-
నిమిషం ఆలస్యమైనా తీసుకోం
‘కానిస్టేబుల్’ దరఖాస్తులపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిబ్రవరి 4 అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు కోసం మీసేవా, ఆన్లైన్లలో డీడీలు తీసి, ఆ తర్వాత తీరిగ్గా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తామన్నా కుదరదంది. ఒక వేళ డీడీలు తీసి, సబ్మిట్ చేయడంలో ఆలస్యం అయితే డబ్బులు తిరిగి చెల్లిం చబడవని రిక్రూట్మెంట్బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 3.78 లక్షల దరఖాస్తుల్లో బీసీ సామాజిక వర్గం నుంచే అత్యధికంగా 1,98,998 అందినట్టు బోర్డు వెల్లడించింది. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం అత్యధికంగా ఎస్టీ అభ్యర్థుల నుంచే దరఖాస్తులు అందాయంది. ఈ జిల్లాలో బీసీల నుంచి 11,304, ఎస్టీల నుంచి 15,978 దరఖాస్తులు వచ్చాయని బోర్డు పేర్కొంది. -
జానీమూన్కు కిరీటం
సాక్షి,గుంటూరు: జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తొలి సారి ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ జానీమూన్ను జెడ్పీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్గా తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లపూడి పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి అయిన కలెక్టర్ సురేశ్కుమార్ నుంచి చైర్పర్సన్ జానీ మూన్ జెడ్పీ బాధ్యతలు స్వీకరించడంతో నూతన పాలకవర్గం కొలువు దీరినట్టయింది. ఎన్నిక జరిగిందిలా... జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు శనివారం అట్టహాసంగా జరి గాయి. తొలుత ఉదయం 10 గంటలకు ప్రిసైడింగ్ అధికారి సురేశ్కుమార్ ఇద్దరు కోప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్గా జానీమూన్, వైస్చైర్మన్గా వడ్లపూడి పూర్ణచంద్రరావులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రిసైడింగ్ అధికారి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత చేబ్రోలు జెడ్పీటీసీ సభ్యురాలు అత్తోట సుధారాణి, చివరగా దుర్గి జెడ్పీటీసీ సభ్యురాలు కొనకంచి హైమావతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విధంగా మొత్తం 57 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయింది. 10 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకార పత్రం చదవలేకపోయారు. అమృతలూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ పృథ్వీలత ఇంగ్లిషులో ప్రమాణస్వీకారం చేశారు. అజెండాలో రెండవ అంశంగా ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టారు. ఈ రెండు స్థానాలకు నక్కా సువర్ణరాజు ( బాపట్ల), రాజేష్ కుమార్ (మాచర్ల) ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యా హ్నాం మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగుతుందనిప్రకటించి సమావేశాన్ని వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిసైడింగ్ అధికారి సురేష్కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ స్థానానికి, వైస్ చైర్మన్ స్థానానికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. చైర్పర్సన్ అభ్యర్థి షేక్ జానీమూన్ను జెడ్పీటీసీ సభ్యురాలు పృథ్వీలత ప్రతిపాదించగా, మేకా శివరామకృష్ణ బలపరిచారు. వైస్చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావును కె.శ్రీనివాసరావు ప్రతిపాదించగా, సాయిబాబా బలపరిచారు. వెంటనే వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం షేక్ జానీమూన్తో జెడ్పీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు ఆమెకు అప్పజెబుతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆ తరువాత వైస్ చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 23 మంది చైర్పర్సన్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే),కోన రఘుపతి పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కేంద్ర సర్వీసులోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ సురేశ్కుమార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు తెనా లి శ్రావణకుమార్, అనగాని సత్యప్రకాష్, దూళిపాళ్ల నరేంద్ర,ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్,ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, డీసీసీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు. జెడ్పీ సీఈఓ సుబ్బారావు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement