-
ప్రైవేటు ల్యాబ్ల దందా: మోసం గురో..!
పలమనేరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్కు స్వలంగా జ్వరం రావడంతో ఆందోళనకు గురయ్యాడు. కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని స్థానిక మారెమ్మవీధిలోని ఓ ల్యాబ్కు వెళ్లాడు. సదరు ఇంజినీర్ టెన్షన్ను గుర్తించిన ల్యాబ్ నిర్వాహకుడు 10నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్ ఇస్తానని, అందుకు రూ.5వేలు చెల్లించాలని స్పష్టం చేశాడు. దీంతో చేసేదిలేక ఆ వ్యక్తిరూ.5వేలు ముట్టజెప్పి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. బైరెడ్డిపల్లెకు చెందిన ఓ రైతుకు ఒళ్లునొప్పులతో కూడిన జ్వరం వచ్చింది. ఇరుగుపొరుగు వారు కరోనా వచ్చిందేమో అని భయపెట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే అందరికీ తెలిసిపోతుందని అతను ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాడు. ఆ రైతు పరిస్థితిని గమనించిన ల్యాబ్ నిర్వాహకుడు రూ.3వేలు ఇస్తేనే కోవిడ్ పరీక్ష చేస్తానని తేలి్చచెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్వాహకుడు అడిగింది రైతు చెల్లించుకోవాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు.. కోవిడ్ విజృంభణతో జనం బెంబేలెత్తుతున్నారు.. వైరస్ నిర్ధారణ పరీక్షలకు పరుగులు తీస్తున్నారు.. కరోనా టెస్ట్లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నా పలువురు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల భయాందోళనను ల్యాబ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు మాత్రమే చేస్తూ ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నారు. కచ్చితత్వం లేని ఫలితాలతో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. నమ్మి వచ్చినవారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలమనేరు: జిల్లాలో దాదాపు 458 ప్రైవేటు ల్యాబ్లు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేని ల్యాబ్లలో కోవిడ్ పరీక్షలు చేయకూడదు. అయితే పలు ల్యాబ్ల నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్ మేరకు ధరలు పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. కోవిడ్ నిర్థారణకు ప్రస్తుతం మూడు రకాల పరీక్షలు చేస్తున్నారు. అందులో ట్రూనాట్ పరీక్ష ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. వీటి కచ్చితత్వం 85శాతంగా ఉంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలకు ప్రస్తుతం 3రోజులు పడుతోంది. దీని కచ్చితత్వం 90 శాతంగా ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని కొంతమంది ప్రైవేటు ల్యాబ్లలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లకు మొగ్గుచూపుతున్నారు. దీని కచ్చితత్వం కేవలం 70 శాతం మాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ టెస్ట్కోసం ఆధార్, మొబైల్ నెంబర్లను ఐసీఎంఆర్( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెబ్లో నమోదు చేసి ఐడీ నెంబర్ను తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ ఇదే ప్రామాణికం. కానీ ప్రైవేటు ల్యాబ్లో ఇవేమీ లేకుండానే పరీక్షలు చేసేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ఇష్టానుసారంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. గంటలో ఫలితం కావాలంటే రూ.2వేలు అరగంటలో కావాలంటే రూ.3 వేలు, 10నిమిషాల్లో స్పాట్ రిజల్ట్ కావాలంటే రూ.5వేలని ప్రజలను పిండేస్తున్నారు. ప్రాణాలకే ప్రమాదం ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్న పాజిటివ్ వ్యక్తులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో రోగం ముదరబెట్టుకుంటున్నారు. చివరకు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ గురై శ్వాస సమస్యలు ఉత్పన్నమైన తర్వాతే ఆస్పత్రులకు వెళుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు. ఇక కొంతమంది పాజిటివ్ వ్యక్తులకు కూడా ప్రైవేటు ల్యాబ్లలో నెగటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో వారు యథేచ్ఛగా సంచరిస్తూ కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీనిపై పలమనేరు కోవిడ్ అధికారి డాక్టర్ విశ్వనాథ్ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ల్యాబ్లలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నది నిజమేనన్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిందని తెలిపారు. ప్రజల భయాన్ని ఆసరాగా తీసుకుని అనధికారికంగా పరీక్షలు చేస్తూ నగదు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు ల్యాబ్ల దందాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
‘కరోనా’ దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్ ల్యాబ్లు బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధరల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా, తెలంగాణలో మాత్రం తగ్గిన ధరలు అమలు కావట్లేదు. ఆ మేరకు తక్కువ వసూలు చేయాలన్న ఆదేశాలనూ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఇవ్వలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ లేబొరేటరీలు తక్కువ ధరకు కిట్లను కొని ఎక్కువ ధరకు టెస్టులు చేస్తుండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసినందుకు రూ. 3 వేలపైనే వసూలు చేస్తున్నారు. మరోవైపు పీపీఈ కిట్ల ధరలను కూడా అధికంగా వేస్తూ లేబరేటరీలు సహా ఆసుపత్రులు బాధితుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అలాగే కరోనా రోగులు వాడే రెమిడెసివీర్ ఇంజక్షన్ ధర కూడా మార్కెట్లో తగ్గినా, పాత ధరనే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రైవేట్లో 50చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 50 చోట్ల ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 1,200 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పాజిటివ్గానే పరిగణిస్తారు. అందులో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్ట్పీసీఆర్ పరీక్ష చేయాలన్నది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిబంధన. దీంతో ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు బాధితులు ప్రైవేట్ లేబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ లేబరేటరీల్లో రోజూ 2,500 నుంచి 3 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. 90 శాతం ధరలు తగ్గినా.. తగ్గని దోపిడీ కరోనా విజృంభించిన కొత్తలో ఒక్కో ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.2,500 ఖర్చయ్యేది. దేశంలో రెండు మూడు కంపెనీలే కరోనా నిర్ధారణ కిట్లను తయారుచేయడం, డిమాండ్ ఎక్కువుండటంతో కిట్ల ధరలు ఆ స్థాయిలో ఉండేవి. పైగా చాలా తక్కువచోట్ల పరీక్షలు జరిగేవి. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం మొదట్లో పుణేకు కారులో శాంపిళ్లను పంపించేవారు. తర్వాత గాంధీ వైరాలజీ లేబొరేటరీల్లో కరోనా పరీక్షలు మొదలయ్యాయి. ఆపై ప్రభుత్వం ప్రైవేట్ల లేబ్ల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలకు అనుమతిచ్చింది. అప్పటికి కిట్ల ధరలు కాస్తంత తగ్గడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రభుత్వం రూ.2,200 ధర నిర్ధారించింది. ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లి టెస్ట్చేస్తే రూ.2,800 వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అయినా కొన్ని లేబ్లు పీపీఈ కిట్ ధరను కూడా కలిపి రూ.4 వేల వరకు వసూలు చేసేవి. ప్రస్తుతం కూడా రూ.3,500 వరకు వసూలు చేస్తున్న లేబొరేటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ కిట్లను దేశంలో దాదాపు 180 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అవన్నీ పోటీపడి బిడ్లు వేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కిట్ల ధర రూ.250కి పడిపోయిందని వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అంటే ఒకప్పుడు సుమారు రూ.2,500 ఉన్న కిట్ ధర, ఇప్పుడు రూ.250కి పడిపోయింది. అంటే 90 శాతం మేర కిట్ల ధరలు తగ్గాయన్నమాట. దీంతో కేంద్రం గతంలో రూ.2,200 ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫీజును రూ.950కి తగ్గించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రైవేట్ లేబొరేటరీలు రూ.2,800 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నాయి. అంతేగాక ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ధర ఒకప్పుడు రూ.504 వరకు ఉండగా, ఇప్పుడు రూ.275కు తగ్గింది. కానీ అనుమతి లేకున్నా కొన్ని ప్రైవేట్ లేబొరేటరీలు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ రూ.2 వేలపైనే వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కిమ్మనడం లేదు. రెమిడెసివీర్ ధర వెయ్యి తగ్గుదల ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగులకు వైరస్ తీవ్రతను బట్టి రెమిడెసివీర్ ఇంజక్షన్ ఇస్తారు. గతంలో దీని ధర రూ.3 వేలు ఉండగా, ఇప్పుడది రూ.2 వేలకు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని ఆసుపత్రులు మాత్రం పాత ధర కాదు కదా రూ.4 వేలకు మించి వసూలు చేస్తున్నాయని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతెందుకు పీపీఈ కిట్ ధర మొదట్లో రూ.600 వరకు ఉండేది. ఇప్పుడది రూ.250 నుంచి రూ.300 మధ్యకే దొరుకుతుంది. కానీ ఆసుపత్రులు మాత్రం రూ.600 నుంచి రూ.1,000 వరకు పీపీఈ కిట్ ధర ఫీజులో కలిపి బిల్లు వేస్తున్నాయి. ఇక రూ.200 – రూ.250 ఉండే ఎన్–95 మాస్క్ ధర ఇప్పుడు రూ.13కి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రుల్లో రూ.250 వరకు ఫీజులో కలిపి చూపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ లేబొరేటరీల్లో సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసినప్పుడు బాధితులు తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనంటూ రూ.250 వసూలు చేస్తున్నాయి. ఇక త్రీలేయర్ సర్జికల్ మాస్క్ ధర గతంలో రూ.8 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇప్పుడు వాటి ధర 80 పైసలకు పడిపోయింది. అయినా ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీలు మాత్రం పాత ధరలనే వసూలు చేస్తూ కరోనా బాధితుల్ని పిండేస్తున్నాయి. ఔను.. కిట్ల ధరలు తగ్గాయి కరోనా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గాయి. ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.250కి, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ధర రూ.275కి తగ్గింది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా చేస్తున్నందున తగ్గిన ధరల ప్రకారమే కిట్లను కొనుగోలు చేస్తాం. దీనివల్ల ప్రభుత్వం కిట్లకు అధికంగా సొమ్ము కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక రెమిడిసివీర్ ఔషధం, ఎన్–95 మాస్క్లు, సర్జికల్ మాస్క్ల ధరలు భారీగా తగ్గాయి. – చంద్రశేఖర్రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
ప్రైవేట్ లేబొరేటరీల మాయాజాలం
♦హైదరాబాద్లో అదో ప్రముఖ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్. అందులో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయితే పరీక్షకు ముందు బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ చేసే పరీక్షల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్కు చేరడం లేదు. ♦ఖమ్మంలో ఓ ప్రైవేట్ లేబొరేటరీ ఉంది. దానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కానీ యాంటిజెన్ కిట్లను తెచ్చి పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కాపత్రం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రైవేట్ లేబొరేటరీల్లో ఇష్టారాజ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నాయి. కొన్ని కనీస ప్రొటోకాల్ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో వాటిల్లో ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయో కూడా ప్రభుత్వ వర్గాలకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు లేవు..: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్లో 35 డయాగ్నస్టిక్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్ నంబర్ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్సైట్లో ముందుగా అప్లోడ్ చేయాలి. తక్షణమే ఆ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్సైట్లో ఒక కోడ్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఆర్టీ–పీసీఆర్ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్ లేకుండా ఇచ్చే టెస్ట్ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పైగా ఎంతమంది పాజిటివ్గా ఉన్నారో కూడా సమాచారం బయటకు రావడంలేదు. అనుమతిలేని లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు... రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని వందలాది చిన్నాచితక లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా ప్రైౖ వేట్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అనుమతే లేదు. కానీ వాటిల్లో అక్రమంగా ఈ దందా కొనసాగుతోంది. తయారీ కంపెనీల నుంచి యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేసి పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీల్లోని కొందరు టెక్నీషియన్లకు స్వాబ్ శాంపిళ్లు తీసే శిక్షణ కూడా ఉండదు. కానీ ఏదో రకంగా శాంపిళ్లు తీసి అరగంటలోపే ఫలితం వెల్లడిస్తున్నారు. కొన్ని లేబొరేటరీలైతే ఇళ్లకు పంపించి టెస్టులు చేయిస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా నిర్వహించే కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు ప్రభుత్వ సంఖ్యలోకి రావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్ లేబొరేటరీలకు వరంగా మారింది. ఇంత జరుగుతున్నా కిందిస్థాయి వైద్య, ఆరోగ్య అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
రేపట్నుంచి ప్రైవేటులో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్లలో ప్రభుత్వ ఆదేశాలతో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని లేబొరేటరీలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా పరీక్షలు చేయడం, మరి కొన్ని చోట్ల లక్షణాలు లేకున్నా పరీక్షలు నిర్వహించడం, ఐసీఎంఆర్ పోర్టల్లో పరీక్షల వివరాలను అప్లోడ్ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం లోపాలున్న వాటికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కొన్ని లేబొరేటరీలు వివరణ ఇచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నిబంధనలను పాటిస్తూ తిరిగి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు కొన్ని లాబ్ల యాజమాన్యాలు తెలిపాయి. ఐసీఎంఆర్ పోర్టల్లో ఇప్పటివరకు చేసి న పరీక్షల వివరాల్ని నమోదు చేసే ప్ర క్రియ పూర్తి కావొచ్చిందని వివరించాయి. విన్నపాల వెల్లువ కరోనా కేసులు రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రోజూ దాదా పు 2 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకోవాలంటే అక్కడ టెస్టుల సామర్థ్యం పూర్తిస్థాయిలో లేదన్న భావన ప్రజల్లో నెలకొంది. మరోవైపు ప్రైవేటులో చేయించకుందామంటే వారం రోజులుగా వాటిల్లో పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది కరోనా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్నారు. కరోనా లక్షణాలు, అనుమానాలున్న వా రంతా తక్షణమే పరీక్షలు చేయాలని విన్నవిస్తున్నారని లాబ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పక్కాగా ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు లేబొరేటరీల వర్గాలు వెల్లడించాయి. జర్మనీ కిట్లు వాడుతున్నాం మేం నాణ్యమైన కిట్లతోనే పరీక్షలు చేస్తున్నాం. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ కిట్స్ వాడుతున్నాం. నిర్ధారణ పరీక్షల్లో ఎక్కడా రాజీ పడట్లేదు. వైరస్ విజృంభణ సమయంలో వ్యాపార కోణంలో ఆలోచించట్లేదు. పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చా క 12 వేల మందికి పరీక్షలు చేశాం. వాటిల్లో పాజి టివ్ వచ్చిన వారి రిపోర్టులను తక్షణ వైద్యం కో సం వేగంగా అందజేశాం. వాటన్నింటినీ ఐసీఎంఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయడంలో కొం త ఆలస్యం జరిగింది. అందుకే కొంత విరామం తీసుకొని వాటన్నింటినీ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాం. రోజూ ఉదయం 9 నుంచి రా త్రి 11 వరకు ఫలితాల అప్లోడ్కు సమయం కేటా యిస్తూ పనిచేస్తున్నాం. ఈ పని మంగళవారం ము గించి బుధవారం నుంచి కరోనా పరీక్షలు చేస్తాం. ఎంత మందికైనా పరీక్షలు చేయగలం.– సుప్రితారెడ్డి, ఎండీ, విజయ డయాగ్నస్టిక్స్ -
ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాకం.. అధికారులకు టెన్షన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement