఐదు కారణాలు చూపుతున్నారు. వీటిల్లో మొదటిది, 2014 తరువాతి ఎన్నికల్లో మోడీ విజ్ఞప్తుల తరువాత కూడా బీజేపీకి పడ్డ ఓట్ల శాతంలో స్వల్పమైన తగ్గుదల నమోదు కావడం. ఈ కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజా రిటీతో గెలవడం అంత సులువు కాబోదని వీరు అంటున్నారు. మోడీ తరువాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థి తులు ఉండవన్నది రెండో కారణంగా చూపుతున్నారు. మోడీ వారసుడు ఎవరన్న అంశంపై పార్టీ చీలిపోవడమో, కుప్పకూలి పోవడమో జరుగుతుందని వీరి అంచనా. మోడీ, బీజేపీ హవా తగ్గుతోందనేందుకు విశ్లేషకులు చూపుతున్న మూడో కారణం పార్టీలోనే అంతర్గతంగా పోటీ మొదలయ్యే అవకా శాలు ఉండటం. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పార్టీలో కొత్తగా చోటిచ్చిన నేపథ్యంలో వారు తమ ప్రాతినిధ్యంపై డిమాండ్ చేస్తారని వీరు చెబుతున్నారు. ఇప్పటివరకూ బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వంలో అగ్రవర్ణాలదే ఆధిపత్యం. బీజేపీ సంస్థాగత నిర్మాణం దోవతప్పిపోయే అవకాశం ఉందన్నది నాలుగో కారణం. ఇందిరా కాంగ్రెస్ తరువాత కాంగ్రెస్ పార్టీలో జరిగి నట్టే ఇప్పుడూ జరగవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణలు బెడిసికొట్టి ఓటర్లకు కొన్ని ఇతర అంశాలు గోచరిస్తే రాజకీయంగా మరోసారి కొత్త ముఖాల కోసం ప్రయత్నాలు మొదలు కావచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ కారణాల్లో కొన్ని పరస్పర వైరుద్ధ్యమున్నవి. ఇందిరా కాంగ్రెస్ తరువాతి పరిస్థితులపై అంచనా కూడా అస్పష్టం. ఎందుకంటే ఇరు పార్టీల నేపథ్యం, రాజకీయం పూర్తిగా భిన్నం. మొత్తమ్మీద చూస్తే... మోడీ హవా ఇప్పటికీ కొన సాగుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దేశ రాజ కీయాలకు అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల్లోనూ గెలుపు ఓటములకు మోడీ హవా కీలకం కానుంది. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
ఏపీలో ఫ్యాన్గాలి
►నేడే ఎనిమిదో విడత పోలింగ్ ► సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీకే విజయావకాశాలు ►బీజేపీతో టీడీపీ పొత్తు పట్ల మైనారిటీ ఓటర్లలో వ్యతిరేకత ►దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు గడ్డుకాలం నవ్యాంధ్ర నిర్మాణానికి.. ఓటేద్దాం రండి. ఓటు... ప్రజాస్వావ్యు వ్యవస్థలో వజ్రాయుుధం. పౌర ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపు కాసే రెండక్షరాల తారకవుంత్రం. ఐదేళ్ల పాటు వునల్ని పాలించాల్సిన వారిని ఎంచుకోవాల్సిన రోజు వచ్చేసింది. ఈ ఒక్క రోజు సాకులన్నీ పక్కన పెడదాం. అందరవుూ ఒక్కటై కదులుదాం. వెళ్లి ఓటేద్దాం. సరైన వారిని ఎంచుకుని వురీ ఓటేద్దాం. స్వర్ణయుుగాన్ని సాధించి చూపించే సవుర్థులను ఎన్నుకుందాం. వున భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. ఐదేళ్ల పాటు రోజూ నిశ్చింతగా ఉందాం. నా ఒక్క ఓటు పడకపోతే ఏవువుతుందనే ఆలోచనే వద్దు. ఒక్కో బిందువూ కలిస్తేనే సింధువు. వునవుంతా శాసనకర్తలమేనని, వునం వేసే ఒక్కో ఓటూ వున భవితను శాసిస్తుందని గుర్తుంచుకుందాం. నూరు శాతం పోలింగ్తో కొత్త చరిత్ర సృష్టిద్దాం. పదండి... ఓటేసి గెలుద్దాం... 7 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ - 64 లోక్సభ స్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల తతంగాన్ని సజావుగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలను 35 రోజుల పాటు తొమ్మిది విడతల్లో నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 30 నాటికి ఏడు విడతల పోలింగ్ ముగియడంతో దేశంలోని రాజకీయ పార్టీల్లో అలసట కనిపిస్తోంది. రాజకీయ పార్టీల ప్రచారంలో పునరావృతమవుతున్న అవే వ్యక్తిగత విమర్శలు, ప్రతి విమర్శలు వాటి ఆలోచనల్లో దివాలాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రధాన జాతీయ పార్టీలు రూపొందించుకున్న వ్యూహాలు, ప్రచారంలో అవి అనుసరించిన తీరుతెన్నులను సమీక్షించడం నేడు జరుగుతున్న ఎనిమిదో విడత పోలింగ్ సందర్భంగా కీలకం కాగలదు. - ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) దేశం నలువైపులా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తెలివిగా రూపొందించిన తన జంట వ్యూహంపై ఆధారపడింది. మొదటగా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలో పార్టీ అగ్రనేతలంతా ‘గుజరాత్ నమూనా’, ‘రాష్ట్రాల్లో నిర్ణయాత్మక ప్రభుత్వాలు’ ప్రచారంతో హోరెత్తించారు. మరోవైపు పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, అనుబంధ శక్తులు ముఖ్యంగా బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో, మతపరమైన ఉద్వేగాలకు పేరుపొందిన రాష్ట్రాల్లో ‘హిందుత్వ’ కార్డును బాహాటంగాను, పరోక్షంగాను ప్రచారంలోకి తెచ్చారు. మోడీ దూకుడును అరికట్టడంలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ చతికిలపడినట్లే కనిపించడంతో ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ మోడీ వర్సస్ ఇతరులుగా మారింది. కాంగ్రెస్ ప్రధాన ప్రచార సారథి రాహుల్ గాంధీ తన ప్రచారంలో యూపీఏ-2 సర్కారు సాధించిన విజయాలను ఏకరువు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించినా, ఓటర్లకు చేరువ కావడంలోను, వారికి అర్థమయ్యే రీతిలో వివరించడంలో విఫలమయ్యారు. మోడీ దూకుడును ఎదుర్కొనేందుకు ప్రచారానికి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగడమే ఇందుకు నిదర్శనం. ఇక ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు, ఇతర బీజేపీయేతర పార్టీలు కూడా మోడీపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఒక పార్టీ ప్రధాని అభ్యర్థికి, ఇతరులకు నడుమ పోటీగా కుదించుకుపోయిన తొలి లోక్సభ ఎన్నికలు ఇవే. మోడీకి, ఇతరులకు నడుమ జరుగుతున్న ప్రస్తుత పోటీలో పార్టీ విస్మృతిలోకి జారుకుంది. ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడిన తర్వాత ఈ పరిణామంపై కూలంకషమైన విశ్లేషణలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్-25 ఈ విడతలో జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. సీమాంధ్రలోని 25 లోక్సభ నియోజకవర్గాలకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో కోస్తాంధ్రలో 17, రాయలసీమలో 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 10 శాతానికి పైగానే ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 12 శాతానికి పైగా ముస్లింలతో పాటు దాదాపు 10 శాతం మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. గత 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలోని 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 21 స్థానాలతో ఘన విజయం సాధించగా, మిగిలిన నాలుగు స్థానాలనూ టీడీపీ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కుల సమీకరణాలను బట్టి చూసుకుంటే 2009 లోక్సభ ఎన్నికల్లో (సీఎస్డీఎస్ ఎన్ఈఎస్ 2009 సమాచారం ఆధారం) రెడ్డి ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతు పలికారు. కమ్మ ఓటర్లు టీడీపీ వెంట నడిచారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాపులు 1989 నుంచి రెండు ప్రధాన పార్టీల గెలుపు ఓటములను నిర్ణయిస్తూ వచ్చారు. అయితే, 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) బరిలోకి దిగడంతో కుల సమీకరణాలు మారాయి. మూడు పార్టీలకూ వాటి అధినేతల కులాల నుంచి మద్దతు లభించింది. పీఆర్పీకి బీసీల్లో ముఖ్యమైన కులాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్, పీఆర్పీలతో పోలిస్తే బీసీల్లో ఎక్కువ మంది మద్దతును టీడీపీయే పొందింది. కాంగ్రెస్కు ముస్లింలు, మాలలు మద్దతుగా నిలవగా, మాదిగల్లో కొందరు కాంగ్రెస్ వైపు, మరికొందరు టీడీపీ వైపు నిలిచారు. ముస్లింలు కాంగ్రెస్కే అండగా నిలిచారు. రాష్ట్రంలో ఇటు లోక్సభకు, అటు అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలను చూరగొన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిసలైన వారసుడని ప్రజలు భావిస్తున్నారు. యూపీఏ సర్కారు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేపట్టిన రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగా ప్రజల్లో ఆయన పట్ల నెలకొన్న సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్ల రూపంలో లబ్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ఫలితంగా రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాల ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల టీడీపీ-బీజేపీ కూట మికి విజయావకాశాలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. టీడీపీ-బీజేపీ పొత్తులో తలెత్తిన పొరపొచ్చాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చాయి. పొత్తు పట్ల ఉభయ పార్టీల మద్దతుదారుల్లోనూ అసంతృప్తి ఉంది. ఫలితంగా ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా భారీ ఆస్తులను పోగు చేసుకున్నారని టీడీపీ-బీజేపీ కూటమి గుప్పిస్తున్న ఆరోపణలను ఓటర్లు విశ్వసిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ వద్ద అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే, ఆరోపణలు గుప్పిస్తున్న పార్టీల అభ్యర్థులు కూడా ఆస్తుల విషయంలో తక్కువేమీ కాదని ఓటర్లకు తేలికగానే అర్థమవుతోంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలా మంది శతకోటీశ్వరులే. రాజకీయాలను ప్రజాసేవ కోసం కాకుండా స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్న వారే. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప లోక్సభ స్థానంలో పోటీని ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్కు సోదరుడి వరుసయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. కొత్త రాష్ట్రమైన సీమాంధ్రకు ఏది రాజధానిగా ఉండాలనే అంశం నుంచి గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరా, శాంతి భద్రతల సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాంశాలుగా ఉన్నాయి. ఇక రాజంపేట లోక్సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2009 లో ఎవరికెన్ని ఈ 64 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 34 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు మూడు స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 4 స్థానాలను, లెఫ్ట్ఫ్రంట్ 6, బీఎస్పీ 5, ఎస్పీ 3, ఇతర పార్టీలు 9 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే, ఎనిమిదో విడత పోలింగ్ జరగనున్న లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 58 శాతం స్థానాలను కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలుచుకుంది. కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. బీహార్-7 ఈ విడతలో బీహార్లోని శివహర్, సీతామఢీ, ముజఫర్పూర్, మహారాజ్గంజ్, సారణ్, హజీపూర్ (ఎస్సీ), ఉజియార్పూర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో ఆరు నియోజకవర్గాలు తిర్హుట్, ఒక నియోజకవర్గం మిథిల ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ 10 శాతానికి పైగానే ఉన్న ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకపాత్ర పోషించనున్నారు. లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని బీజేపీని నేరుగా ఢీకొంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీకి రాం రాం చెప్పేసి ఒంటరిగా బరిలోకి దిగిన జేడీయూ మూడో స్థానానికి పరిమితమైన సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 17 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు పూర్తిగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైపు మళ్లినట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. కుల సమీకరణాలను చూసుకుంటే అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) ఓటర్లు ఇప్పటి వరకు జేడీయూ వైపు ఉంటూ వచ్చారు. దాదాపు వంద కులాలకు చెందిన ఎంబీసీల జనాభా 30 శాతానికి పైమాటే. ఓబీసీల్లో యాదవులు లాలూ వైపు ఉండగా, కుర్మీలు నితీశ్ వెంట ఉన్నారు. మోడీని ఓబీసీకి చెందిన నాయకుడిగా బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడంతో కుర్మీలు మినహా ఎంబీసీలలో ఎక్కువమంది ఈసారి బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవి పోటీలో ఉన్న సారణ్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే, 2009లో తన భర్త గెలుచుకున్న స్థానాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత ఆమెపై పడింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ప్రతాప్ రూడీ, బీహార్ శాసనమండలి చైర్మన్, జేడీయూ అభ్యర్థి సలీం పర్వేజ్ నుంచి ఆమె గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. సారణ్తో పాటు మహారాజ్గంజ్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. మహారాజ్గంజ్ నుంచి ఆర్జేడీ సిటింగ్ ఎంపీ ప్రభునాథ్ సింగ్ బరిలో ఉన్నారు. ఇక మాజీ సీఎం, కురువృద్ధుడైన జేడీయూ సిటింగ్ ఎంపీ రామ్సుందర్ దాస్ హజీపూర్ నుంచి మరోసారి బరిలోకి దిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎల్జేపీ అధినేత రామ్విలాస్ పాశ్వాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. హిమాచల్-4 హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్డా, మండి, హమీర్పూర్, సిమ్లా(ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాల్లో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఎన్నికల్లో వీటిలో మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం హమీర్పూర్. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్పై కమల్ కాంత బాత్రా పోటీ చేస్తున్నారు. ఆమె కార్గిల్ యుద్ధంలో అమరుడైన, పరమవీర చక్ర పురస్కార గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి రాజీందర్ సింగ్ రాణా ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మండిలోనూ పోరు ఆసక్తికరంగానే ఉంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ, కెయొంతాల్ రాజవంశానికి చెందిన ప్రతిభా సింగ్ బీజేపీ ప్రత్యర్థి స్వరూప్ శర్మను ఎదుర్కొంటున్నారు. ఈ నాలుగు స్థానాల్లో 2009 నాటి ఫలితాలే రావచ్చని భావిస్తున్నారు. పరిస్థితులు ప్రతికూలిస్తే బీజేపీ మరో స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్-5 ఉత్తరాఖండ్లో టెహ్రీగఢ్వాల్, గఢ్వాల్, అల్మోరా(ఎస్సీ), నైనితాల్- ఉధమ్సింగ్నగర్, హరిద్వార్ నియోజకవర్గాల్లో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. నైనితాల్-ఉధమ్సింగ్నగర్, హరిద్వార్ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ మొత్తం 5 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. అయితే, ఈ సారి కాంగ్రెస్కు అంత అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ సీనియర్ నేత సత్పాల్ మహారాజ్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోకపోవడం పార్టీని బాగా దెబ్బతీశాయి. విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్ బహుగుణ కాంగ్రెస్ టికెట్పై టెహ్రీగఢ్వాల్ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరక్సింగ్ రావత్ గఢ్వాల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ భార్య రేణుక రావత్ హరిద్వార్ నుంచి కాంగ్రెస్ టికెట్పై బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో గెలుచుకున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోయేలా ఉంది. ఉత్తరప్రదేశ్-4 ఈ రాష్ట్రంలో నేడు పోలింగ్ జరుగుతున్నవి జరగనున్నవి ఐదో దశ ఎన్నికలు. ఈ విడతలో 15 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అవి అమేథీ, సుల్తాన్పూర్, ప్రతాప్గఢ్, కౌశాంబీ(ఎస్సీ), ఫూల్పూర్, అలహాబాద్, ఫైజాబాద్, అంబేద్కర్నగర్, బహరాయిచ్(ఎస్సీ), కైసర్గంజ్, శ్రావస్తీ, గోండా, బస్తీ, సంత్ కబీర్నగర్, భదోహి. వీటిలో అవధ్ ప్రాంతంలో 4, తూర్పు ప్రాంతంలో 5, ఈశాన్య ప్రాంతంలో 6 నియోజకవర్గాలున్నాయి. బహరాయిచ్, కైసర్గంజ్, శ్రావస్తీ, గోండా నియోజకవర్గాల్లోని ఓటర్లలో 20 శాతానికి పైగా, మరో 8 నియోజకవర్గాల్లో 10 శాతానికి పైగా ముస్లిం లున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటర్ల శాతం కూడా గణనీయంగానే ఉంది. నాలుగు స్థానాల్లో 10 శాతానికి పైగా, మిగ తా స్థానాల్లో 20 శాతానికి పైగా ఎస్సీ ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ 15 స్థానాల్లో కాంగ్రెస్ 7, బీఎస్పీ 5, సమాజ్వాదీ పార్టీ 3 సీట్లు గెలుచుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో కనీసం 50 గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీకి ఈ స్థానాలు చాలా కీలకమైనవి. అయితే, ముస్లింలు, దళితులు, యాదవులు గణనీయ సంఖ్యలో ఉండటం, వారు బీజేపీకి ఓటేసే అవకాశం లేకపోవడం ఆ పార్టీని దెబ్బతీసే అంశం. పై కారణాల వల్ల ఈ స్థానాల్లో బీజేపీ బోణీ కొట్టలేకపోవచ్చు. ఇన్నాళ్లూ బీఎస్పీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న దళితులను తమవైపు తిప్పుకోవడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. దాంతోపాటు గుజరాత్ మోడల్ అభివృద్ధి మంత్రం, మోడీ ఓబీసీ వర్గానికి చెందినవాడంటూ ఓబీసీ కార్డు ఉపయోగించడం ద్వారా ఓట్లను రాబట్టాలనుకుంటోంది. ఈ ప్రయత్నంలో బీజేపీ ఎంతవరకు సఫలం అవుతుందన్నది ఫలితాల తరువాతే తెలుస్తుంది. కాంగ్రెస్ 2009లో గెలుచుకున్న స్థానాల్లో మెజారిటీ స్థానాలను కోల్పోనుంది. వాటిని కుల సమీకరణాల ప్రభావంతో ఎస్పీ, బీఎస్పీ, లేదా బీజేపీ తమ ఖాతాలో వేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్గాంధీ పోటీ చేస్తున్న అమేథీపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. రాహుల్గాంధీపై టీవీ నటి స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపింది. వారిద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. 16 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న సుల్తాన్పూర్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ అక్కడ వరుణ్ గాంధీని పోటీలో నిలిపింది. వరుణ్గాంధీపై కాంగ్రెస్ టికెట్పై ‘రాణీ సాహెబా’ అమితా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆమె భర్త సిట్టింగ్ ఎంపీ ‘రాజా సాహెబ్’ సంజయ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్-6 రాష్ట్ర వాయువ్య ప్రాంతంలోని పురూలియా, మేదినీపూర్, ఝార్గ్రామ్(ఎస్సీ), బంకురా, బిష్ణుపూర్, అసన్సోల్(ఎస్సీ) నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఇవి వామపక్షాలకు కంచుకోటల్లాంటి సీట్లు. వీటిలో మేదినీపూర్, అసన్సోల్, బిష్ణుపూర్లలో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ ఆరు స్థానాల్లో సీపీఎం 4, సీపీఐ 1, ఎఫ్బీఎల్ 1 గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో అసన్సోల్ నుంచి సీపీఎం తరఫున బరిలో ఉన్న సిటింగ్ ఎంపీ బాంగ్సా గోపాల్ చౌధరీ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రఖ్యాత బెంగాలీ గాయకుడు బాబుల్ సుప్రియో, తృణమూల్ టికెట్పై పోటీ చేస్తున్న డోలా సేన్ ఆయనకు గట్టి పోటీనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాల నుంచి కొన్ని స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉందని, ఓటర్లను ప్రలోభపెడ్తున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలు.. ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆ పార్టీ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. మే 12న రాష్ట్రంలోని మరో 18 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్-2 జమ్మూ కాశ్మీర్లోని లడఖ్, బారాముల్లా-కుప్వారా నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన లడఖ్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి తరఫున బౌద్ధుడైన త్సెరింగ్ సంఫాల్ పోటీ చేస్తుండగా, బీజేపీ కూడా మరో బౌద్ధుడు థుప్సాన్ చెవాంగ్ను రంగంలోకి దించింది. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గులాం రజా వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. బౌద్ధుల ఓట్లలో చీలిక ఫలితంగా గులాం రజాకు విజయావకాశాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. గత 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థి గులాం హసన్ ఖాన్ ఈసారి పోటీ చేయడం లేదు. ఇక బారాముల్లా-కుప్వారా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన సిట్టింగ్ ఎంపీ షరీఫుద్దీన్ షేక్ పోటీ చేస్తుండగా, పీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యే ముజఫర్ హుస్సేన్ బేగ్ను రంగంలోకి దించింది. ఇక్కడ ద్విముఖ పోటీ హోరాహోరీగా ఉంది. మరోవైపు, ఎన్నికలను బహిష్కరించాలంటూ జేకేఎల్ఎఫ్, హురియత్ కాన్ఫరెన్స్ నేతలు యథా ప్రకారం పిలుపునివ్వడంతో ఈ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. మన ఎన్నికలు.. అమెరికా కంపెనీలు దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అమెరికాకు చెందిన మూడు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లయిన ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేందుకు వేదికగా నిలిచాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా అనేకమంది అభ్యర్థులు, అన్ని పార్టీలు తమ ప్రచారానికి ఈ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగించుకున్నాయి. ఏడవ దశ ఎన్నికలు ముగిసిన తరువాత ట్విటర్లో 4.9 కోట్ల ఎన్నికలకు సంబంధించిన కామెంట్లు, చర్చలు చోటు చేసుకున్నాయంటే జనబాహుళ్యంలోకి అవి ఎంతగా చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల కోసం ఫేస్బుక్ గత సంవత్సరం నుంచే సన్నాహాలు ప్రారంభించిందని ఆ కంపెనీ పాలసీ మేనేజన్ కేటీ హాబత్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఈ మార్చిలో ఫేస్బుక్లో ‘ఎలక్షన్ ట్రాకర్’ను ప్రారంభించామని తెలిపారు.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement